Homeఆంధ్రప్రదేశ్‌Heavy rain alert Bay of Bengal : బంగాళాఖాతంలో ద్రోణి.. ఆ జిల్లాలకు భారీ...

Heavy rain alert Bay of Bengal : బంగాళాఖాతంలో ద్రోణి.. ఆ జిల్లాలకు భారీ వర్ష సూచన!

Heavy rain alert Bay of Bengal : ఏపీకి( Andhra Pradesh) తీపి కబురు. ఎండలతో అల్లాడిపోతున్న రాష్ట్రానికి అమరావతి లోని భారత వాతావరణ కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ఈనెల 12 నుంచి ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ప్రత్యేకించి దక్షిణ కోస్తాకు భారీ వర్ష సూచన ఉంది. ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ చెబుతోంది. నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకిన సమయంలో రాష్ట్రంలో వర్షాలు పడ్డాయి. ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తా, రాయలసీమలో చెప్పుకోదగ్గ స్థాయిలో వర్షాలు పడ్డాయి. ఎండ తీవ్రత నుంచి ప్రజలకు ఉపశమనం కలిగింది. అయితే రుతుపవనాలు మందగించడంతో క్రమేపి వర్షాలు తగ్గాయి. ఉష్ణోగ్రతలు పెరుగుతూ వచ్చాయి.

* కొద్దిరోజులుగా ఎండ తీవ్రత..
గత కొద్దిరోజులుగా ఏపీలో ఎండ తీవ్రత( summer heat) పెరిగింది. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రతిరోజు సాధారణం కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరుగుతూ వచ్చాయి. ఎండ తీవ్రతతో ప్రజలు అల్లాడిపోయారు. సరిగ్గా ఇటువంటి సమయంలోనే వాతావరణ శాఖ నుంచి చల్లటి కబురు వచ్చింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో నేడు, రేపు పలుచోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ డైరెక్టర్ తెలిపారు. గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని కూడా చెప్పుకొచ్చారు.

* ఈ జిల్లాలకు వర్ష సూచన..
ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రకాశం( Prakasam district), నెల్లూరు, నంద్యాల, కర్నూలు, అనంతపురం, శ్రీ సత్య సాయి పుట్టపర్తి, కడప, అన్నమయ్య రాయచోటి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో సైతం తేలికపాటి వర్షాలు పడొచ్చు. అయితే బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది విపత్తుల నిర్వహణ సంస్థ. ముఖ్యంగా శిథిల భవనాలు, భారీ హోర్డింగులు వద్ద నిల్చో వద్దని సూచించింది. పిడుగులు పడే సమయంలో బహిరంగ ప్రదేశాలు, చెట్ల కింద ఉండకూడదని చెబుతోంది.

Also Read : ఏపీకి మరో ఉపద్రవం.. ప్రజలకు మరో హై అలెర్ట్ జారీ

* భారీ ఉష్ణోగ్రతలు..
రేపు మాత్రం ఎండల తీవ్రత పెరిగే అవకాశం ఉంది. భారీ స్థాయిలో ఉష్ణోగ్రతలు( temperatures ) నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తోంది ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ. ప్రధానంగా విజయనగరం, పార్వతీపురం మన్యం, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, నెల్లూరు జిల్లాల్లో 40 నుంచి 41 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం రుతుపవనాల్లో కదలిక ప్రారంభం అయ్యింది. ఈనెల 12 నుంచి అవి చురుగ్గా విస్తరించనున్నాయి. ఉపరితల ఆవర్తనాలు, అల్పపీడనాలకు అనుకూల వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. దీంతో వర్షాల తీవ్రత పెరగనుందని అంచనా వేస్తోంది వాతావరణ శాఖ.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular