AP COVID Variant: ఏపీలో కరోనా కలకలం సృష్టిస్తోంది. కొత్త వేరియంట్ విస్తరిస్తోంది. కరోనా సృష్టించిన విలయతాండవం ఇప్పటికీ అందరి మనసులో నాటుకు పోయింది. అటువంటి మహమ్మారి మళ్ళీ కోరలు చేస్తోంది. దీంతో సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. కడప జిల్లాలో వెలుగు చూసిన నమూనాలను.. పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ రీసెర్చ్ సంస్థలో పరీక్షిస్తే.. ఆర్ ఎఫ్ 5 వేరియంట్ గా నిర్ధారించారు. అయితే దీనితో వచ్చే ప్రమాదం ఏమీ లేదు అని.. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులతో పాటు వృద్ధులు, పిల్లలు, గర్భిణీలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
* వైరస్ లక్షణాలు..
ఈ కొత్త రకం వేరియంట్ కు సంబంధించి.. గతంలో కోవిడ్ 2 వైరస్.. కార్యక్రమంలో ఓమిక్రాన్ రూపాంతరం చెందింది. దాని నుంచి మరో రూపం జే ఎన్ 1కాగా.. ఎల్ ఎఫ్ 7,1.1.1 బ్రాంచ్ లు ఏర్పడ్డాయి. వీటి రెండింటి కలయికే ఆర్ఎఫ్ 5 అని పూణేలోని శాస్త్రవేత్తలు తేల్చారు. ఈ కొత్తరకం వేరియంట్ సోకిన వారికి దగ్గు, జలుబు, గొంతు నొప్పి, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, జ్వరం ఎక్కువగా వస్తాయి. వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
* మళ్లీ జాగ్రత్తలు..
అయితే కరోనా కేసులు వెలుగు చూస్తున్న నేపథ్యంలో రద్దీగా ఉన్న ప్రదేశాల్లో మాస్కులు ధరించడం, చేతులు తరచూ శుభ్రం చేసుకోవడం వంటివి చేయాలని సూచిస్తున్నారు వైద్య నిపుణులు. ప్రధానంగా సుగర్, శ్వాస సంబంధిత సమస్యలు, కిడ్నీ రోగులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. కోవిడ్ లక్షణాలు ఉన్నవారు తొలుత హోమ్ ఐసోలేషన్ లో కొనసాగాలని.. మూడు నాలుగు రోజుల్లో తగ్గకపోతే వెంటనే వైద్యులను ఆశ్రయించాలని చెబుతున్నారు. తొలుత కడపలో, తరువాత గుంటూరులో కరోనా కేసులు వెలుగులోకి వస్తున్నాయి.