Homeఆంధ్రప్రదేశ్‌Pawan Kalyan: అల్లు అర్జున్ ఒంటరయ్యారు.. రేవంత్ స్థాయి దాటారు.. పవన్ సంచలన కామెంట్స్!*

Pawan Kalyan: అల్లు అర్జున్ ఒంటరయ్యారు.. రేవంత్ స్థాయి దాటారు.. పవన్ సంచలన కామెంట్స్!*

Pawan Kalyan: అల్లు అర్జున్ విషయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎట్టకేలకు స్పందించారు. హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటన, రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం, సినీ పరిశ్రమల నుంచి వచ్చిన కామెంట్స్ పై తాజాగా మాట్లాడారు పవన్ కళ్యాణ్. గత కొద్ది రోజులుగా అల్లు అర్జున్ ఎపిసోడ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనకు బాధ్యుడిని చేస్తూ అల్లు అర్జున్ ను అరెస్టు చేసిన సంగతి విధితమే. ఆ సమయంలో మెగా కుటుంబం అల్లు అర్జున్ కు అండగా నిలబడింది. మెగాస్టార్ చిరంజీవితో పాటు మెగా బ్రదర్ నాగబాబు అల్లు అర్జున్ ను పరామర్శించారు. అదే సమయంలో తనకు అండగా నిలిచినందుకు అల్లు అర్జున్ చిరంజీవితో పాటు నాగబాబు ఇంటికి వెళ్లి మరీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలుస్తారని ప్రచారం జరిగింది. కానీ పవన్ నుంచి అనుమతి రాలేదని సోషల్ మీడియాలో టాక్ నడిచింది. అయితే ఈ ఇష్యూ పై ఇంతవరకు పవన్ కళ్యాణ్ మాట్లాడింది లేదు. కానీ తాజాగా నోరు తెరిచారు.

* తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంతో
మొత్తం ఈ ఘటన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రీమియర్ షోల ప్రదర్శన, టికెట్ల ధర పెంపు ఉండదని తేల్చి చెప్పింది. దీంతో ఒక్కసారిగా ఆందోళనకు గురైంది చిత్ర పరిశ్రమ. ఈ విషయంలో పునరాలోచన చేయాలని సినీ పెద్దలు రేవంత్ రెడ్డిని కలిసి కోరారు. అయితే సినీ పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలుగా చేయూతనిస్తుందని.. కానీ టిక్కెట్ల ధర పెంపుతో పాటు ప్రీమియర్ షో ల ప్రదర్శన విషయంలో ఎలాంటి మార్పు లేదని తేల్చి చెప్పారు. ఇటువంటి తరుణంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. తాజా పరిస్థితులపై స్పందించారు పవన్ కళ్యాణ్. కీలక వ్యాఖ్యలు చేశారు.

* అందరి బాధ్యత గుర్తు చేస్తూ
ఈ మొత్తం ఎపిసోడ్లో అల్లు అర్జున్ ను ఒంటరి చేశారని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. గోటితో పోయే దానిని గొడ్డలి దాకా తీసుకొచ్చారని కూడా వ్యాఖ్యానించారు. అయితే ఒక హీరోను అరెస్టు చేసి రేవంత్ రెడ్డి తన పాలనలో పారదర్శకత చూపించారని కూడా కామెంట్స్ చేశారు. అదే రేవంత్ రెడ్డి పుష్ప 2 చిత్రం ప్రీమియర్ షోల ప్రదర్శనతో పాటు టికెట్ల ధర పెంపునకు అనుమతి ఇచ్చిన విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. అది చిత్ర పరిశ్రమను ప్రోత్సహించడమేనని వ్యాఖ్యానించారు. రేవంత్ గురించి ప్రస్తావించకపోవడం వల్లే ఈ ఘటన జరిగిందని ప్రచారం జరగడం దారుణమన్నారు. ఆ స్థాయిని రేవంత్ ఎప్పుడో దాటేశారని.. ఎవరు గుర్తించాల్సిన పని లేదని కూడా తేల్చి చెప్పారు. మొత్తానికైతే పవన్ కామెంట్స్ సూటిగా, సుత్తి లేకుండా సాగడం విశేషం.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version