spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Pawan Kalyan: వైసీపీ నేతల మైండ్ బ్లాక్.. పవన్ వద్దకు వెళ్లి బొత్స ఏం చేశారో...

Pawan Kalyan: వైసీపీ నేతల మైండ్ బ్లాక్.. పవన్ వద్దకు వెళ్లి బొత్స ఏం చేశారో తెలుసా?*

Pawan Kalyan: సాధారణంగా వైసిపి, జనసేన మధ్య ఫైట్ ఓ రేంజ్ లో ఉంటుంది. మాటల దాడి కూడా కొనసాగుతుంది. సోషల్ మీడియా వేదికగా నిత్యం రచ్చ నడుస్తుంది. అసెంబ్లీలో అయితే మరి చెప్పనవసరం లేదు. పచ్చగడ్డి వేస్తే భగ్గు మన్నట్టు పరిస్థితి ఉంటుంది. ఇటువంటి సమయంలో రెండు పార్టీల కీలక నేతలు ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. ఎందుకు అసెంబ్లీ ప్రాంగణం వేదికగా మారింది. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. ప్రస్తుతం అసెంబ్లీలో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పదవికి సంబంధించిన ఓటింగ్ ప్రక్రియ జరుగుతోంది. సాధారణంగా ఈ పదవిని ప్రతిపక్షానికి కేటాయించడం ఆనవాయితీగా వస్తోంది. కానీ వైసీపీకి తగిన సంఖ్యా బలం లేకపోవడంతో ఆ పార్టీకి పిఎసి చైర్మన్ పదవి ఇచ్చేందుకు కూటమి సుముఖంగా లేకపోయింది. దీంతో వైసీపీ తరఫున సీనియర్ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నామినేషన్ వేశారు. ఈ నేపథ్యంలో ఏపీ అసెంబ్లీ ప్రాంగణం కోలాహలంగా మారింది. సరిగ్గా మీడియా పాయింట్ వద్ద ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. అప్పుడే వైసిపి ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు బయటకు వచ్చారు. ఆ సమయంలోనే బొత్స సత్యనారాయణ పవన్ కళ్యాణ్ కు ఎదురుపడ్డారు. దీంతో ఆ ఇద్దరు ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. బొత్సకు పవన్ కళ్యాణ్ నమస్కరిస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఈ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

* దూరంగా ఉండిపోయిన వైసీపీ నేతలు
అయితే వైసిపి బృందంలో సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా ఉన్నారు. అందరూ కలిసి వస్తుండగా పవన్ బయటకు రావడాన్ని చూసిన బొత్స నిలబడిపోయారు. బొత్సను గమనించిన పవన్ నేరుగా ఆయన వద్దకు వచ్చి పలకరించారు. ఆ ఇద్దరు నేతలు పరస్పరం గౌరవించుకొని వెనదిగారు. అయితే అక్కడకు దూరంగా జరిగిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తో పాటు ఇతర వైసిపి ప్రజాప్రతినిధులు ఆసక్తిగా తిలకించడం కనిపించింది. అయితే బొత్స ఎదురెళ్లి పవన్ కళ్యాణ్ ఆత్మీయ ఆలింగనం చేసుకోవడం పై రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి.

* బొత్స పై అనుమానాలు
బొత్స సీనియర్ నేత కావడంతో శాసనమండలిలో వైసిపి పక్ష నేతగా పదవి ఇచ్చారు జగన్. పార్టీ క్లిష్ట సమయంలో ఉండడంతో ఆదుకుంటారని భావించి విశాఖ స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీగా ఎన్నుకున్నారు. మండలికి పంపించారు. మండలిలో ప్రతిపక్ష నేత హోదా ఇచ్చారు. జగన్ కు ప్రతిపక్ష నేత హోదా దక్కలేదు. కానీ క్యాబినెట్ తో సమానమైన ఆ హోదాను శాసనమండలిలో దక్కించుకున్నారు బొత్స. అయితే జగన్ అంచనాలకు అందుకోలేకపోతున్నారు. మండలిలో కూటమి దూకుడును నిలువరించలేకపోతున్నారు. సరిగ్గా ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ కు ఎదురు వెళ్లి గౌరవించడం పై వైసీపీలో విస్మయం వ్యక్తం అవుతోంది. మరి ఇది ఎంత దాకా తీసుకెళ్తుందో చూడాలి.

 

వైసీపీ వాళ్లకు మైండ్ బ్లాక్ అయ్యే వీడియో.. Dy CM పవన్ తో బొత్స ఆత్మీయ ఆలింగనం | Amaravati Galam

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...
Oktelugu Epaper
Exit mobile version