spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Nara Lokesh: లోకేష్ కు ప్రమోషన్ .. టిడిపి జంబో కమిటీ ఇదే

Nara Lokesh: లోకేష్ కు ప్రమోషన్ .. టిడిపి జంబో కమిటీ ఇదే

Nara Lokesh: ఎట్టకేలకు తెలుగుదేశం లో చిన్న బాబుకు ప్రమోషన్ దక్కింది. నారా లోకేష్ కు తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమిస్తూ చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. టిడిపి పొలిట్ బ్యూరోతో పాటు జాతీయ, రాష్ట్ర కమిటీలను ప్రకటించింది. ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస్ కొనసాగనున్నారు. మొత్తం 29 మందితో పొలిట్ బ్యూరోను ప్రకటించారు. 31 మందితో జాతీయ కమిటీ, 185 మందితో టీడీపీ రాష్ట్ర కమిటీని ప్రకటించారు. జాతీయ కార్యదర్శులుగా ముగ్గురు, జాతీయ ఉపాధ్యక్షులుగా 18 మందికి అవకాశం ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులుగా చంద్రబాబు కొనసాగనున్నారు.

* పొలిట్ బ్యూరో సభ్యులు వీరే..
పార్టీ పొలిట్ బ్యూరోకు సంబంధించి.. నారా చంద్రబాబు నాయుడు, కింజరాపు అచ్చం నాయుడు, గుమ్మడి సంధ్యారాణి, గంట్యాడ శ్రీదేవి, వంగలపూడి అనిత, యనమల రామకృష్ణుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, జ్యోతుల నెహ్రూ, పితాని సత్యనారాయణ, నిమ్మల రామానాయుడు, మహమ్మద్ షరీఫ్, మంతెన రామరాజు, కొల్లు రవీంద్ర, వర్ల రామయ్య, శ్రీరామ్ రాజగోపాల్, గుత్తికొండ ధనంజయ్, నందమూరి బాలకృష్ణ, నక్క ఆనంద్ బాబు, అనగాని సత్యప్రసాద్, పిడుగురాళ్ల మాధవి, దగ్గుమల్ల ప్రసాదరావు, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, బీసీ జనార్దన్ రెడ్డి, కాలువ శ్రీనివాసులు, అరవింద్ కుమార్ గౌడ్, బక్కిన నరసింహులు సభ్యులుగా ఉండనున్నారు. ఇక ఎక్స్ ఆఫీషియో సభ్యులుగా నారా లోకేష్, పల్లా శ్రీనివాసరావు, లావు శ్రీకృష్ణదేవరాయలు ఉండనున్నారు.
* జాతీయ ప్రధాన కార్యదర్శులుగా కింజరాపు రామ్మోహన్ నాయుడు, బైరెడ్డి శబరి, కిలారు రాజేష్ వ్యవహరించనున్నారు.
* జాతీయ ఉపాధ్యక్షులుగా దువ్వారపు రామారావు, మహమ్మద్ నజీర్, సానా సతీష్, రెడ్డి సుబ్రహ్మణ్యం, పీతల సుజాత, ముల్లపూడి బాపిరాజు, ఎం వెంకటేశ్వరరావు, కంభంపాటి రామ్మోహన్ రావు, బూరగడ్డ వేదవ్యాస్, కన్నా లక్ష్మీనారాయణ, వై వి బి రాజేంద్రప్రసాద్, బుద్ధ వెంకన్న, డిడి జనార్దన్ రావు, నొకసాని బాలాజీ, బొల్లినేని రామారావు, బాలిశెట్టి హరిప్రసాద్, బి రామ్ గోపాల్ రెడ్డి, మాధవ నాయుడు ఉండనున్నారు.
* జాతీయ అధికార ప్రతినిధులుగా కలిసేట్టి అప్పలనాయుడు, తెన్నేటి కృష్ణ ప్రసాద్, కొమ్మారెడ్డి పట్టాభిరామ్, ఆనం వెంకటరమణారెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, గుణపాటి దీపక్ రెడ్డి, బి కే పార్థసారథి, ఎన్ విజయకుమార్, నన్నూరి నర్సిరెడ్డి
* రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా గౌతు శిరీష, చింతకాయల విజయ్, పరుచూరి అశోక్ బాబు, దేవినేని ఉమామహేశ్వరరావు, పాశం సునీల్ కుమార్, వి ఎస్ ముక్తియర్, ఎన్ అమర్నాథ్ రెడ్డి నియమితులయ్యారు.
* రాష్ట్ర ఉపాధ్యక్షులుగా తమ్మినేని సుజాత, కిమిడి కళా వెంకట్రావు, పిఠాపురం వర్మ, వనమాడి వెంకటేశ్వరరావు, పంచుమర్తి అనురాధ, బోండా ఉమామహేశ్వరరావు, కొమ్మాలపాటి శ్రీధర్, తెనాలి శ్రావణ్ కుమార్, భాష్యం శ్రీ రామకృష్ణ, కే బుజ్జి రాంప్రసాద్, వి ఆర్ లక్ష్మి, షేక్ అబ్దుల్ అజీజ్, డాక్టర్ సంజీవ్ కుమార్, ఆకేపోగు ప్రభాకర్, తిప్పేస్వామి, నరసింహ యాదవ్
* రాష్ట్ర అధికార ప్రతినిధులుగా కూన రవికుమార్, కావలి గ్రీష్మ, చల్లారపు రామ్మోహన్ నాయుడు, సుంకర పావని, గొల్లపల్లి అమూల్య, దాసరి శ్యామ్ చంద్ర శేషు, డూండి రాజేష్, ఎమ్మెస్ బేగ్, వసంత కృష్ణ ప్రసాద్, ఉండవల్లి శ్రీదేవి, రమ్య పరుచూరి, కాటంరెడ్డి గిరిధర్ రెడ్డి, జయ నాగేశ్వర్ రెడ్డి, మద్ది పట్ల సూర్య ప్రకాష్ నియమితులయ్యారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version