Homeఅంతర్జాతీయంRussia Anti Aging Project: రష్యా యాంటీ ఏజింగ్‌ ప్రాజెక్టు.. పుతిన్ కోసమా? మరణాన్ని జయించేనా!

Russia Anti Aging Project: రష్యా యాంటీ ఏజింగ్‌ ప్రాజెక్టు.. పుతిన్ కోసమా? మరణాన్ని జయించేనా!

Russia Anti Aging Project: వయసు పెరగడం మానవ జీవితంలో అనివార్యమైన భాగం. కానీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ఈ ప్రక్రియను మందగించి, ఆరోగ్యకరమైన జీవితకాలాన్ని పెంచడానికి భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. ఇందుకోసం సుమారు 26 బిలియన్‌ డాలర్లు (సుమారు 2 లక్షల కోట్ల రూపాయలు) ఖర్చు చేస్తూ ఒక జాతీయ శాస్త్రీయ కార్యక్రమాన్ని నడుపుతున్నారు.

ప్రాజెక్టు నేపథ్యం..
2025లో బీజింగ్‌లో జరిగిన సైనిక కవాతు సందర్భంగా పుతిన్‌ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో అవయవాల మార్పిడి ద్వారా మనుషులు యువతను నిలుపుకోవచ్చని, బహుశా అమరత్వం కూడా సాధ్యమవుతుందని చర్చించినట్లు హాట్‌ మైక్‌ రికార్డింగ్‌ ద్వారా బయటపడింది. ఈ చర్చ 2024లో అధికారికంగా ప్రారంభమైన ‘న్యూ హెల్త్‌ ప్రిజర్వేషన్‌ టెక్నాలజీస్‌’ ప్రాజెక్టుకు సంబంధించినదిగా విశ్లేషకులు భావిస్తున్నారు. రష్యా ప్రభుత్వం దీనిని టాప్‌ ప్రయారిటీ శాస్త్రీయ కార్యక్రమంగా ప్రకటించింది.

2030 నాటికి పూర్తి..
ఈ కార్యక్రమం అనేక అధునాతన రంగాలపై దృష్టి పెట్టింది. కణాల వృద్ధాప్యాన్ని నెమ్మది చేసే చికిత్సల అభివృద్ధి. ఇది ప్రాజెక్టులో కీలక భాగం. కణజాలాలు, అవయవాలను 3డీ ప్రింటింగ్‌ ద్వారా తయారు చేయడం. ఇప్పటికే ఎలుకల థైరాయిడ్‌ గ్రంథి, మానవ కార్టిలేజ్‌ విజయవంతంగా ప్రింట్‌ చేశారు. 2030 నాటికి పూర్తి మానవ అవయవాలను సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. జన్యుపరంగా మార్చిన మినీ పందులలో మానవ అనుకూల అవయవాలు పెంచి, మనుషులకు మార్పిడి చేయడం. ఇది అవయవాల కొరతను తగ్గించడానికి సహాయపడుతుంది. క్రయోథెరపీ ఇవి కణాలను రక్షించడానికి ఉపయోగపడతాయి. ఈ సాంకేతికతలు ప్రపంచవ్యాప్తంగా (ముఖ్యంగా సిలికాన్‌ వ్యాలీలో) జరుగుతున్న పరిశోధనలతో సమాంతరంగా ఉన్నాయి. రష్యా వాటిని రాష్ట్ర స్థాయిలో ప్రాధాన్యత ఇచ్చి ముందుకు తీసుకెళ్తోంది.

కూతురుకే బాధ్యతలు..
ఈ ప్రాజెక్టును పుతిన్‌ కుమార్తె, ఎండోక్రై నాలజిస్ట్‌ మరియా వొరొంత్సోవాకు అప్పటించారు. ఆమె నేతృత్వంలోని జన్యు పరిశోధనలతో అనుసంధానించారు. ఆమె రాష్ట్ర జన్యు కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. ఇది వ్యక్తిగత ఆసక్తిని రాష్ట్ర విధానంగా మార్చడానికి సహాయపడింది.

