Homeఆంధ్రప్రదేశ్‌ former minister Vishwaroop son  : అనుచరుడి హత్య కేసులో చిక్కిన మాజీ మంత్రి విశ్వరూప్‌...

 former minister Vishwaroop son  : అనుచరుడి హత్య కేసులో చిక్కిన మాజీ మంత్రి విశ్వరూప్‌ తనయుడు.. అరెస్ట్‌.. సంచలన నిజాలివీ..

Former minister Vishwaroop son  :  ఆంధ్రప్రదేశ్‌లోని అబేద్కర్‌ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం అయినవిల్లికి చెందిన దళిత యువకుడు జనుపల్లి దుర్గాప్రసాద్‌ మిస్సింగ్, ఆపై అనుమానాస్పద మృతి కేసులో వైసీపీ మాజీ మంత్రి పినిపె విశ్వరూప్‌ తనయుడు పినిపె శ్రీకాంత్‌ను పోలీసులు ప్రధాన నిందితుడిగా చేర్చారు. దళిత యువకుడిది హత్యే అని పినిపే శ్రీకాంత్‌ హత్య చేశాడని పోలీసుల అదుపులో ఉన్న ధర్మేశ్‌ విచారణలో వెల్లడించాడు. దీంతో ఈకేసులో మరో నలుగురు ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. శ్రీకాంత్‌ను ప్రధాన నిందితుడిగా చేర్చారు. దీంతో ఆయన కోసం గాలింపు చేపట్టారు. అయితే ఇన్ని రోజులు తప్పించుకు తిరిగిన పినిపే శ్రీకాంత్‌ను ఎట్టకేలకు తమిళనాడులో పట్టుకున్నారు.

ఏం జరిగిందంటే..
అయినవిల్లి గ్రామానికి చెందిన జనుపల్లి దుర్గాప్రసాద్‌ అదే గ్రామంలో వలంటీర్‌గా పనిచేసేవాడు. పినిపే విశ్వరూప్‌కు ఆరోగ్యం బాగాలేప్పుడు నియోజకవర్గాన్ని ఆయన కుమారుడు శ్రీకాంత్‌ చూసుకున్నాడు. ఆ తర్వాత తనకు పి.గన్నవరం టికెట్‌ ఇచ్చేందుకు జగన్‌ అంగీకరించారని చెబుతూ అక్కడ రాజకీయ పర్యటనలు చేశారు. ఆ సమయంలో దుగ్గాప్రసాద్‌ అనుచరుడిగా మారాడు. కొద్ది రోజుల్లోనే దుర్గాప్రసాద్‌ ఎదిగాడు. శ్రీకాంత్‌ ముఖ్య అనుచరుల్లో ఒకడిగా మారాడు. అయితే 2022లో కోనసీమ అల్లర్లు జరిగాయి. నెల రోజులు కర్ఫ్యూ కొనసాగింది. ఈ సమయంలో దుర్గాప్రసాద్‌ అదృశ్యమయ్యాడు. అయితే అల్లర్లకు భయపడే పారిపోయాడని ప్రచారం చేశారు. కానీ, ముక్తేశ్వరం–కోటిపల్లి రేవు వద్ద దుర్గాప్రసాద్‌ మృతదేహం లభించింది. అనుమానాస్పద మృతిగా మిస్సింగ్‌ కేసును పోలీసులు మార్చారు. పోస్టుమార్టంలో మెడ ఎముక విరిగి మృతిచెందినట్లు నిర్దారణ అయింది. అయితే అప్పట్లో విశ్వరూప్‌ మంత్రిగా ఉ ండడంతో రాజకీయ ఒత్తిళ్లతో కేసు పెండింగ్‌లో ఉంది. తాజాగా టీడీపీ అధికారంలోకి రావడంతో పాత కేసు విచారణ వేగవంతమైంది. నిందితులను అరెస్టు చేస్తున్నారు. అరెస్టు చేసి నిందితుడి ఇచ్చిన సమాచారంతో విశ్వరూప్‌ తనయుడు శ్రీకాంత్‌ను ప్రధాన నిందితుడిగా గుర్తించారు.

తమిళనాడులో అరెస్ట్‌..
అయితే ప్రధాన నిందితుడిగా చేర్చిన నాటినుంచి కనిపించకుండా పోయిన శ్రీకాంత్‌ను ఏపీ పోలీసులు తమిళనాడులోకి మధురైలో అదుపులోకి తీసుకున్నారు. అక్కడి న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చారు. అతడిని రేపు ఏపీకి తీసుకువస్తారని తెలిసింది. న్యాయమూర్తి అనుమతి తీసుకునే తరలించే అవకాశం ఉంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...

Punjab Politics : పంజాబ్ పై మోడీ ఫోకస్.. ఏదో పెద్ద ప్లానింగే

Punjab Politics : పంజాబ్‌లో గతంలో నిరాశాజనకంగా ఉన్న ఫలితాలను పక్కనబెట్టి, బీజేపీ ఇప్పుడు పూర్తి ఆత్మవిశ్వాసంతో అధికారంలోకి రావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం రెండు సీట్లతో...

Team India : ఈ స్క్రాప్ బౌలింగ్ తో వరల్డ్ కప్ కాదు కదా.. గ్రూప్ స్టేజీ దాటడం...

Team India : ఐపీఎల్ అనేది కాసుల క్రీడ. కేవలం బ్యాటర్ల కోసం మాత్రమే మైదానాలను రూపొందిస్తారు. అవన్నీ కూడా ప్లాట్ గా ఉంటాయి. ఒకరకంగా చెప్పాలంటే సిమెంట్ రోడ్ లాంటి మైదానాలు...

Karakatta Kamal Haasan : ఆ కరకట్ట కమల్ హాసన్ ఏం చేస్తున్నారో తెలుసా..

Karakatta Kamal Haasan : 2014లో ఏపీ రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నాడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజా వేదికను నిర్మించారు. ఆ నిర్మాణం అక్రమం అంటూ...
Oktelugu Epaper
Exit mobile version