Palnadu District Collector: మతం మారిన ఎంతోమంది.. మత ప్రబోధకులు గా మారి.. ఒక మతం షెడ్యూల్ కుల ధ్రువీకరణ పొందుతూ చాలా రకాల ప్రయోజనాలు పొందుతున్నారు. అటువంటి వారికి చెంపపెట్టు లా మారింది ఓ ఘటన. పల్నాడు జిల్లాకు చెందిన ఓ పాస్టర్ ఎస్సీ కుల ధ్రువీకరణ ను రద్దు చేస్తూ జిల్లా కలెక్టర్ తీసుకున్న నిర్ణయం పై భిన్న స్వరం వినిపిస్తోంది. అక్కడ ఓ వ్యక్తి ఒక మతం నుంచి వేరే మతం స్వీకరించి.. మత ప్రబోధకుడిగా మారారు. కానీ హిందూ మత షెడ్యూల్ కుల ధ్రువీకరణ పొంది.. దాని ద్వారా అన్ని ఫలాలను అనుభవిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ వ్యక్తి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ మార్గదర్శకాలు ప్రకారం పల్నాడు జిల్లా కలెక్టర్ షెడ్యూల్డ్ ధ్రువీకరణను రద్దు చేశారు.
* వారి విషయంలో ఉదాసీనత..
దేశంలో రిజర్వేషన్ ఫలాల దుర్వినియోగం యథేచ్ఛగా సాగిపోతోంది. ఒక మతానికి, ఒక కులానికి రిజర్వేషన్లు కల్పిస్తామన్న ప్రభుత్వ ఆలోచనలను.. అప్పటివరకు రిజర్వేషన్ ఫలాలను అనుభవిస్తున్న వారు అభ్యంతరం చెబుతున్నారు. కానీ మతం మారి.. మత ప్రబోధకులుగా మారి.. పాత మతం ద్వారా.. షెడ్యూల్డ్ దృవీకరణ పొంది లక్షలాదిమంది రిజర్వేషన్ ఫలాలను పొందుతున్నారు. అటువంటి వారి విషయంలో రిజర్వేషన్లు అనుభవిస్తున్న వారి నుంచి ఎటువంటి అభ్యంతరాలు రావడం లేదు. ఇది నిజంగా బాధ కలిగించే విషయం. ఆర్థిక, సామాజిక వెనుకబాటుతో కొన్ని కులాలను షెడ్యూల్డ్ కులాల్లో చేరుస్తామని ప్రభుత్వం ప్రకటిస్తే వెంటనే ఉద్యమాలు వస్తున్నాయి. కానీ మతం మాటున షెడ్యూల్డ్ ధ్రువీకరణతో తమ అవకాశాలను కొల్లగొడుతున్న వారి విషయంలో ఉదాసీనత కొనసాగుతోంది.
* అటువంటి వారికి చెంపపెట్టు..
కోర్టు మార్గదర్శకాలు ప్రకారం పల్నాడు జిల్లా కలెక్టర్ తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది. నిజమైన, అర్హులకు రిజర్వేషన్ ఫలాలు అందడంలో ఎటువంటి తప్పులేదు. కానీ ఒక మతం నుంచి వేరే మతానికి మారి.. పాత మతాన్ని దూషించి.. అదే మతం ద్వారా షెడ్యూల్డ్ కుల ధ్రువీకరణ పొందిన వారి విషయంలో మాత్రం కఠినంగా వ్యవహరించాల్సి ఉంది. పల్నాడు జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఇప్పుడు అటువంటి వారికి చంపపెట్టు. కచ్చితంగా దీనిపై సత్వర చర్యలు మొదలు కావాలి. రాష్ట్రవ్యాప్తంగా ఇలా ధ్రువీకరణ పత్రాలు పొందుతున్న వారి విషయంలో చర్చ జరగాలి. అప్పుడే నిజమైన షెడ్యూల్డ్ కులాలకు న్యాయం జరుగుతుంది.
