AP DWCRA Women Loans: ఏపీలో( Andhra Pradesh) డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్. రాష్ట్ర ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. ఇంట్లో పిల్లల వివాహానికి గాను బ్యాంకు రుణం అందించనుంది. అది కూడా సులభ వాయిదా పద్ధతుల్లో చెల్లించుకునే వెసుల బాటు కల్పించింది. ఈ మేరకు కళ్యాణ లక్ష్మి అనే పథకాన్ని ప్రారంభించనుంది. ఈ నెల 23 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించనుంది. పదివేల నుంచి లక్ష రూపాయల వరకు రుణం అందించే ఏర్పాట్లు చేయనుంది. సాధారణంగా పేద ఇళ్లలో వివాహం జరిగితే తప్పకుండా అప్పు చేయాల్సి ఉంటుంది. ప్రైవేట్ వ్యక్తుల దగ్గర అప్పులు చేస్తే వారు డబ్బు కోసం చాలా రకాల వత్తులు చేస్తుంటారు. ఆపై అధిక వడ్డీ వసూలు చేస్తుంటారు. అందుకే ప్రభుత్వం కల్యాణ లక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టింది.
* దరఖాస్తు చేసుకున్న 48 గంటల్లోగా రుణం అందనుంది. అన్ని రకాల వివరాలతో కూడిన దరఖాస్తు చేసుకుంటే.. రెండు రోజుల్లో రుణం మంజూరయ్యేలా ఈ పథకాన్ని రూపొందించారు.
* 48 వాయిదాల రూపంలో తిరిగి రుణం చెల్లించాల్సి ఉంటుంది.
* పదివేల నుంచి లక్ష రూపాయల వరకు రుణ పరిమితి ఉంది. అవసరం మేరకు రుణం పొందవచ్చు.
* డ్వాక్రా సంఘాల్లో సభ్యురాలిగా అయి ఉండి.. ఇంట్లో ఆడపిల్లలకు వివాహాలు చేసేవారు మాత్రమే అర్హులు.
* కుమార్తెకు వివాహం జరుపుతామనుకుంటే అందుకు సంబంధించిన ధ్రువపత్రాలు, వివాహ ఆహ్వాన పత్రికను జత చేయాల్సి ఉంటుంది.
* అయితే వచ్చే విద్యా సంవత్సరం నుంచి పిల్లల చదువుల నిమిత్తం కూడా డ్వాక్రా సంఘాల సభ్యులకు సులభ వాయిదా పద్ధతులపై రుణం మంజూరు చేసే అవకాశం ఉంది.
* కల్యాణ లక్ష్మి పథకానికి సంబంధించిన దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ ఈనెల 23 నుంచి ప్రారంభం కానుంది.