Homeఆంధ్రప్రదేశ్‌Jagan Kapu Vote Bank Strategy: జగన్ ప్రయోగాలు కాపులకు ఎరుక!

Jagan Kapu Vote Bank Strategy: జగన్ ప్రయోగాలు కాపులకు ఎరుక!

Jagan Kapu Vote Bank Strategy: రాజకీయాల్లో కొంతమంది పనితీరుతో రాణిస్తారు. మరికొందరు సెంటిమెంట్ రాజకీయాలు నడిపి రాణిస్తారు. రెండో కోణంలో రాణించారు జగన్మోహన్ రెడ్డి. వైయస్ రాజశేఖర్ రెడ్డి పై ఉన్న ప్రజాభిమానాన్ని తాను పొందగలిగారు. తండ్రి మాదిరిగా సంక్షేమ పథకాలు అందించి ప్రజల మనసు గెలవాలని చూసారు. కానీ ప్రజలు మాత్రం జగన్మోహన్ రెడ్డిలో రాజశేఖర్ రెడ్డిని చూసుకోలేదు. మహానేత కుమారుడిగా ఒక్కసారి మాత్రమే ఛాన్స్ ఇచ్చారు. రెండోసారి మాత్రం చాన్స్ ఇవ్వలేదు. అయితే రాజశేఖర్ రెడ్డి చేయలేనంతగా.. కులాలను, వర్గాలను విడదీసి వారి అభిమానాన్ని పొందాలనుకున్నారు జగన్మోహన్ రెడ్డి. కానీ ఒక్కసారి మాత్రమే అందులో కూడా సక్సెస్ అయ్యారు. రెండోసారి విఫలమయ్యారు.

కాపుల మద్దతు అవసరం..
ఏపీలో ఎవరు అధికారంలోకి రావాలన్నా ప్రధాన సామాజిక వర్గంగా ఉన్న కాపులు మద్దతు ఉండాల్సిందే. అయితే ఆ కాపులను 2019 ఎన్నికల్లో టర్న్ చేసుకోవడంలో సక్సెస్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి. కాపు రిజర్వేషన్ ఉద్యమం ద్వారా భారీగా లబ్ధి పొందారు. ఇప్పుడు కూడా అటువంటి వ్యూహాలకు పదును పెడుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి విజయానికి కాపులే కారణమని జగన్మోహన్ రెడ్డి గుర్తించారు. అందుకే వారిలో చీలిక తేవాలని చూస్తున్నారు. కాపుల వేళ్ళతో కాపులను పొడిచే సరికొత్త ప్రయోగం చేస్తున్నారు. కాపు ఓటు బ్యాంకు ను చీల్చడమే కూటమిని దెబ్బతీసే ఏకైక మార్గం అని బలంగా నమ్ముతున్నారు. గత ఎన్నికల్లో కాపులు ఆదరించని వైసీపీ కాపు నేతలు చాలామంది ఉన్నారు. వారిని ముందు పెట్టి ఇప్పుడు రాజకీయ క్రీడ మొదలుపెట్టారు.

వారిని ముందు పెడితే..
ఒక అంబటి రాంబాబు, పేర్ని నాని, తోట త్రిమూర్తులు, గుడివాడ అమర్నాథ్, కన్నబాబు, బొత్స సత్యనారాయణ.. ఇలాంటి వైసీపీ కాపు నేతలను ముందు పెట్టి కాపుల విషయంలో బలమైన ప్రచారానికి జగన్ స్క్రిప్ట్ సిద్ధం చేశారు. పవన్ కళ్యాణ్ రూపంలో కూటమిలో డిప్యూటీ సీఎం పదవి ఉన్న కాపులకు ఎటువంటి ప్రయోజనం లేదని ప్రచారం మొదలుపెట్టారు. కాపు సామాజిక వర్గానికి ఆశించిన స్థాయిలో ప్రాధాన్యత ఇవ్వడం లేదని.. చంద్రబాబు ప్రయోజనాల కోసమే పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నారని కోణంలో వ్యతిరేకతను నూరి పోయాలని చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ పై కాపు యువతలో, ఓటర్లలో అసంతృప్తిని పెంచగలిగితే.. ఆ ఓట్లు ఆటోమేటిక్గా తమ వైపు టర్న్ అవుతాయన్నది జగన్ ఆలోచన.

తక్కువగా అంచనా
అయితే జగన్మోహన్ రెడ్డి కాపు సామాజిక వర్గ ఆలోచనను తక్కువగా అంచనా వేస్తున్నారన్న విశ్లేషణ ఉంది. ఎందుకంటే 2014 నుంచి 2019 మధ్య కాపుల విషయంలో జగన్ అనుసరించిన వైఖరి తెలియంది కాదు. ముఖ్యంగా చంద్రబాబు సర్కార్ ఇచ్చిన ప్రయోజనాలను సైతం రద్దుచేసి కాపులను ఒక ఓటు అ lస్త్రంగా మార్చుకున్న వైనాన్ని ఇప్పటికీ గుర్తు చేసుకున్నారు. పైగా ఇదే వైసిపి కాపు నేతలు కాపు సామాజిక వర్గం విషయంలో చేసిన ప్రకటనలు కూడా గుర్తున్నాయి కాపు సామాజిక వర్గానికి. తమ కళ్ళను తమ చేతితో పొడుచుకునేందుకు కాపులు సిద్ధంగా లేరు. తప్పకుండా జగన్ ప్రయత్నం వికటిస్తుందన్న అభిప్రాయం వినిపిస్తోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version