Homeఆంధ్రప్రదేశ్‌AP Assembly Session: లిక్డ్‌ ఇన్‌లో ఏపీసీఎం.. ప్రమాణ స్వీకారం తర్వాత బాబు చేసిన పని...

AP Assembly Session: లిక్డ్‌ ఇన్‌లో ఏపీసీఎం.. ప్రమాణ స్వీకారం తర్వాత బాబు చేసిన పని వైరల్

AP Assembly Session: ఏపీకి నాలుగోసారి సీఎంగా ప్రమాణం చేసిన చంద్రబాబుకు టెక్నాలజీపై మక్కువ ఎక్కువ. తాజాగా ఆయన లింక్‌డ్ ఇన్‌ ఖాతాపై ఇంటర్నెట్‌లో చర్చ జరుగుతోంది. ఏసీపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం అయిన వెంటనే అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలలో ఆయన బయో అప్‌డేట్ చేశారు. బిజినెస్ , ఎంప్లాయిమెంట్ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లింక్‌డ్‌ ఇన్‌లోలో ఆయన చేసిన ఓ పోస్టుపై మరో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్‌‍్సలో వైరల్‌ అవుతోంది. దీనిపై చర్చ జరుగుతోంది. టెక్నాలజీని వాడటంలో, ప్రోత్సహించడంలో ఎప్పటికప్పుడు నూతన ఒరవడి సృష్టించే చంద్రబాబు ఈసారి కూడా తన పోస్టును అదే రీతిలో చేశారు.

లింక్‌డ్‌​ఇన్‌ ప్రొఫైల్‌పై చర్చ..
ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయకుడు జూన్‌ 12న ప్రమాణస్వీకారం చేశారు. ఆ తర్వాత తన సోషల్ మీడియా అకౌంట్లన్నీ అప్‌డేట్ చేశారు. అలాగే తన లింక్‌డ్‌ ఇన్‌లో మాత్రం ఓ పోస్టు పెట్టారు. ‘ఇటీవల ఎన్నికల ఫలితాల్లో టీడీపీ, బీజేపీ. జనసేన కూటమి 164 స్థానాలు సాధించిందని ప్రజలు అద్భుతమైన విజయాన్ని అందించారని ఆ పోస్టులో పేర్కొన్నారు. తమ మూడు పార్టీల కూటమిలో ప్రజలు నాలుగో పార్టీగా చేరారని.. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన అందించాల్సిన బాధ్యత తమపై ఉంది.. అందుకోసం పూర్తి నిబద్ధతతో పనిచేస్తాం’ అని ఆయన రాసుకున్నారు.

ఎక్స్‌లో షేర్ చేసిన మహిళ
చంద్రబాబు నాయడు లింక్‌డ్‌ ఇన్‌లో రాసుకున్న పోస్టును రాధికా ధని అనే ఓ టెకీ.. ఎక్స్‌లో పోస్టు చేశారు. చంద్రబాబు తన ప్రొఫైల్ నెట్‌వర్కింగ్ చేస్తున్నట్లు లేదని తన రెస్యూమ్‌ అప్‌డేట్ చేసినట్లు ఉందని ఆమె వ్యాఖ్య చేశారు. ఈ పోస్టు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. దీనిపై చాలా మంది టెకీలు స్పందిస్తున్నారు. కామెంట్లు పెడుతున్నారు. చంద్రబాబు 1995 నుంచి హైదరాబాద్ ఐటీ అభివృద్ధి చేస్తున్నారని.. ఆయన్ను ఏపీ సీఎం అని కాకుండా సీఈవో అని పిలుచుకుంటారని కామెంట్లు పెడుతున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు వచ్చిన అవార్డులు, న్యూయార్క్ టైమ్స్ వంటి పత్రికల్లో వచ్చిన కవరేజ్ వంటి అంశాలను ప్రస్తావిస్తున్నారు. ఇప్పటి వరకూ ఈ పోస్ట్ 2.70 లక్షల మంది చూశారు.

లింక్‌డ్‌ ఇన్‌ వినియోగం తక్కువ..
రాజకీయ నాయకులు సహజంగా ఎక్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టా వంటివి వాడుతుంటారు. లింక్‌డ్‌ ఇన్‌ లాంటి ప్రొఫెషనల్ వేదికలు ఉపయోగించడం తక్కువ. బిజినెస్ ప్రొఫెషనల్స్, టెక్ సంబంధిత వ్యక్తులు మాత్రమే లింక్‌డ్‌ ఇన్‌లో ఉంటారు. ఉద్యోగార్థులు ఎక్కువగా దీనిని వాడుతుంటారు. చంద్రబాబునాయుడు సీఎంగా ఉన్న సమయంలో దావోస్‌లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాలకు హాజరయ్యేవారు. విశాఖ వేదికగా భాగస్వామ్య సదస్సులూ నిర్వహించారు. ఎక్కువ మంది బిజినెస్ ప్రొఫెషనల్స్‌తో కనెక్ట్ కావడం కోసం ఆయన లింక్‌డ్‌ ఇన్ వాడుతున్నారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version