spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Andhra Pradesh IAS Transfers 2026: ఏపీలో కొత్త జిల్లాలకు కలెక్టర్లు.. సీఆర్డీఏ కమిషనర్ మార్పు!

Andhra Pradesh IAS Transfers 2026: ఏపీలో కొత్త జిల్లాలకు కలెక్టర్లు.. సీఆర్డీఏ కమిషనర్ మార్పు!

Andhra Pradesh IAS Transfers 2026: ఏపీలో( Andhra Pradesh) పలువురు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు రెండు జిల్లాలకు కొత్త కలెక్టర్లను నియమించింది ప్రభుత్వం. మరోవైపు సిఆర్డిఏ కమిషనర్ గా విజయరామరాజు నియమితులయ్యారు. ఇప్పటివరకు సిఆర్డిఏ కమిషనర్ గా కన్నబాబు ఉండేవారు. ఆయన పౌరసరఫరాల శాఖ కమిషనర్ గా బదిలీ అయ్యారు. మార్కాపురం కొత్త కలెక్టర్ గా విజయ సునీత, పోలవరం జిల్లా కలెక్టర్ గా దినేష్ కుమార్ నియమితులయ్యారు. మరోవైపు పౌర సరఫరాల శాఖ కమిషనర్ గా ఉన్న సౌరబ్ గౌర్ ను ఏపీ ప్రభుత్వం రిలీజ్ చేసింది. సాధారణ బదిలీల్లో భాగంగానే ఈ ప్రక్రియ పూర్తి చేసింది ప్రభుత్వం.

Also Read: ‘ధురంధర్ 2’ లో మేజర్ ఇక్బాల్ క్యారెక్టర్ మిస్ చేసుకున్న తమిళ సూపర్ స్టార్ అతనేనా?

* మార్పులు ఇవే..
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలువురు ఐఏఎస్ అధికారులను మార్చింది ప్రభుత్వం. ప్రధానంగా సి ఆర్ డి ఏ కమిషనర్ కన్నబాబు కు స్థానచలనం కలిగింది. ఆయన 2025 జనవరిలో కమిషనర్ గా నియమితులయ్యారు. సరిగ్గా 14 నెలల్లోనే ఆయన బదిలీ కావడం విశేషం. ప్రస్తుతం సౌరబ్ గౌర్ పౌరసరఫరాల శాఖ కమిషనర్ గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కన్నబాబును ఆ పోస్టుకు బదిలీ చేయడంతో సౌరబ్ గౌర్ రిలీవ్ కావాల్సి వచ్చింది. మరోవైపు ఏపీ ప్రభుత్వం సిఆర్డిఏ కమిషనర్ గా విజయరామరాజును నియమించింది. ఇప్పటివరకు ఆయన పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ గా ఉండేవారు.

ఇటీవల కొత్తగా రెండు జిల్లాలు ఏర్పాటు అయిన సంగతి తెలిసిందే. మార్కాపురం తో పాటు పోలవరం జిల్లాలు ఏర్పాటు కావడంతో నూతన కలెక్టర్లను నియమించింది ప్రభుత్వం. మార్కాపురం జిల్లా కలెక్టర్గా మార్కెటింగ్ విభాగం డైరెక్టర్ ఎం విజయ సునీత, పోలవరం జిల్లా కలెక్టర్ గా ఆయుష్ విభాగం డైరెక్టర్ కొత్తమాను దినేష్ కుమార్ నియమితులయ్యారు. ఏపీపీఎస్సీ కార్యదర్శి పట్టన్ శెట్టి రవి సుభాష్ కు మార్కెటింగ్ విభాగం డైరెక్టర్గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.
* ఏపీ ప్రభుత్వ దేవాదాయ ట్రైబ్యునల్ చైర్మన్ గా రిటైర్డ్ జిల్లా జడ్జ్ నాగరాజు నియమితులయ్యారు.
* ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ బోర్డు డైరెక్టర్ గా బిగినేపల్లి సందీప్ నియమితులయ్యారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Talliki Vandanam Scheme

Talliki Vandanam Scheme: తల్లికి వందనం అందలేదా.. ఇలా చేయండి!

Talliki Vandanam Scheme: ఏపీ ప్రభుత్వం తల్లికి వందనం పథకం నిధులు విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 65 లక్షల మంది వరకు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో పదివేల కోట్ల రూపాయలు జమ కానున్నాయి....
CJP Protests

CJP Protests: సిజెపి ఆందోళనల వెనక ఖలిస్థానీ.. పది కోట్ల ఆఫర్.. వెలుగులోకి కీలక వీడియో

CJP Protests: అనుకున్నదే అయింది. అనుమానిస్తున్నదే జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఊహించిందే చోటుచేసుకుంది. మొత్తానికి కాక్రోచ్ జనతా పార్టీ అసలు బాగోతం బయటపడింది. పేరుకు నీట్ పరీక్షలో అవకతవకులకు పాల్పడిన వ్యక్తులను శిక్షించాలని...
NEET Protest

NEET Protest: నాడు రైతుల ఉద్యమం.. నేడు నీట్ విద్యార్థుల పోరాటం.. నరేంద్ర మోడీ మౌనం అందుకే..

NEET Protest: సరిగ్గా నాలుగు సంవత్సరాల క్రితం కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతు సంఘాలు ఆందోళన నిర్వహించాయి. ఢిల్లీ సరిహద్దుల్లో తిష్ట వేసుకొని...
Talliki Vandanam:

Talliki Vandanam: తల్లికి వందనం: కూటమి సైలెంట్ వ్యూహం!

Talliki Vandanam: ఏపీలో కూటమి ప్రభుత్వం మరో రికార్డ్ సృష్టించింది. రెండో ఏడాది తల్లికి వందనం సాయం అందజేసింది. దాదాపు 65 లక్షల మంది లబ్ధిదారుల ఖాతాల్లో పదివేల కోట్ల రూపాయలకు పైగా...
Kethireddy Venkatarami Reddy

Kethireddy Venkatarami Reddy: జగన్ ను ఇచ్చి పడేసిన కేతిరెడ్డి.. ఏంటి కథ?!

Kethireddy Venkatarami Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేతల స్వరం మారుతోంది. ఆ పార్టీలో కొందరు నేతలు దూకుడుగా ఉంటారు. దూకుడు వ్యాఖ్యలు చేస్తుంటారు. మరికొందరు ఆలోచనతో మాట్లాడతారు. ఆపై పవర్ఫుల్ గానూ...
Oktelugu Epaper