Homeఆంధ్రప్రదేశ్‌YSRCP: ఆ 16 వేల కుటుంబాలు వైసిపి కి దూరం!

YSRCP: ఆ 16 వేల కుటుంబాలు వైసిపి కి దూరం!

YSRCP: వైయస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి డీఎస్సీ- 2025 పై అనుమానాలు వ్యక్తం చేశారు. దానిని ఒక దగా డిఎస్సి గా పేర్కొన్నారు. డీఎస్సీ నియామక ప్రక్రియలో అవకతవకలు చోటు చూసుకున్నాయని ఆరోపించారు. గత ఏడాది కూటమి ప్రభుత్వం 16,400 ఉపాధ్యాయ పోస్టులతో డీఎస్సీ నియామక ప్రక్రియను పూర్తి చేసిన సంగతి తెలిసిందే. గత ఏడాది నియామకం జరిగి ఒక విద్యా సంవత్సరంలో విద్యాబోధన కూడా పూర్తి చేశారు సదరు ఉపాధ్యాయులు. ఇప్పుడు అదే డీఎస్సీ నియామక ప్రక్రియ పై ఆరోపణలు చేస్తున్నారు జగన్ మోహన్ రెడ్డి. దీంతో ఆ 16 వేల మందికి పైగా ఉపాధ్యాయులు తీవ్ర ఆందోళనతో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి తీరును తప్పు పడుతున్నారు. ఆయన స్థాయికి తగిన ఆరోపణలు కావని తేల్చి చెబుతున్నారు.

* ఎన్నికల ముందు హడావిడిగా..
2024 ఎన్నికల కు ముందు రోజుల వ్యవధిలో 6000 ఉపాధ్యాయ పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చింది జగన్ ప్రభుత్వం. కానీ దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభం కాలేదు. ఇంతలోనే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. దీంతో డీఎస్సీ నోటిఫికేషన్ రద్దయింది. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ 6000 ఉపాధ్యాయ పోస్టులకు తోడు.. మరో 10,000 కలిపి 16 వేల పోస్టులతో మెగా డీఎస్సీని ప్రకటించింది చంద్రబాబు సర్కార్. దానికి కూడా అడ్డు తగిలింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. లేనిపోని కేసులు కూడా మోపింది. లీగల్ పరంగా ఎటువంటి అడ్డంకులు ఎదురైనా నివృత్తి చేసుకొని ముందుకు సాగారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. అనుకున్న వ్యవధిలోనే 16 వేల ఉపాధ్యాయ పోస్టుల నియామకాలను పూర్తి చేశారు. అయితే ఇప్పుడు ఆ నియామకాలు అక్రమ పద్ధతిలో జరిపారని జగన్మోహన్ రెడ్డి ఆరోపిస్తున్నారు. దీంతో ఉపాధ్యాయులుగా ఎంపికైన 16000 మంది తీవ్ర ఆందోళనతో ఉన్నారు.

* నిరాశలో నిరుద్యోగులు…
2019 ఎన్నికలకు ముందు ఏటా డీఎస్సీ ప్రకటించి ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తానని జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క పోస్టు కూడా భర్తీ చేయలేదు. ఉపాధ్యాయ పోస్ట్పై ఆశలు పెట్టుకున్న చాలామంది నిరుద్యోగులు బీఈడీతో పాటు డీఎడ్ పూర్తి చేశారు. కానీ ఎటువంటి భర్తీ లేకపోవడంతో నిరాశ చెందారు. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 16 వేల పోస్టులు భర్తీ చేయడంతో చాలామంది ఉద్యోగాలు పొందారు. కానీ జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియాలో ఓ వార్తను పట్టుకొని.. డీఎస్సీలో అవకతవకలు జరిగాయి అంటూ ఆరోపణలు చేస్తున్నారు. అయితే ఏపీ విద్యాశాఖ ఫ్యాక్ట్ చెక్ లో భాగంగా ఆ ఆరోపణల్లో నిజం లేదని తెలిపింది. దీంతో ఈ ఉపాధ్యాయులంతా ఊపిరి పీల్చుకున్నారు. కానీ తన రాజకీయాల కోసం తమ జీవితాలను పణంగా పెట్టడాన్ని మాత్రం సహించుకోలేకపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి తీరును అసహ్యించుకుంటున్నారు. 16 వేల కుటుంబాలు నేరుగా వైసీపీకి దూరమైనట్టే. అయితే దాని ప్రభావం ఇంకా రెట్టింపు ఉంటుంది. అనవసరంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మూల్యం చెల్లించుకోబోతోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

ODI World Cup 2027 : వైభవ్ తో రోహిత్.. వన్డే వరల్డ్ కప్ లో ఈ కాంబినేషన్...

ODI World Cup 2027 : శీర్షిక చదివారు కదా.. ఈ కంటెంట్ లో ఉన్న మ్యాటర్ ఏంటో అర్థమైంది కదా.. ఇప్పుడు టీమిండియాకు కావలసింది అదే. ఎందుకంటే 2023లో భారత జట్టు...

Vijay Government : విజయ్ ప్రభుత్వానికి బిగ్ షాక్.. ఇది మామూలు దెబ్బ కాదు

Vijay Government : ప్రభుత్వ ఉద్యోగం ఉచితంగా ఇచ్చేది కాదు.. పంచిపెట్టేది కాదు.. అర్హులకు మాత్రమే ఉద్యోగాలు ఇవ్వాలి.. ప్రభుత్వం రాజ్యాంగ పరిమితులకు లోబడి వ్యవహరించాలి.. ఇదీ మద్రాస్ హైకోర్టు సోమవారం ఇచ్చిన...

Weight Loss: కిలో బరువు తగ్గాలంటే ఎంతసేపు నడవాలి?

Weight Loss: ప్రస్తుత కాలంలో బరువు తగ్గించాలని చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు .చాలా వరకు త్వరగా ఫలితం రావాలని కోరుకుంటారు. ముఖ్యంగా కిలో బరువు ఒక వారంలో తగ్గాలనే లక్ష్యంతో ఆహారం...

HYDRA Ranganath: హైడ్రా రంగనాథ్ కు రాం రాం.. తెలంగాణ హైకోర్టు సంచలనం

HYDRA Ranganath: హైడ్రా.. తెలంగాణలో 2023లో కొలువుదీరిన రేవంత్‌రెడ్డి సర్కార్‌ హైదరాబాద్‌లోని ప్రభుత్వ భూముల పరిరక్షణ, చెరువులు, కుంటల ఆక్రమణల తొలగింపు. ప్రకృతి విపత్తుల సమయంలో ప్రజలకు సహాయ సహకారాలు అదించేందుకు ఏర్పాటు...

Kerala Innovation: అమ్మ కష్టం చూడలేక.. ఈ కొడుకు చేసిన పని.. ఏకంగా సీఎం చప్పట్లు కొట్టాడు..

Kerala Innovation: ఉదయం లేవగానే ఇల్లు ఊడ్చి.. కల్లాపి చల్లాలి. ముగ్గు పెట్టాలి. బట్టలు ఉతకాలి. టీ దగ్గర నుంచి మొదలు పెడితే కూర వరకు వండాలి. ఇంటిని శుభ్రం చేయాలి. ఇన్ని...
Oktelugu Epaper
Exit mobile version