JC Asmith Reddy: మార్కెట్లోకి డ్రైవర్ లెస్ కార్లు అందుబాటులోకి వస్తున్నాయి. ప్రస్తుతం విదేశాల్లో ఇవి చలామణి అవుతున్నాయి. ఎంతోమంది సెలబ్రిటీలు ఈ డ్రైవర్ లెస్ కారులో ప్రయాణించి ఎంతో అనుభూతి పొందుతున్నారు. డ్రైవర్ లేకుండా ముందుకు సాగే ఈ కారులో ప్రయాణం ఒక కొత్త అనుభూతి. అటువంటి అనుభూతి తన కుటుంబ సభ్యులతో పొందారు టిడిపి ఎమ్మెల్యే. డ్రైవర్ లెస్ కారులు కుటుంబంతో ప్రయాణించి తన అనుభవాన్ని పంచుకున్నారు. మొదటిసారి డ్రైవర్ లెస్ కారులో ప్రయాణించడం ఎంతో ఆనందంగా ఉందంటూ తాడిపత్రి ఎమ్మెల్యే జెసి అస్మిత్ రెడ్డి ఒక వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
* విదేశాల్లో కుటుంబంతో..
అనంతపురం జిల్లా తాడిపత్రి ఎమ్మెల్యేగా ఉన్నారు జేసీ అస్మిత్ రెడ్డి. ప్రస్తుతం ఆయన విదేశాల్లో ఉన్నారు. అక్కడ డ్రైవర్ లెస్ కార్లు తన పిల్లలతో కలిసి ప్రయాణం చేసినట్లు ఒక వీడియోను షేర్ చేశారు. డ్రైవర్ లెస్ కారులో తొలిసారి ప్రయాణం చేస్తున్నానని.. తాను ఎంతో సంతోషంగా ఉన్నానంటూ ఆ అనుభూతిని అందరితో పంచుకున్నారు. డ్రైవర్ లేకుండానే ఆ కారు అలా ముందుకు సాగుతోంది. వెనుక సీట్లో ఎమ్మెల్యే తో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే ఈ వీడియో పై నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అటువంటి కారును తాడిపత్రికి తీసుకురావాలని సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.
* మనదేశంలో తక్కువ..
అయితే మన దేశంలో డ్రైవర్ లెస్ కార్లు ఇంకా పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు. కానీ చాలా దేశాల్లో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ తో నడిచే ఈ కార్లు అందుబాటులోకి వచ్చాయి. చివరకు టాక్సీలు సైతం నడుపుతున్నారు ఈ విధానంలో. మన దేశానికి చెందిన ప్రముఖులు విదేశాలకు వెళ్లిన సమయంలో ఈ డ్రైవర్ లెస్ కారులో ప్రయాణిస్తూ సరికొత్త అనుభూతిని పొందుతున్నారు. అమెరికాలో వేమో పేరుతో రోబో టాక్సీ సైతం అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ప్రత్యేకమైన యాప్ ద్వారా డ్రైవర్లు లేని కారులను సైతం బుక్ చేసుకోవచ్చు. ఈ కార్లలో స్పెషల్ కెమెరాలు, రాడార్, లీడర్ సెన్సార్లు కూడా ఉంటాయి.

