Prashant Kishor: పవన్ కళ్యాణ్ తో( AP deputy CM Pawan Kalyan ) జగన్ పొత్తు పెట్టుకునేందుకు ప్రయత్నాలు చేసినట్లు తాజాగా వార్తలు వస్తున్నాయి. తమిళనాడు ఎన్నికల ఫలితాలతో ఈ ప్రచారం జోరుగా సాగుతోంది. అక్కడ విజయ్ నేతృత్వంలో టీవీ కే ఒంటరిగా పోటీ చేసి పెద్ద పార్టీగా అవతరించింది. దీంతో విజయ్ ను పవన్ కళ్యాణ్ తో పోల్చుతూ ట్రోల్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. జగన్మోహన్ రెడ్డి గతంలోనే పవన్ కళ్యాణ్ తో పొత్తుకు ప్రయత్నించారన్న విషయాన్ని బయట పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. సింహం సింగిల్ గా వస్తుంది అంటూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు జగన్మోహన్ రెడ్డి విషయంలో ఎలివేషన్లు ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు విజయ్ తమిళనాడులో ఒంటరిగా గెలవడంతో ఈ ప్రచారాన్ని మరింత పదును పెట్టారు. దానికి విరుగుడుగా ప్రశాంత్ కిషోర్ ఈ విషయాన్ని చెప్పినట్లు సోషల్ మీడియాలో ఇప్పుడు ప్రచారం జరుగుతోంది.
* అప్పట్లో బీజేపీ సహకారం..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒంటరి పోరాటం చేయవచ్చు కానీ.. ఆ పార్టీ తెరవెనుక చాలా రాజకీయ వ్యూహాలను అమలు చేస్తోంది. 2019లో ఆ పార్టీ గెలవడానికి బిజెపి పరోక్ష సహకారం ఉందన్నది బహిరంగ రహస్యం. ఎందుకంటే ఎన్ డి ఏ నుంచి చంద్రబాబు బయటకు వెళ్లిపోవడం.. మోడీ నాయకత్వాన్ని ప్రశ్నిస్తూ దేశవ్యాప్తంగా పర్యటనలు చేయడం వంటివి బిజెపి పెద్దల ఆగ్రహానికి కారణం అయ్యాయి. జగన్ పట్ల సానుకూలతలు వ్యక్తం కావడానికి దోహదపడ్డాయి. అంటే పొత్తు పెట్టుకోకుండా.. సీట్ల సర్దుబాటు లేకుండా జగన్మోహన్ రెడ్డికి బిజెపి సహకరించినట్టే కదా. కానీ ఈ విషయాన్ని మరిచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పదేపదే సింహం సింగిల్ గా వస్తుంది.. ఒంటరి పోరాటం అంటూ పెద్ద పెద్ద మాటలు చెబుతూ వస్తున్నారు. ఇప్పుడు విజయ్ ఒంటరి పోరాటానికి.. అక్కడ గెలుపునకు జగన్మోహన్ రెడ్డి కారణం అని చెప్పే ప్రయత్నం చేస్తుండడం మాత్రం కొంచెం ఇబ్బందిగా ఉంది.
* నంద్యాలలో ఓటమితో..
2014 నుంచి 2019 మధ్య వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది. ఆ సమయంలో ఆ పార్టీకి వ్యూహకర్తగా పనిచేశారు ప్రశాంత్ కిషోర్. ఆ పార్టీ ప్రతి వ్యూహంలోనూ ఆయన ఉన్నారు. అయితే తాజాగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎలివేషన్లు ఇస్తుండడంతో ప్రశాంత్ కిషోర్ రంగంలోకి దిగినట్లు సమాచారం. గతంలోనే జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ పార్టీతో పొత్తు కోసం ప్రయత్నం చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. టిడిపి ప్రభుత్వ హయాంలో నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక వచ్చింది. అది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ స్థానం. అయినా సరే అక్కడ టిడిపి ఘనవిజయం సాధించింది. అయితే ఆ ఫలితంతో జగన్మోహన్ రెడ్డి నైరాస్యంలో పడిపోయారు. 2019లో గెలవాలంటే కచ్చితంగా పవన్ కళ్యాణ్ జనసేన తో పొత్తు పెట్టుకోవాలన్న నిర్ణయానికి వచ్చారు.. కానీ ఆ ప్రతిపాదనను జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకించారు. అదే విషయాన్ని తాజాగా ప్రశాంత్ కిషోర్ బయట పెట్టినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.