Homeఅంతర్జాతీయంTRF Lashkar connection: అంతర్జాతీయ ఉగ్ర సంస్థగా టీఆర్‌ఎస్‌.. అమెరికా సంచలన ప్రకటన!

TRF Lashkar connection: అంతర్జాతీయ ఉగ్ర సంస్థగా టీఆర్‌ఎస్‌.. అమెరికా సంచలన ప్రకటన!

TRF Lashkar connection: జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో ఏప్రిల్‌ 22,2025న ఉగ్రవాదులు జరిపిన దాడిలో 26 మంది పర్యాటకులు మరణించారు. మంత పేరు అడిగి మరీ ఉగ్రవాదులు కాల్చి చంపారు. దీంతో ఈ దాడికి బాధ్యులుగా ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించలేదు. దీంతో ఎన్‌ఐఏ విచారణ, సీసీ ఫుటేజీల తర్వాత ఈ దాడి చేసింది ది రెసిస్టెన్స్‌ ఫ్రంట్‌(టీఆర్‌ఎఫ్‌)గా గుర్తించింది. ఆ తర్వాత ఆపరేషన్‌ సిందూర్‌ చేపట్టింది. 9 ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసింది. 11 ఎయిర్‌ బేస్‌లపై దాడిచేసింది భారత వైమానిక దళం. తాజాగా అమెరికా పహల్గాం దాడిచేసిన ఉగ్రసంస్థ టీఆర్‌ఎఫ్‌ను విదేశీ ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. ప్రత్యేకంగా నియమిత గ్లోబల్‌ టెర్రరిస్ట్‌ సంస్థగా ప్రకటించడం ద్వారా అమెరికా ఈ సమస్యపై నిబద్ధతను చాటింది.

పహల్గాం దాడి ఇలా..
2025 ఏప్రిల్‌ 22న జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్ర దాడి 26 మంది అమాయకుల ప్రాణాలను బలిగొన్న ఒక దురదృష్టకర సంఘటన. హిందువులను లక్ష్యంగా చేసుకుని జరిగిన ఈ దాడి ప్రపంచవ్యాప్తంగా ఖండనలను రేకెత్తించింది. ఈ దాడికి బాధ్యత వహించిన టీఆర్‌ఎఫ్‌ను అమెరికా లష్కరే తయిబా యొక్క ముసుగు సంస్థగా గుర్తించింది. ఈ ఘటన 2008 ముంబయి దాడి తర్వాత భారత్‌లో జరిగిన అతిపెద్ద ఉగ్ర దాడుల్లో ఒకటిగా నిలిచింది. దీంతో అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో టీఆర్‌ఎఫ్‌ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించడం ద్వారా అధ్యక్షుడు ట్రంప్‌ ఉగ్రవాద వ్యతిరేక విధానాన్ని పునరుద్ఘాటించారు. ఈ చర్య జాతీయ భద్రతను కాపాడటమే కాకుండా, పహల్గాం దాడి బాధితులకు న్యాయం చేయాలనే సంకల్పాన్ని చాటుతుంది. టీఆర్‌ఎఫ్‌ గతంలో భారత భద్రతా దళాలపై జరిగిన దాడులకు కూడా బాధ్యత వహించినట్లు అమెరికా గుర్తించింది,

Also Read: అణ్వస్త్రాలపై వెనక్కు తగ్గిన పాకిస్తాన్‌.. ఆ దేశంలో ఏం జరుగుతోంది?

అమెరికా ప్రకటనపై స్పందించిన భారత్‌..
అమెరికా నిర్ణయాన్ని భారత్‌ హర్షించింది. భారత రాయబార కార్యాలయం ఈ చర్యను ఉగ్రవాదానికి వ్యతిరేకంగా రెండు దేశాల మధ్య బలమైన సహకారానికి నిదర్శనంగా పేర్కొంది. విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌ కూడా ఈ నిర్ణయాన్ని సమర్థిస్తూ, ఉగ్రవాదాన్ని ఎన్నటికీ సహించరాదని పునరుద్ఘాటించారు. ఈ ఘటన తర్వాత భారత్‌ చేపట్టిన ‘ఆపరేషన్‌ సిందూర్‌’ ద్వారా పాకిస్థాన్‌లోని ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసిన విషయం కూడా భారత్‌ దృఢమైన వైఖరిని ప్రతిబింబిస్తుంది.

అమెరికా బహుముఖ వ్యూహం
‘ది రెసిస్టెన్స్‌ ఫ్రంట్‌’ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించడం ద్వారా అమెరికా తీసుకున్న నిర్ణయం, ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో దాని వ్యూహాత్మక విధానాన్ని స్పష్టం చేస్తుంది. ఈ వ్యూహం జాతీయ భద్రతను కాపాడటం, అంతర్జాతీయ సహకారాన్ని బలోపేతం చేయడం, ఉగ్రవాద సంస్థలను బలహీనపరచడం వంటి బహుముఖ లక్ష్యాలను కలిగి ఉంది. ఈ నిర్ణయం టీఆర్‌ఎఫ్‌ను లష్కరే తయిబాతో అనుబంధం కలిగిన సంస్థగా గుర్తించడం ద్వారా, దాని కార్యకలాపాలను అడ్డుకోవడానికి చట్టపరమైన, ఆర్థిక ఆంక్షలను విధించే లక్ష్యాన్ని కలిగి ఉంది. ఈ చర్య టీఆర్‌ఎఫ్‌ ఆర్థిక వనరులు, లాజిస్టికల్‌ మద్దతు, అంతర్జాతీయ కార్యకలాపాలను దెబ్బతీస్తుంది.

Also Read: తాళిబాన్లకు మద్దతు.. అసలు భారత్ వ్యూహం ఏంటి

అంతర్జాతీయ సహకారం బలోపేతం
అమెరికా నిర్ణయం భారత్‌తో దాని దీర్ఘకాల సహకారాన్ని బలపరుస్తుంది. భారత రాయబార కార్యాలయం ఈ చర్యను ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో రెండు దేశాల మధ్య బలమైన భాగస్వామ్యానికి నిదర్శనంగా స్వాగతించింది. ఈ వ్యూహం అంతర్జాతీయ సమాజంలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఐక్యతను ప్రోత్సహిస్తుంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular