Daggubati Purandeswari constitutional post: నందమూరి ఆడపడుచులు చాలా యాక్టివ్ గా ఉంటారు. పాము ఎంచుకున్న రంగాల్లో రాణిస్తున్నారు. అయితే రాజకీయంగా మాత్రం ఆ ఫ్యామిలీ నుంచి మహిళల్లో తనకంటూ రాజకీయ ముద్ర చాటుకున్నారు దగ్గుబాటి పురందేశ్వరి. కేంద్రమంత్రిగా, బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలిగా తన రాజకీయ ప్రతిభను చాటుకున్నారు. ఇప్పుడు కేంద్రంలో రాజ్యాంగబద్ధ పదవికి ఆమె పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఈ మేరకు బిజెపి పెద్దలు ఆమెను ఎంపిక చేసినట్లు పొలిటికల్ వర్గాల్లో ప్రచారం నడుస్తోంది. ప్రస్తుతం రాజమండ్రి ఎంపీగా ఉన్నారు పురందేశ్వరి. అయితే ఆమెకు ఇప్పుడు కేంద్రంలో కీలక పదవి కట్టబెడతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఇందుకు సంబంధించి కేంద్ర పెద్దలు ప్రకటన చేసే అవకాశం ఉంది. కేంద్ర మంత్రివర్గ విస్తరణతో పాటే ఆ పదవికి పురందేశ్వరి పేరు ప్రకటిస్తారని తెలుస్తోంది.
పుష్కరకాలంగా బిజెపిలో..
భారతీయ జనతా పార్టీలో పుష్కరకాలంగా పనిచేస్తూ వచ్చారు పురందేశ్వరి. 2024 ఎన్నికల్లో బిజెపికి ఓట్లు, సీట్లు పెరగడానికి ఆమె ఒక కారణం. ఆమె బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉన్న సమయంలోనే సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. తెలుగుదేశం పార్టీతో పొత్తు వెనుక ఆమె కృషి ఉంది. ఆ ఎన్నికల్లో ఆమె రాజమండ్రి పార్లమెంట్ స్థానం నుంచి పొత్తులో భాగంగా బిజెపి అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. కేంద్ర మంత్రి పదవి ఆశించారు. కానీ వివిధ సమీకరణలో భాగంగా ఆమెకు ఛాన్స్ దొరకలేదు. అయితే ఇప్పుడు రాజ్యాంగబద్ధ పదవిగా ఉన్న లోక్సభ డిప్యూటీ స్పీకర్ పోస్ట్ ఆమెకు కేటాయిస్తారని పొలిటికల్ వర్గాల్లో ఒక ప్రచారం ఉంది.
డిప్యూటీ స్పీకర్ పోస్ట్..
చాలా రోజులుగా డిప్యూటీ స్పీకర్ పోస్ట్ భర్తీ చేయడం లేదు భారతీయ జనతా పార్టీ. అయితే ఆ పోస్ట్ ప్రధాన ప్రతిపక్షానికి కేటాయిస్తూ వస్తోంది సాంప్రదాయం. కానీ కాంగ్రెస్ పార్టీ వైఖరి నచ్చక ఆ పోస్టును కేటాయించడం లేదు భారతీయ జనతా పార్టీ. గత కొన్నేళ్లుగా పూర్తిగా భర్తీ చేయకుండా వస్తోంది. అయితే వివిధ బిల్లులను అడ్డుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. దేశానికి ప్రయోజనం చేకూర్చే బిల్లులను సైతం అడ్డు తగులుతోంది. అందుకే కాంగ్రెస్ పార్టీకి ఇవ్వకుండా.. మరో పార్టీకి కేటాయించకుండా.. బిజెపి తన వద్ద ఉంచుకోవాలని చూస్తోంది. ముఖ్యంగా మహిళా నేత అయిన దగ్గుబాటి పురందేశ్వరికి అవకాశం కల్పించాలని భావిస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.
