ఆంధ్రప్రదేశ్‌Vijayawada YCP: అక్కడ వైసీపీకి ఏమైంది?

Vijayawada YCP: అక్కడ వైసీపీకి ఏమైంది?

Vijayawada YCP: విజయవాడ వైసీపీలో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా మారింది. జగన్ పెద్ద ఎత్తున అభ్యర్థులను మార్చుతున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా విజయవాడ నగరంలో మూడు నియోజకవర్గాల విషయంలో జగన్ తీసుకున్న నిర్ణయాలపై వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. పార్టీ శ్రేణులకు మింగుడు పడడం లేదు.ఇప్పటికే విజయవాడ నగర పార్టీ అధ్యక్షుడు భవ కుమార్ వైసీపీని వీడారు. తెలుగుదేశం పార్టీలో చేరేందుకు డిసైడ్ అయ్యారు. గత ఎన్నికల్లో ఆయన విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఈసారి ఆయన సైడ్ చేసి దేవినేని అవినాష్ కు నియోజకవర్గ బాధ్యతలను కట్టబెట్టడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

మరోవైపు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ విషయంలో పెద్ద రగడ ప్రారంభమైంది. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా మల్లాది విష్ణు ఉన్నారు. ఆయన తప్పించి నియోజకవర్గ బాధ్యతలను విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ కు అప్పగించారు. ఈ నిర్ణయాన్ని మల్లాది విష్ణు వ్యతిరేకిస్తున్నారు. ఆయన అనుచరులు సైతం విష్ణుకే కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. బుధవారం ఏకంగా రహదారిపై బైఠాయించి వైసిపి హై కమాండ్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇప్పటికే పలుమార్లు వెల్లంపల్లి శ్రీనివాస్ మల్లాది విష్ణును కలిసి సాయం చేయాలని కోరారు. కానీ ఫలితం లేకపోయింది. హై కమాండ్ ద్వారా దారిలోకి తెచ్చుకోవాలని చూశారు. అది జరిగే పని కానట్లు తెలుస్తోంది.

వైసీపీలో మల్లాది విష్ణు భవిష్యత్తు ఏంటనేది అగమ్య గోచరంగా మారింది. హైకమాండ్ కొంతమంది దూతలను పంపించి ఎమ్మెల్సీ ఆఫర్ చేసినట్లు సమాచారం. అయినా విష్ణు అసంతృప్తి వీడలేదు. ఈ నేపథ్యంలో సెంట్రల్ నియోజకవర్గంలో పార్టీ కార్యాలయం ప్రారంభానికి వెల్లంపల్లి సిద్ధపడ్డారు. కార్యక్రమానికి తప్పకుండా హాజరు కావాలని మల్లాది విష్ణుకు హై కమాండ్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఆయన సైతం హాజరయ్యేందుకు మొగ్గు చూపారు. కానీ ఆయన అనుచరులు మాత్రం ఒప్పుకోలేదు. ఎట్టి పరిస్థితుల్లో కార్యక్రమానికి హాజరయ్యేది లేదని.. వెల్లంపల్లి శ్రీనివాస్ నాయకత్వానికి ఒప్పుకునేది లేదని తేల్చి చెప్పారు. దీంతో అక్కడ నుంచి మల్లాది విష్ణు ముభావంగా వెళ్ళిపోయారు. విష్ణు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. షర్మిల చేరికతో ఇప్పటికే విష్టుకు ఆహ్వానం అందిందని.. కానీ ఆచీ తూచీ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.ఒకవేళ మల్లాది విష్ణు వైసీపీని వీడితే మాత్రం ఆ పార్టీకి ఎదురు దెబ్బే.

