ఆంధ్రప్రదేశ్‌AP Elections 2024: 300 చోట్ల తనిఖీలు..4000 మందిపై కేసులు.. ఏపీలో హై అలర్ట్

AP Elections 2024: 300 చోట్ల తనిఖీలు..4000 మందిపై కేసులు.. ఏపీలో హై అలర్ట్

AP Elections 2024: ఏపీలో హై అలర్ట్. రాష్ట్రవ్యాప్తంగా పోలీసు నిఘా అధికమైంది. కార్డెన్ సెర్చ్ పేరిట సమస్యాత్మక ప్రాంతాలను పోలీసులు జల్లెడ పడుతున్నారు. అక్కడా ఇక్కడా అన్న తేడా లేకుండా తనిఖీలు కొనసాగుతున్నాయి. కౌంటింగ్ నాడు అల్లర్లు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాల హెచ్చరికతో పోలీస్ శాఖ అప్రమత్తం అయ్యింది. పోలింగ్ నాడు జరిగిన అల్లర్ల నేపథ్యంలో.. సమస్యాత్మక ప్రాంతాలను పోలీసులు జల్లెడ పడుతున్నారు.

గతంలో ఎన్నడూ లేని విధంగా మారణాయుధాలు, నాటు బాంబుల కోసం పోలీసులు వెతుకుతున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అయితే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఉమ్మడి 13 జిల్లాల్లో సమస్యాత్మక గ్రామాలను పోలీసులు లైట్ తీసుకోవడం లేదు. అటు వాహన తనిఖీలతో పాటు అనుమానాస్పద ప్రాంతాలను సందర్శిస్తున్నారు. రౌడీ షీట్ ఉన్న ప్రతి ఒక్కరిని స్టేషన్కు రప్పించి ఆరా తీస్తున్నారు. అయితే ఈ తరుణంలో పోలీసుల వ్యవహార శైలిలో మార్పు రావడం విశేషం. ఈ విషయంలో టిడిపి తో పాటు అధికార వైసిపి నేతల పై కూడా ఒకే తరహాలో పోలీసులు ప్రవర్తిస్తున్నారు. అన్ని పార్టీల నేతలను కౌంటింగ్ కు సహకరించాలని కోరుతున్నారు.

గత మూడు రోజులుగా రాష్ట్రంలో 300 చోట్ల పోలీసులు తనిఖీలు చేశారు. పోలింగ్ నాడు అల్లర్లకు సంబంధించి నాలుగు వేల మందిపై కేసులు నమోదు చేశారు. రాష్ట్రంలో హింసాత్మక ఘటనల నేపథ్యంలో 15 రోజులపాటు పోలీసులకు సెలవులు ఇవ్వొద్దంటూ ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశారు. వచ్చేనెల 19 వరకు కేంద్ర బలగాలు సైతం ఏపీలో ఉండేలా ఎన్నికల కమిషన్ ప్రత్యేక ఆదేశాలు ఇచ్చింది. కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసి.. కోలుకున్న వరకు ఏపీలో ప్రత్యేక బలగాలు కొనసాగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొత్తానికైతే సార్వత్రిక ఎన్నికలు దేశవ్యాప్తంగా ప్రశాంతంగా జరిగినా.. ఏపీలో మాత్రం విధ్వంసక ఘటనలకు, హింసకు దారి తీయడం ఆందోళన కలిగిస్తోంది. కౌంటింగ్ తర్వాత కూడా హింస కొనసాగుతుందని నిఘా వర్గాల హెచ్చరిక ఏపీ ప్రజలను కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Jagan MaVigan: బెడ్ రూమ్ మచిలీపట్నంలో.. బాత్రూం విజయవాడలో.. హాల్ గుంటూరులో.. ఇదీ జగన్ మావిగన్

Jagan MaVigan: ఒకప్పుడు రాజకీయ నాయకులు ఏవైనా నిర్ణయాలు తీసుకుంటే ప్రజలు అంతగా నిరసన వ్యక్తం చేసేవారు కాదు. పైగా నాయకులు తీసుకున్న నిర్ణయాలకు ఏకపక్షంగా ఆమోదం తెలిపేవారు. ఎప్పుడో ఒకసారి.. కొండ...

YSRCP: పార్లమెంట్ లో వైసీపీ శాంతి మంత్రం.. దేకినోడు లేడు..

YSRCP: దేశంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల మీద ఎంపీలు వాయిదా తీర్మానం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. పైగా ఇప్పుడు పార్లమెంట్లో వర్షాకాల సమావేశాలు కూడా మొదలయ్యాయి. ప్రజలు ఎన్నుకున్న...

Most Popular

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కోడి చెరువు కబ్జాపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన

Pawan Kalyan: కొద్దిరోజుల క్రితం కొంతమంది స్వయంప్రకటిత, తెలంగాణ వాదులు, సో కాల్డ్ జర్నలిస్టులు.. యూట్యూబర్లు.. రచ్చ రచ్చ చేశారు. కోడి చెరువును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కబ్జా చేశారని విమర్శలు...

Jagan: కేంద్ర పెద్దల అపాయింట్మెంట్ కోరిన జగన్.. ఏంటి కథ?!

Jagan: మద్యం కుంభకోణం ఏపీలో ప్రకంపనలు సృష్టించింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో భారీ కుంభకోణం జరిగింది. అయితే దీనిపై ఏర్పాటైన సీట్ విచారణ తుది దశకు వచ్చింది. అంతిమ లబ్ధిదారుడు ఎవరు...

Bhogapuram Airport Opening: ఆ రైతులకు ఉచిత విమాన ప్రయాణం!

Bhogapuram Airport Opening: ఉత్తరాంధ్రలో కీలక ఘట్టానికి సమయం ఆసన్నం అవుతోంది. ఆగస్టు 1న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కానుంది. ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఎయిర్పోర్టును జాతికి అంకితం చేయనున్నారు....

Tammineni Seetharam: ‘తమ్మినేని ఫ్యామిలీ’ పై క్యూ కడుతున్న బాధితులు!

Tammineni Seetharam: శ్రీకాకుళం జిల్లాలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. మొన్నటి వరకు ఆయన శాసనసభ స్పీకర్గా వ్యవహరించారు. అయితే ఆయనతోపాటు కుటుంబ సభ్యులను నకిలీ...

Tammineni Family: పోలీసుల కళ్ళుగప్పి.. పరారీలో తమ్మినేని ఫ్యామిలీ!

Tammineni Family: ఉమ్మడి రాష్ట్రంలోనే సీనియర్ మోస్ట్ లీడర్ తమ్మినేని సీతారాం. తెలుగుదేశం పార్టీలో ఒక వెలుగు వెలిగిన ఆయన సుదీర్ఘకాలం మంత్రిగా పనిచేశారు. తర్వాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి ఒకసారి...
Exit mobile version