ఆంధ్రప్రదేశ్‌Chandrababu: పొత్తుపై చంద్రబాబుపై పెరుగుతున్న ఒత్తిడి

Chandrababu: పొత్తుపై చంద్రబాబుపై పెరుగుతున్న ఒత్తిడి

Chandrababu: చంద్రబాబు విచిత్ర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు.’కరవమంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోపం’ అన్నట్టు ఉంది ఆయన పరిస్థితి. వైసీపీని గద్దె దించాలంటే జనసేనతో పొత్తు అవసరం. కానీ ఈ పొత్తు పొడవాలంటే సీట్లు త్యాగం చేయాల్సిన పరిస్థితి టిడిపిది. గతంలో అనుకున్న దానికంటే ఎక్కువ సీట్లు కావాలని జనసేన నుంచి సంకేతాలు వస్తున్నాయి. టిడిపికి తప్పకుండా దక్కుతాయని భావిస్తున్న రెండు నియోజకవర్గాల్లో అభ్యర్థులను చంద్రబాబు ప్రకటిస్తే.. పవన్ మరో రెండు నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటించారు. ఇది చాలదన్నట్టు మూడో వంతు అసెంబ్లీ స్థానాలు కావాలని పట్టుబడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు ఆ స్థాయిలో సీట్లిస్తే సీనియర్ల పరిస్థితి ఏమిటని ఆందోళన టిడిపిలో కనిపిస్తోంది. దీంతో చంద్రబాబు ఒక రకమైన డిఫెన్స్ లో పడిపోయారు.

రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో టిడిపికి బలమైన అభ్యర్థులు ఉన్నారు. ఇప్పుడు జనసేన కోరుతున్నట్లు మూడో వంతు సీట్లు అప్పగిస్తే.. 55 నుంచి 60 స్థానాలు ఆ పార్టీకి ఇవ్వాల్సి ఉంటుంది. ప్రధానంగా ఉభయ గోదావరి, విశాఖ, కోస్తాంధ్రలో ఈ సీట్లు కేటాయించాల్సి ఉంటుంది. కానీ పార్టీ ఆవిర్భావం నుంచి చాలామంది సీనియర్లు టిడిపిలోనే కొనసాగుతున్నారు. 2004 నుంచి 2014 వరకు పార్టీ అధికారంలో లేకున్నా.. పార్టీలో కొనసాగుతూ ఎన్నికల్లో పోటీ చేస్తూ వచ్చారు. 2019 ఎన్నికల్లో సైతం పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు ఆ స్థానాలు జనసేనకు కేటాయించాలని కోరుతుండడంతో వారిలో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది.

అధికారంలోకి రావాలంటే 90 సీట్లు దక్కించుకోవాలి. ఆ సీట్లు దక్కాలంటే టిడిపి ఒంటరిగా 150 స్థానాలకు పోటీ చేయాలి. అప్పుడే 90 నుంచి 100 సీట్లు సాధించే అవకాశం ఉంది. 50 నుంచి 60 స్థానాలు జనసేనకు అప్పగిస్తే ఆ పార్టీ 20 నుంచి 30 స్థానాలు గెలుచుకుంటే కీరోల్ ప్లే చేసే అవకాశం ఉంది. టిడిపి 120 స్థానాలకు పరిమితమైతే అందులో గెలిచేవి ఎన్ని? మ్యాజిక్ ఫిగర్ 90 సీట్లు దాటగలదా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అందుకే జనసేనకు 25కు మించి స్థానాలు ఇస్తే అది టిడిపికి ఇబ్బందికర పరిణామంగా మారుతుందని సీనియర్లు చంద్రబాబు వద్ద ప్రస్తావిస్తున్నారు. దీంతో చంద్రబాబుకు ఎటూ పాలు పోవడం లేదు. మరోవైపు కూటమిలోకి బిజెపి చేరితే ఆ పార్టీకి కొన్ని అసెంబ్లీ స్థానాలు కేటాయించాల్సి ఉంటుంది. దీంతో పొత్తులో భాగంగా సీట్ల సర్దుబాటు అంటేనే చంద్రబాబుకు తలనొప్పి వ్యవహారంగా మారిపోయింది. ఈ నిర్ణయం తీసుకుంటే ఈ ప్రమాదం ముంచుకొస్తుందోనని భయపడుతున్నారు. అందుకే ఎన్నికల షెడ్యూల్ వెల్లడయ్యే వరకు అభ్యర్థుల ప్రకటనను పక్కన పెట్టనున్నట్లు తెలుస్తోంది.

