spot_img
Homeఆంధ్రప్రదేశ్‌జగన్ తో షర్మిల గొడవలో నిజంగా నిజమెంత?

జగన్ తో షర్మిల గొడవలో నిజంగా నిజమెంత?

వైఎస్ రాజశేఖర్ రెడ్డి పిల్లలుగా ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, వైఎస్ షర్మిలకు ఎంతో గుర్తింపు ఉంది. అన్నా చెల్లెలుగా వీరిద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. కానీ, ఇది ఒకప్పటి మాటగా మారిపోయింది. షర్మిల ప్రస్తుతం తెలంగాణలో సొంత పార్టీ పెట్టుకొని.. అన్నకు వ్యతిరేకంగా వెళ్తున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ తో ఉన్న రాజకీయ అవసరాల ద్రుష్ట్యా ఆ రాష్ట్రంలో తన పార్టీని కూడా లేకుండా చేసుకుని జగన్ తనదైన వ్యూహంతో ముందుకు వెళుతుండగా.. షర్మిల మాత్రం కేసీఆర్ ఢీకొట్టేందుకు సిద్ధమయ్యారు. అంతటితో ఆగకుండా జగన్ వ్యతిరేకులతోనూ చేతులు కలిపే దిశగా అఢుగులేస్తున్నారు. జగన్ అంటే గిట్టని ఓ మీడియా సంస్థ అధినేతకు షర్మిల ఇంటర్వ్యూ ఇవ్వడం, ఏకంగా ఆ సంస్థ కు వెళ్లడంతో ఇది మరింత పరాకాష్టకు చేరినట్లేనని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

Is Sharmila Clashes with Jagan is real?

వాస్తవానికి తన అన్న జగన్ కోసం ఎంతో కష్టపడ్డారు. అక్రమాస్తుల కేసులో జగన్ ఏడాదిన్నర కాలం జైల్లో ఉన్నప్పుడు పాదయాత్ర చేపట్టి.. పార్టీ శ్రేణులకు భరోసానిచ్చారు. ఎండనకా, వాననకా వేల కిలోమీటర్లు నడిచి.. అన్న జైలు నుంచి బయటికి వచ్చేదాకా పార్టీని నిలబెట్టారు. దీంతో, జగన్ జైలు నుంచి విడుదలయ్యాక వైసీపీలో షర్మల నెంబర్ 2 అవుతారని అంతా భావించారు. కానీ, పరిస్థితులు ఎవరూ ఊమించని విధంగా తారుమారయ్యాయి.

తొలుత వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పడు, ఆ తరువాత 2019లో అధికారంలోకి వచ్చినప్పుుడు షర్మిలను జగన్ పట్టించుకోలేదు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక షర్మిలకు మంచి పదవే వస్తుందని భావించినా .. ఆమెను జగన్ పూర్తిగా దూరం పెట్టేశారు. షర్మిల కొన్ని సిఫారసులు చేసినా పక్కన పెట్టేశారు.

చాలాకాలం పాటు అన్న ఆదరణ కోసం వేచిచూసిన షర్మిల ఇక లాభం లేదనుకొని. తన నిర్ణయం తాను తీసుకున్నారు. ఏపీలో అన్నకు పోటీగా మారడం ఇష్టంలేక తెలంగాణలో తన భవిష్యత్తును వెతుక్కునే పనిలో పడ్డారు. ఈ మేరకు వైఎస్సార్ టీపీ పేరుతో సొంత పార్టీని స్థాపించారు. పార్టీని క్రియాశీలం చేసే క్రమంలో టీఆర్ఎస్ ప్రభుత్వంపైనా, సీఎం కేసీఆర్ పైనా పదునైన విమర్శలు చేస్తూ వస్తున్నారు. అయితే కేసీఆర్ తో జగన్ కు ఉన్న మైత్రి కారణంగా సహజంగానే ఆమె విమర్శలు అంతిమంగా తన అన్నకు ఇబ్బందికరంగా మారుతున్నాయని అంటున్నారు

ఇక ఇప్పుుడు ఏకంగా ప్రతిరోజూ జగన్ ప్రభుత్వానికి వ్యతిరేక వార్తలు ప్రసారం చేసే మీడియా అధినేతకు ఇంటర్వ్యూ ఇవ్వడంతో జగన్ బాగా చిరాకుకు గురవుతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ అన్నా చెల్లెలి విభేదాలు మున్మందు ఎంతదూరం వెళతాయో తెలియదు కానీ, వీరి వ్యవహారం వల్ల రెండు తెలుగు రాఫ్ట్రాల్లోని వైఎస్ఆర్ అభమానులు మాత్రం బాధపడుతున్నారు.

అయితే.. ఇదంతా వ్యూహమే అనీ, అన్న దూరం పెట్టాడనే సెంటిమెంట్ ప్లే చేసి, తెలంగాణ ప్రజల సింపతీ సంపాదించే రాజకీయం తప్ప, ఇందులో మరేమీ లేదని కొందరు అంటున్నారు. మరి, నిజం ఏంటన్నదానికి కాలమే సమాధానం చెప్పాలి.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Chiranjeevi

Chiranjeevi: 2027 సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న చిరంజీవి… కారణమిదే…

Chiranjeevi: గత 50 సంవత్సరాల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్న వాళ్ళలో మెగాస్టార్ చిరంజీవి మొదటి స్థానంలో ఉంటాడు. తమిళ్ సినిమా ఇండస్ట్రీ నుంచి ఎదురయ్యే పోటీని తట్టుకొని...
Mokshagna

Mokshagna: బాలయ్య కొడుకు మోక్షజ్ఞ కు ఎట్టకేలకు మోక్షం…

Mokshagna: నందమూరి నటసింహం బాలయ్య బాబు హీరోగా చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. ఇప్పటివరకు ఆయన మాస్ లో తిరుగులేని హీరోగా మారిపోయాడు. తన కొడుకు అయిన మోక్షజ్ఞ...
Star Heroes

Star Heroes: డైరెక్టర్లు గా మారుతున్న స్టార్ హీరోలు…

Star Heroes: సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలు నటులుగానే కాకుండా రైటర్లుగా, దర్శకులుగా కూడా రాణించాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే వాళ్ళ ఇమేజ్ కి తగ్గ కథలను...
Varanasi Movie

Varanasi Movie: వారణాసి అన్ని వేల కోట్లు కలెక్ట్ చేస్తుందా…

Varanasi Movie: రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న 'వారణాసి' సినిమా మీద ప్రేక్షకుల్లో విశేషమైన అంచనాలు ఉన్నాయి. ప్రపంచ స్థాయిలో ఈ సినిమా ఒక పెను సంచలనాన్ని క్రియేట్ చేయబోతుందనే...
Oktelugu Epaper