Homeఆంధ్రప్రదేశ్‌IAS Kishore Kumar: రూ.350 కోట్ల ప్రభుత్వ భూమి ప్రైవేటు పరం.. ఓ ఐఏఎస్ అధికారి...

IAS Kishore Kumar: రూ.350 కోట్ల ప్రభుత్వ భూమి ప్రైవేటు పరం.. ఓ ఐఏఎస్ అధికారి నిర్వాకం!

IAS Kishore Kumar: గత ఐదేళ్ల వైసిపి హయాంలో విజయనగరం జిల్లా హాట్ కేక్. ఇక్కడ పనిచేసేందుకు అధికారులు, ఉద్యోగులు క్యూ కట్టేవారు. అక్కడ ఓ కుటుంబానికి సహకరిస్తే చాలు ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఆపై నాలుగు రాళ్లు వెనుకేసుకోవచ్చు. అలాగే వచ్చారు ఓ ఐఏఎస్ అధికారి. ఓ మూడేళ్ల పాటు జిల్లాలో ఉన్నారు. కానీ ఓ 250 ఎకరాలు రాజకీయ నేతలకు ధారాధత్తం చేశారు. 350 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని పరులపరం చేశారు. దీని వెనుక అప్పటి జిల్లా కీలక నేత కుటుంబ ప్రమేయం అధికంగా ఉండేది.ప్రస్తుతం ఆ అధికారి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది.అప్పట్లో జరిగిన భూ దందాకు సంబంధించిన ఆధారాలు, గతంలో ఆయన పై ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి చేపట్టిన విచారణ నివేదిక కూడా బయటపడింది. దీంతో కూటమి ప్రభుత్వం సీరియస్ గా దృష్టి పెట్టింది. విజయనగరం జిల్లాలో జరిగిన ఈ భూసంతర్పణపై ప్రత్యేకంగా ఫోకస్ చేసింది.

* జెసి నిర్వాకం ఇదే
విజయనగరం జిల్లాలో జాయింట్ కలెక్టర్ గా కిషోర్ కుమార్ అనే ఐఏఎస్ అధికారి పనిచేశారు. అప్పట్లో మంత్రి బొత్స సత్యనారాయణ కాళ్లు మొక్కిన అధికారిగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు. ఓ పుట్టినరోజు నాడు బొత్సకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. ఒక ఐఏఎస్ అధికారి తన స్థాయిని మరిచి కాళ్లకు నమస్కారం పెట్టడం ఏంటి అనేది అప్పట్లో పెద్ద చర్చకు దారితీసింది. ఇప్పుడు అదే అధికారి నిబంధనలకు విరుద్ధంగా 250 ఎకరాల భూమిని ఇతరులకు కట్టబెట్టడం బయటపడింది. ఈ స్వామి భక్తి వెనుక కారణం అదేనని ఇప్పుడు తేలింది. ఆ అధికారి చేసిన నిర్వాకంతో చాలామంది అధికారులపై తాజాగా వేటు పడింది.

* ఆ కుటుంబానిదే హవా
వైసిపి హయాంలో బొత్స కుటుంబాని దే హవా. ఆ కుటుంబానికి తెలియకుండా చీమ కూడా కదలని పరిస్థితి. అటువంటిది ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టారంటే వారికి తెలియదా? అయితే అప్పట్లో విజయనగరం జిల్లా కలెక్టర్ గా వ్యవహరించిన సూర్యకుమారి జెసి వ్యవహార శైలిపై అప్పట్లో వైసీపీ ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. దీంతో సీనియర్ ఐఏఎస్ అధికారి బాబు నేతృత్వంలో విచారణ కూడా జరిగింది.అక్రమాలు నిజమేనని తేలింది. జెసి కిషోర్ కుమార్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించాలని..వందల కోట్ల రూపాయల ప్రభుత్వ భూములు ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టారని నిర్ధారిస్తూ నివేదిక ఇచ్చారు.కానీ వైసీపీ జిల్లా పెద్దల కోరిక మేరకు ఆ నివేదికను తొక్కి పెట్టింది జగన్ సర్కార్. అయితే నాటి పాలకుల పాపం పుణ్యమా అని కిందిస్థాయి అధికారులు మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version