పొత్తులను గౌరవిస్తూనే పవన్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. చంద్రబాబు పొత్తు ధర్మాన్ని పాటించడం లేదని ప్రస్తావించడం ద్వారా పవన్ ఒత్తిడి పెంచే వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. ముమ్మాటికీ పొత్తు ఉంటుందని చెబుతూనే… వీలైనంతవరకు ఎక్కువ సీట్లు రాబెట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఇది టిడిపి సీనియర్లలో అసహనానికి కారణమవుతోంది. గత ఐదు సంవత్సరాలుగా వ్యయప్రయాసలకోర్చి పార్టీని నిలబెడితే.. ఇప్పుడు జనసేన తమ సీటును తన్నుకు పోవడంపై వారిలో ఆవేదన కనిపిస్తోంది. అందుకే ఎక్కువ మంది సీనియర్లు చంద్రబాబును ఆశ్రయిస్తున్నారు. జనసేనతో సీట్ల సర్దుబాటు విషయంలో.. తమ నియోజకవర్గాన్ని మినహాయింపు ఇవ్వాలని కోరుతున్నారు. దీంతో చంద్రబాబులో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది. పొత్తుల విషయంలో పవన్ ఎలా కన్వెన్స్ చేయాలో పాలు పోవడం లేదు. దీనిపై ఒకటి రెండు రోజుల్లో పవన్ తో కూర్చుని డిసైడ్ చేసుకోవాలని చంద్రబాబు ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కోడి చెరువు కబ్జాపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన

Pawan Kalyan: కొద్దిరోజుల క్రితం కొంతమంది స్వయంప్రకటిత, తెలంగాణ వాదులు, సో కాల్డ్ జర్నలిస్టులు.. యూట్యూబర్లు.. రచ్చ రచ్చ చేశారు. కోడి చెరువును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కబ్జా చేశారని విమర్శలు...

Jagan MaVigan: బెడ్ రూమ్ మచిలీపట్నంలో.. బాత్రూం విజయవాడలో.. హాల్ గుంటూరులో.. ఇదీ జగన్ మావిగన్

Jagan MaVigan: ఒకప్పుడు రాజకీయ నాయకులు ఏవైనా నిర్ణయాలు తీసుకుంటే ప్రజలు అంతగా నిరసన వ్యక్తం చేసేవారు కాదు. పైగా నాయకులు తీసుకున్న నిర్ణయాలకు ఏకపక్షంగా ఆమోదం తెలిపేవారు. ఎప్పుడో ఒకసారి.. కొండ...

Most Popular

Divvela Madhuri: దువ్వాడను అడ్డంగా బుక్ చేసిన జాఫర్.. ఇచ్చిపడేసిన దివ్వెల మాధురి..వీడియో వైరల్..

Divvela Madhuri: సోషల్ మీడియా లో బాగా పాపులారిటీ ని సంపాదించుకున్న జంటలలో దువ్వాడ శ్రీనివాస్ - దివ్వెల మాధురి జంట ఒకటి. పొలిటికల్ నేపథ్యం ఉన్నటువంటి దువ్వాడ శ్రీనివాస్ తన భార్య...

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కోడి చెరువు కబ్జాపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన

Pawan Kalyan: కొద్దిరోజుల క్రితం కొంతమంది స్వయంప్రకటిత, తెలంగాణ వాదులు, సో కాల్డ్ జర్నలిస్టులు.. యూట్యూబర్లు.. రచ్చ రచ్చ చేశారు. కోడి చెరువును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కబ్జా చేశారని విమర్శలు...

Jagan: కేంద్ర పెద్దల అపాయింట్మెంట్ కోరిన జగన్.. ఏంటి కథ?!

Jagan: మద్యం కుంభకోణం ఏపీలో ప్రకంపనలు సృష్టించింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో భారీ కుంభకోణం జరిగింది. అయితే దీనిపై ఏర్పాటైన సీట్ విచారణ తుది దశకు వచ్చింది. అంతిమ లబ్ధిదారుడు ఎవరు...

Bhogapuram Airport Opening: ఆ రైతులకు ఉచిత విమాన ప్రయాణం!

Bhogapuram Airport Opening: ఉత్తరాంధ్రలో కీలక ఘట్టానికి సమయం ఆసన్నం అవుతోంది. ఆగస్టు 1న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కానుంది. ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఎయిర్పోర్టును జాతికి అంకితం చేయనున్నారు....

Tammineni Seetharam: ‘తమ్మినేని ఫ్యామిలీ’ పై క్యూ కడుతున్న బాధితులు!

Tammineni Seetharam: శ్రీకాకుళం జిల్లాలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. మొన్నటి వరకు ఆయన శాసనసభ స్పీకర్గా వ్యవహరించారు. అయితే ఆయనతోపాటు కుటుంబ సభ్యులను నకిలీ...
Exit mobile version