గత ఎన్నికల్లో విజయవాడ నగరంలోని మూడు నియోజకవర్గాల్లో.. సెంట్రల్, పశ్చిమ నియోజకవర్గాలను వైసీపీ గెలుచుకుంది. తూర్పు నియోజకవర్గం మాత్రం టిడిపి కైవసం చేసుకుంది. సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా మల్లాది విష్ణు స్వల్ప మెజారిటీతోనే బయటపడ్డారు. ఈసారి అక్కడ మూడు స్థానాల్లో వైసిపి గెలుపు డౌటే. ఇప్పటికే తూర్పు నియోజకవర్గానికి ఇన్చార్జిగా ఉన్న భవకుమార్ పార్టీని వీడారు. సెంట్రల్ నియోజకవర్గంలో ఇప్పుడు వైసీపీలో రెండు వర్గాలు తయారయ్యాయి. అటు పశ్చిమ నియోజకవర్గంలో సైతం పార్టీ పరిస్థితి ఏమంత ఆశాజనకంగా లేదు. ఇటువంటి పరిస్థితుల్లో మల్లాది విష్ణు కానీ దూరమైతే దెబ్బ తప్పదని తెలుస్తోంది. మరోవైపు ఎంపీ కేశినేని నాని వైసీపీలో చేరికతో.. కొత్త క్యాడర్ వస్తుందని అంతా భావించారు. కానీ అనుకున్న స్థాయిలో ఆయన వెంట నాయకులు ఎవరు నడవలేదు. పార్టీలోనూ చేరలేదు. దీంతో వైసీపీకి విజయవాడ నగరంలో అవకాశాలు సన్నగిల్లాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి వచ్చే ఎన్నికల్లో ఎటువంటి ఫలితాలు నమోదవుతాయో చూడాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Jagan MaVigan: బెడ్ రూమ్ మచిలీపట్నంలో.. బాత్రూం విజయవాడలో.. హాల్ గుంటూరులో.. ఇదీ జగన్ మావిగన్

Jagan MaVigan: ఒకప్పుడు రాజకీయ నాయకులు ఏవైనా నిర్ణయాలు తీసుకుంటే ప్రజలు అంతగా నిరసన వ్యక్తం చేసేవారు కాదు. పైగా నాయకులు తీసుకున్న నిర్ణయాలకు ఏకపక్షంగా ఆమోదం తెలిపేవారు. ఎప్పుడో ఒకసారి.. కొండ...

YSRCP: పార్లమెంట్ లో వైసీపీ శాంతి మంత్రం.. దేకినోడు లేడు..

YSRCP: దేశంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల మీద ఎంపీలు వాయిదా తీర్మానం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. పైగా ఇప్పుడు పార్లమెంట్లో వర్షాకాల సమావేశాలు కూడా మొదలయ్యాయి. ప్రజలు ఎన్నుకున్న...

Most Popular

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కోడి చెరువు కబ్జాపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన

Pawan Kalyan: కొద్దిరోజుల క్రితం కొంతమంది స్వయంప్రకటిత, తెలంగాణ వాదులు, సో కాల్డ్ జర్నలిస్టులు.. యూట్యూబర్లు.. రచ్చ రచ్చ చేశారు. కోడి చెరువును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కబ్జా చేశారని విమర్శలు...

Jagan: కేంద్ర పెద్దల అపాయింట్మెంట్ కోరిన జగన్.. ఏంటి కథ?!

Jagan: మద్యం కుంభకోణం ఏపీలో ప్రకంపనలు సృష్టించింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో భారీ కుంభకోణం జరిగింది. అయితే దీనిపై ఏర్పాటైన సీట్ విచారణ తుది దశకు వచ్చింది. అంతిమ లబ్ధిదారుడు ఎవరు...

Bhogapuram Airport Opening: ఆ రైతులకు ఉచిత విమాన ప్రయాణం!

Bhogapuram Airport Opening: ఉత్తరాంధ్రలో కీలక ఘట్టానికి సమయం ఆసన్నం అవుతోంది. ఆగస్టు 1న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కానుంది. ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఎయిర్పోర్టును జాతికి అంకితం చేయనున్నారు....

Tammineni Seetharam: ‘తమ్మినేని ఫ్యామిలీ’ పై క్యూ కడుతున్న బాధితులు!

Tammineni Seetharam: శ్రీకాకుళం జిల్లాలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. మొన్నటి వరకు ఆయన శాసనసభ స్పీకర్గా వ్యవహరించారు. అయితే ఆయనతోపాటు కుటుంబ సభ్యులను నకిలీ...

Tammineni Family: పోలీసుల కళ్ళుగప్పి.. పరారీలో తమ్మినేని ఫ్యామిలీ!

Tammineni Family: ఉమ్మడి రాష్ట్రంలోనే సీనియర్ మోస్ట్ లీడర్ తమ్మినేని సీతారాం. తెలుగుదేశం పార్టీలో ఒక వెలుగు వెలిగిన ఆయన సుదీర్ఘకాలం మంత్రిగా పనిచేశారు. తర్వాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి ఒకసారి...
Exit mobile version