spot_img
Homeఆంధ్రప్రదేశ్‌YCP Leaders: జడ్జిలకు గిఫ్ట్ ఆఫర్లా.. వైసీపీ నేతలు అంత ధైర్యం చేశారా?

YCP Leaders: జడ్జిలకు గిఫ్ట్ ఆఫర్లా.. వైసీపీ నేతలు అంత ధైర్యం చేశారా?

YCP Leaders: పాలనా వ్యవస్థలో న్యాయవ్యవస్థ జోక్యం అధికమైందని ఆ మధ్యన కామెంట్స్ వినిపించాయి. ప్రధానంగా ఏపీలో వైసిపి ప్రజాప్రతినిధులు, ఆ పార్టీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఆది నుంచి అధినేత జగన్ పై కేసులు ఉండడం, ఆపై అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని నిర్ణయాలను కోర్టులు తప్పు పట్టడంతో ఈ తరహా ఆరోపణలు చేసేవారు. అయితే న్యాయవ్యవస్థకు సైతం అవినీతి మకిలి అంటించేందుకు వైసీపీ నేతలు ప్రయత్నించారన్న ఆరోపణలు సైతం వినిపించాయి. ఇటీవల వెలుగు చూస్తున్నాయి. మూడు సంవత్సరాల కిందట ఏపీ హైకోర్టులో పనిచేస్తున్న న్యాయమూర్తికి రెండు కోట్ల విలువైన వజ్రాలు పొదిగిన వాచ్ ను ఇచ్చేందుకు ప్రయత్నించారని.. కానీ ఆ న్యాయమూర్తి తిరస్కరించడమే కాదు.. సుప్రీంకోర్టుకు అధికారికంగా ఫిర్యాదు చేసినట్లు కూడా ప్రచారం జరుగుతోంది.

అయితే అప్పట్లో చేసిన ఈ ఫిర్యాదు పై సుప్రీంకోర్టు స్పందించింది. కేంద్ర నిఘా సంస్థల సాయంతో విచారణ జరిపినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారం బయటకు రావడం హాట్ టాపిక్ గా మారింది. టీటీడీ అధికారి ధర్మారెడ్డి, రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలు ఈ విషయంలో కీలకంగా వ్యవహరించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. కీలక న్యాయమూర్తుల ఇళ్లలో జరిగే ఫంక్షన్లకు పిలవకపోయినా వీరు వెళ్తారని.. ఇలా వెళ్లే క్రమంలో బహుమతులు ఇచ్చి వస్తుంటారని.. ఆ బహుమతులు కోట్ల రూపాయల విలువైనవని ఒక ప్రచారం జరుగుతోంది. వీరు న్యాయమూర్తులకు ఇచ్చిన బహుమతులు విషయంలో త్వరలో పూర్తిస్థాయిలో స్పష్టత రానుందని టాక్ నడుస్తోంది. అదే జరిగితే రాజకీయంగా ప్రకంపనలు సృష్టించే అవకాశం ఉంది.

వాస్తవానికి సీఎం జగన్ పై అనేక అవినీతి కేసులు ఉన్నాయి. తనకు ప్రతికూలంగా కోర్టుల్లో తీర్పులు వస్తే.. మేనేజ్ చేశారని ఆరోపణలు చేసేవారు. అధికారంలోకి వచ్చిన తరువాత సైతం న్యాయ వ్యవస్థను విపక్ష నేతలు మేనేజ్ చేస్తున్నారని సైతం వ్యాఖ్యానించారు. రాజ్యాంగ విరుద్ధంగా తాను తీసుకున్న నిర్ణయాలను కోర్టులు కొట్టివేస్తే ఉద్దేశాలను ఆపాదించేవారు. చివరికి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయ్యే సమయంలో ఎన్వి రమణ పైన తప్పుడు ఆరోపణలతో లేఖలు రాశారు.ఈ రాష్ట్రానికి చెందిన వ్యక్తి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయ్యే ఛాన్స్ వచ్చినా ఆహ్వానించే స్థితిలో జగన్ లేకుండా పోయారు. అప్పట్లోనే దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారారు. అటు జడ్జిలపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో చాలామంది వైసిపి నేతలపై కేసులు కూడా నమోదయ్యాయి. ఒకరిద్దరూ జైలు జీవితం సైతం గడపాల్సి వచ్చింది. ఇప్పుడు వైసిపి కీలక నేతలు ఏకంగా జడ్జిలకు విలువైన బహుమతులు అందించారన్న అంశంపై దర్యాప్తు కొనసాగుతుండడం విశేషం. దీనిపై ఎటువంటి తీర్పు వస్తుందో చూడాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

Srirastu Meaning: పెళ్లి పత్రికలో శ్రీరస్తు అని ఎందుకు రాస్తారు.. శ్రీ అనే అక్షరానికి ఎలాంటి ప్రాధాన్యత ఉంది..

Srirastu Meaning: సాధారణంగా లక్ష్మీదేవి పేరు రాసేటప్పుడు ముందు శ్రీ అని రాస్తారు. అలాగే వివాహ ఆహ్వాన పత్రికల్లో శ్రీరస్తు.. అని పేర్కొంటారు.. ఏదైనా శుభకార్యం చేసేటప్పుడు కూడా శ్రీ అని...

Amazon Employee Quits Job: అమెజాన్ లో రూ.35 లక్షల వేతనం వదిలి.. మనశ్శాంతి కోసం ఈ టెకీ...

Amazon Employee Quits Job: ఆమెకు ఏడాదికి రూ. 30 లక్షల వేతనం.. ఆమె భర్తకు కూడా మంచి ఉద్యోగం.. ఇద్దరికీ కలిపి సుమారు రూ. 65 లక్షల వరకు ఆదాయం.. సాధారణంగా...

Toli Ekadashi 2026: తొలి ఏకాదశి ఎప్పుడు? ఆరోజు ఏం చేయొద్దు.. ఏం చేయాలంటే.

Toli Ekadashi 2026: హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి ఏడాదిలో వచ్చే ఏకాదశి తిథులకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ప్రతి నెలలో శుక్ల, కృష్ణ పక్షాల్లో ఒక్కో ఏకాదశి చొప్పున ఏడాదిలో మొత్తం...

Oppo A7 Pro Max: తక్కువ ధరలో 10,000 mAh బ్యాటరీ ఫోన్.. ఎప్పుడు రిలీజ్ అంటే..

Oppo A7 Pro Max: భారత స్మార్ట్ ఫోన్ మార్కెట్లో OPPO కంపెనీకి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఈ బ్రాండ్ తో రిలీజ్ అయిన ఎన్నో మొబైల్స్ వినియోగదారులను ఆకట్టుకున్నాయి. అయితే ఎప్పటికప్పుడు...

SJP Protests: సీజేపీ వెంట పాకిస్తాన్‌ సోషల్‌ మీడియా.. షాకిచ్చిన పోలీసులు

SJP Protests: ఢిల్లీలో కాక్‌రోచ్‌ జంతా పార్టీ (సీజేపీ) నేతృత్వంలో నీట్‌ ప్రశ్నపత్రం లీకేజీ, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా డిమాండ్‌తో నడుస్తున్న విద్యార్థి ఆందోళనలపై తప్పుడు సమాచారం వ్యాప్తి చెందుతోంది....
Oktelugu Epaper
Exit mobile version