Homeఆంధ్రప్రదేశ్‌YS Jagan : గెలిస్తే మేము.. గెలవకపోతే ఈవీఎంల ట్యాంపరింగ్.. లాజిక్ మిస్ అవుతున్న జగన్!

YS Jagan : గెలిస్తే మేము.. గెలవకపోతే ఈవీఎంల ట్యాంపరింగ్.. లాజిక్ మిస్ అవుతున్న జగన్!

YS Jagan :  ఏపీలో వైసీపీకి దారుణ పరాజయం ఎదురైంది. 2019 ఎన్నికల్లో 151 స్థానాల్లో విజయం సాధించింది వైసిపి. వై నాట్ 175 అన్న నినాదంతో ఈ ఎన్నికల బరిలో దిగింది. కానీ కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితం అయింది. దారుణ పరాజయం ఎదురు కావడంతో వైసీపీ శ్రేణుల్లో ఒక రకమైన అనుమానం ప్రారంభం అయింది. ఈవీఎంల టెంపరింగ్ జరిగిందంటూ ఆ పార్టీ నేతలు అనుమానించారు. దానిని కూటమి నేతలు తిప్పికొట్టారు. 2019 ఎన్నికల్లో వైసీపీ బంపర్ మెజారిటీ సాధించడం వెనుక ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందా? అని ప్రశ్నించడం ప్రారంభించారు. అయితే గెలిచే పార్టీలు హాయిగా ఉన్నాయి. ఓడే పార్టీలు మాత్రం ఈవీఎంల ట్యాంపరింగ్ అంశాన్ని తెరపైకి తెస్తున్నాయి. గతంలో తెలుగుదేశం ఓడిపోయినప్పుడు ఇదే అంశాన్ని బయటపెట్టింది. ఇప్పుడు వైసీపీ ఓటమితో జగన్ సైతం అదే తరహా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అందుకే ప్రజలు లైట్ తీసుకుంటున్నారు. అయితే తాజాగా మహారాష్ట్ర ఎన్నికల్లో ఓటమి తప్పదని భావించిన బిజెపి కూటమికి బంపర్ విజయం దక్కింది. ప్రతిపక్ష కూటమిలోని పార్టీలకుకనీస స్థాయిలో సీట్లు వచ్చాయి.కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేని స్థితిలో ఉండడంతో ఉద్ధవ్ శివసేన కు చెందిన ఎంపీ సంజయ్ రౌత్ ఈవీఎంల టెంపరింగ్ పై అనుమానం వ్యక్తం చేశారు. తాజాగా ఇదే విషయంపై స్పందించారు ఏపీ మాజీ సీఎం జగన్.

* ప్రజాస్వామ్యం విజయవంతం కావాలి
జాతీయ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఏపీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు జగన్. మనది అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా చెప్పుకొచ్చారు. చెప్పుకోవడానికి పెద్ద ప్రజాస్వామ్యమైనా.. విజయవంతమైన ప్రజాస్వామ్యంగా ఉండాలంటే ఎన్నికలు పారదర్శకంగా జరగాలని ఆకాంక్షించారు జగన్. ప్రపంచంలో చాలా దేశాల ఎన్నికలు బ్యాలెట్ పత్రాలతో జరుగుతున్న విషయాన్ని ప్రస్తావించారు. మనదేశంలో కూడా అలానే జరిగితే ప్రజాస్వామ్యం విజయవంతం అవుతుందని అభిప్రాయపడ్డారు. తద్వారా ఈవీఎంల ట్యాంపరింగ్ పై అనుమానాలు వ్యక్తం చేశారు జగన్. ఓటమి తర్వాత కూడా జగన్ ఇదే విషయంపై మాట్లాడారు. ఎక్కడో లోపం జరిగిందంటూ ఈవీఎంల ప్రస్తావన తీసుకొచ్చారు. ఇప్పుడు అదే తరహా ప్రకటన రావడం విశేషం.

* బిజెపి వరుస విజయాలపై అనుమానం
మనదేశంలో ఈవీఎంల ట్యాంపరింగ్ పై అనుమానాలు రావడం ఇదే తొలిసారి కాదు. బిజెపి వరుస విజయాలపై అనేక రకాల అనుమానాలు కూడా ఉన్నాయి. అయితే అదే సమయంలో బిజెపికి భారీ ఓటములు ఎదురైన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగి ఉంటే పశ్చిమబెంగాల్లో బిజెపి గెలిచి ఉండొచ్చు కదా? కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి రాదు కదా? తెలంగాణలో బిజెపి అధికారంలోకి వచ్చి ఉండేది కదా? మహారాష్ట్రతో పాటు ఝార్ఖండ్ కు ఎన్నికలు జరిగితే.. ఝార్ఖండ్లో ఎందుకు బిజెపి ఓడిపోయింది? ఇలాంటి ప్రశ్నలు చాలా వరకు ఉన్నాయి. మెజారిటీ ప్రజాస్వామ్య దేశాల్లో ఇప్పటికీ బ్యాలెట్ పేపర్ నడుస్తోంది. అదే స్థాయిలో భారత దేశంలో కూడా బ్యాలెట్ కొనసాగాలని మెజారిటీ పార్టీలు కోరుతున్నాయి. అయితే గెలిస్తే తమదని.. ఓడిపోతే ఈవీఎంల టెంపరింగ్ గాని జగన్ లాంటి వ్యక్తులు ప్రస్తావించడం మాత్రం అంత క్షేమం కాదు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

Samsung Galaxy S25: ఈ ఫోన్ పై రూ.18,000 తగ్గింపు.. బ్యాంక్ ఆఫర్స్ కూడా వర్తింపు..

Samsung Galaxy S25: ప్రముఖ మొబైల్ కంపెనీ దిగ్గజం Samsung నుంచి కొత్త ఫోన్లు అంటే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. కాస్త ధర ఎక్కువైనా అద్భుతమైన ఫీచర్లు, అనుకూలమైన సాఫ్ట్...

Festivals this year: ఈ ఏడాదిలో ముఖ్యమైన పండుగలు ఏ తేదీల్లో ఉన్నాయంటే..

Festivals this year: తెలుగు పంచాంగం ప్రకారం.. ఆషాడ మాసం లో వచ్చే తొలి ఏకాదశి తో పండుగల సీజన్ ప్రారంభమైనట్లు గా భావిస్తారు. ఆషాడ మాసం పూర్తికాగానే వరుసగా పండుగలు వస్తుంటాయి....

Peddi Sudarshan Reddy: పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత: కడవరకు తెలంగాణ వాదిగానే.. తెలంగాణ వచ్చినంకనే పెండ్లి..

Peddi Sudarshan Reddy: ఆయనకు తెలంగాణ అంటే ఇష్టం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఉండడం మరింత ఇష్టం.. అందువల్లే ఉద్యమాన్ని భుజాలకు ఎత్తుకున్నారు. పోరాటాల గడ్డ వరంగల్ జిల్లాలో గులాబీ జెండాను నెత్తిన...

YCP Leaders: కుమారులతో వైసిపి నేతలకు తలవంపులు!

YCP Leaders: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వింత పరిస్థితి కనిపిస్తోంది. ఆ పార్టీలో దూకుడు కలిగిన నేతలు చుట్టూ ఇప్పుడు కేసులు అలుముకుంటున్నాయి. అయితే అవి కూటమి ప్రభుత్వం పెట్టిన కేసులు కాదు....

Rain forecast for AP: హమ్మయ్య.. ఏపీకి వర్ష సూచన!

Rain forecast for AP: ఏపీకి చల్లటి కబురు వచ్చింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడింది. వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. అది అల్పపీడనంగా మారి బలపడుతోంది. ఈరోజు ఉత్తరాంధ్రలో పిడుగులతో...
Oktelugu Epaper
Exit mobile version