ఆయుష్షు పెంపుపై ఆశలు..
ఈ ప్రాజెక్టు ఆశావాదాన్ని కలిగిస్తుంది. జీన్‌ థెరపీ, రీజెనరేటివ్‌ మెడిసిన్‌ వంటి రంగాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. అవయవాల మార్పిడి ద్వారా జీవితకాలం పొడిగించడం సాంకేతికంగా సాధ్యమవుతుంది, కానీ పూర్తి అమరత్వం ఇప్పటికీ శాస్త్రీయంగా దూరంలోనే ఉంది. అవయవాల తిరస్కరణ, జన్యు మార్పుల భద్రత, జంతు ప్రయోగాల నైతికత వంటి సవాళ్లు ఉన్నాయి. ఇలాంటి అధునాతన చికిత్సలు మొదట్లో సంపన్నులు లేదా శక్తివంతులకు మాత్రమే అందుబాటులోకి రావచ్చు. ఇది సామాజిక అసమానతలను పెంచవచ్చు. అలాగే, జంతువులను ఉపయోగించి అవయవాలు పెంచడం వల్ల నైతిక చర్చలు రావచ్చు.

రష్యాలో ఆయుర్దాయం తగ్గుతున్న నేపథ్యంలో ఈ ప్రయత్నం సానుకూలం. అయితే, యుద్ధం నేపథ్యంలో ఈ భారీ నిధులు ఇతర సామాజిక–ఆర్థిక అవసరాలకు ఉపయోగపడాలని విమర్శలు వస్తున్నాయి. చైనాతో సహకారం సాధ్యమైతే బయోటెక్నాలజీ రంగంలో రష్యా–చైనా బలం పెరగవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి పోటీ పెరగడం వల్ల మానవాళికి మంచి చికిత్సలు వచ్చే అవకాశం ఉంది. ఈ అభివృద్ధులు శాస్త్రం ఎంతవరకు మానవ సామర్థ్యాలను విస్తరించగలదో చూపిస్తాయి. ఫలితాలు ఏమైనా, ఇవి మానవాళి ముందుకు సాగడానికి ఒక ముఖ్యమైన అధ్యాయం.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Jogi Rajeev: చంద్రబాబుకు మానసిక, శారీరక సమస్య.. జోగి రమేష్ కుమారుడు రాజీవ్ వ్యాఖ్యల వీడియో వైరల్..

Jogi Rajeev: ఫ్యాన్ పార్టీలో ముఖ్య నాయకుడు, నోటి దురుసు బిరుదాంకితుడు జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ వ్యవహారం కొద్ది రోజులుగా ఏపీ మీడియాలో విస్తృతంగా చర్చకు దారితీస్తోంది. ఇతడు సూర్యాపేటకు...

Pakistan Democracy: పాకిస్తాన్‌లో ప్రజాస్వామ్యం కనుమరుగు.. – రాజ్యాంగ సవరణతో అధికారాలు పాక్ ఆర్మీ చీఫ్ కు..

Pakistan Democracy: పాకిస్తాన్‌ చరిత్రలో సైన్యం ఎప్పుడూ కీలక పాత్ర పోషిస్తుంది. కానీ ఇటీవలి రాజ్యాంగ సవరణలు, ముఖ్యంగా 27వ సవరణ, ఆ ఆధిపత్యాన్ని మరింత అధికారికం, కేంద్రీకృతం చేస్తున్నాయి. ప్రజాస్వామ్య సంస్థలు...

Gen Z Protests : జెన్ జీ ఆందోళన నుంచి నేర్చుకోవాల్సిన గుణపాఠాలేంటి?

Gen Z Protests : దేశ రాజకీయాల్లో, ప్రజాస్వామ్యంలో విద్యార్థి ఉద్యమాలకు ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది. చరిత్ర చెబుతున్నదేమిటంటే.. యువత ముందుకు వస్తే మార్పు సాధ్యమవుతుంది. అయితే అదే యువత ఆవేశానికి,...

Vivo T5e: అధికారికంగా రిలీజ్ అయిన వివో కొత్త ఫోన్.. ధర రూ.14 వేల లోపే..

Vivo T5e: ప్రస్తుత కాలంలో బడ్జెట్ లో మొబైల్ కొనేవారు చాలా మందే ఉన్నారు. ఓ వైపు ప్రీమియం మొబైల్స్ అందుబాటులోకి వస్తున్నప్పటికీ దీనిపై ఎక్కువ డబ్బు పెట్టలేని వారికోసం Vivo...

Narendra Modi And Rahul Gandhi: మోడీ గేమ్ అర్థం కాలేదా రాహుల్ గాంధీ…

Narendra Modi And Rahul Gandhi: నీట్ ప్రశ్నపత్రం లీకేజీ నేపథ్యంలో కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన నిరసనలు, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా… ఈ పరిణామాలను చూసి విపక్షాలు...
Oktelugu Epaper
Exit mobile version