AP Heavy Rains: ఏపీలో( Andhra Pradesh) భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రధానంగా దక్షిణ తీర ప్రాంత జిల్లాలతో పాటు రాయలసీమలో వర్షాలు పడుతున్నాయి. ఉత్తరాంధ్రలో సైతం కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో.. మరో మూడు రోజులపాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉపరితల ఆవర్తనం బలపడింది. రాయలసీమతో పాటు ఇతర ప్రాంతాలకు విస్తరించింది. సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగుతోంది. దీని ప్రభావంతో రెండు రోజులపాటు ఏపీలో పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది.
Also Read: పులివెందుల ఉప ఎన్నిక.. ఆ ఇద్దరిపైనే జగన్ ఆశలు
రాయలసీమపై ప్రభావం..
తాజాగా ఈ ఉపరితల ఆవర్తనం ప్రభావం రాయలసీమపై( Rayalaseema ) అధికంగా కనిపిస్తోంది. పల్నాడు జిల్లాలో సైతం వర్షాలు కురిసే అవకాశం ఉంది. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అనంతపురం, శ్రీ సత్య సాయి పుట్టపర్తి, అన్నమయ్య రాయచోటి, చిత్తూరు జిల్లాల్లో కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసాయి. నేడు కూడా ఈ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. మరోవైపు అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, ఏలూరు, గుంటూరు, బాపట్ల, కర్నూలు, నంద్యాల, వైయస్సార్ కడప, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
Also Read: అమరావతిలో ‘రియల్’ బూమ్!
ప్రమాదంలో ఖరీఫ్..
అయితే కొన్ని జిల్లాల్లో మాత్రం వర్షపాతం( rainfall ) లోటు కనిపిస్తోంది. ఖరీఫ్ పై ప్రభావం అధికంగా ఉంది. చాలా ప్రాంతాల్లో ఇంకా ఖరీఫ్ పనులు ప్రారంభం కాలేదు. నదులతో పాటు కాలువలు నీరు లేక ఖాళీగా కనిపిస్తున్నాయి. ఈ ఏడాది ముందుగానే రుతుపవనాలు రావడంతో వర్షాలు ప్రారంభమయ్యాయి. కానీ జూన్ నెలలో ఆశించిన స్థాయిలో వర్షాలు పడలేదు. జూలైలో సైతం అదే స్థాయిలో లోటు కనిపించింది. ఆగస్టు మొదటివారం దాటుతున్న చాలా ప్రాంతాల్లో సరైన వర్షాలు పడడం లేదు. దీనికి తోడు ఎండ తీవ్రత అధికంగా ఉంది. పగటి ఉష్ణోగ్రతలు 38 డిగ్రీలకు దాటుతున్నాయి. దీంతో ఖరీఫ్ ప్రమాదంలో పడింది. రైతులు ఆందోళనతో ఉన్నారు.