War Effect: ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధ వాతావరణంతో నష్టపోయే భారతీయ కంపెనీలు ఇవే..

ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య యుద్ధ వాతావరణం అలుముకుంటోంది. ఈ నేపథ్యంలో భారత్ కు చెందిన చాలా కంపెనీలు ఆందోళనకు గురవుతున్నాయి. ఎందుకంటే ఇజ్రాయెల్ భారత్ కు మంచి మిత్రుడు కాబట్టి భారత్ లో ఉన్న చాలా కంపెనీలు అక్కడ వాటి వ్యాపారాలు ప్రారంభించాయి. ఒక వేళ యుద్ధమే జరిగితే ఈ కంపెనీలు కూడా నష్టపోతాయని తెలుస్తోంది.

Written By: Mahi, Updated On : October 5, 2024 2:22 pm

Israel-Iran war effect

Follow us on

War Effect: మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తత, సంఘర్షణలు తగ్గే సూచనలు కనిపించడం లేదు. మొదట ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం. ఆ తర్వాత ఇజ్రాయెల్-లెబనాన్, ఇప్పుడు ఇజ్రాయెల్-ఇరాన్ ఇలా అధ్వాన్నమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇవి ప్రపంచాన్ని ఆందోళనలకు గురి చేస్తున్నాయి. ఇప్పటికే రెండు దేశాల్లోనూ యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. అమెరికా నుంచి భారత్‌ వరకు ఉన్న స్టాక్‌ మార్కెట్ లే ఇందుకు ఉదాహరణ. ముడి చమురు ధర పెరగడం (క్రూడ్ ఆయిల్ ప్రైస్ హైక్) ఆందోళనను మరింత పెంచింది. భారత్ గురించి మాట్లాడుతూ.. ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య పెరుగుతున్న యుద్ధ సంకేతాల కారణంగా భారత్ కు చెందిన చాలా కంపెనీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఎందుకంటే వారి వ్యాపారానికి ఇజ్రాయెల్‌ అతిపెద్ద దేశం కాబట్టి. ఇరాన్ – ఇజ్రాయెల్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తత ప్రపంచ మార్కెట్లలో ఆందోళనలకు దారితీసింది. గురువారం చివరి ట్రేడింగ్ రోజున, సెన్సెక్స్ 1769 పాయింట్లు, నిఫ్టీ 546 పాయింట్లు పడిపోయాయి. శుక్రవారం మార్కెట్ ప్రారంభం క్రాష్ అయ్యింది. ఈ యుద్ధంతో దాదాపు 14 భారతీయ కంపెనీలు ఎక్కువగా ప్రభావితమవుతున్నాయని తెలుస్తోంది. వీటిలో టాటా గ్రూప్ కంపెనీల నుంచి గౌతమ్ అదానీ వరకు కంపెనీలు ఉన్నాయి. యుద్ధ ప్రభావం ఇప్పటికే ఈ కంపెనీల షేర్లపై పడటం ప్రారంభించింది.

14 కంటే ఎక్కువ కంపెనీలకు అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యం
ఇండియా టుడే నివేదిక ప్రకారం.. ఇజ్రాయెల్‌లో ఉనికిని కలిగి ఉన్న భారతీయ కంపెనీల్లో.. స్టాక్ మార్కెట్‌లో 14 కంటే ఎక్కువ పెద్ద పేర్ల జాబితా ఉంది. వీటిలో అదానీ గ్రూప్ కంపెనీ అదానీ పోర్ట్, ఫార్మా రంగ కంపెనీ సన్‌ ఫార్మా, జ్యువెలరీ రంగ సంస్థ కళ్యాణ్ జ్యువెలర్స్ నుంచి టాటా గ్రూప్‌కు చెందిన టైటాన్ వరకు ఉన్నాయి. ఇవి కాకుండా, టీసీఎస్, విప్రో, టెక్ మహీంద్ర వరకు ఇజ్రాయెల్‌లో పెద్ద వ్యాపారాలు చేస్తున్నాయి.

ఇజ్రాయెల్‌లో రద్దీగా ఉండే ఓడరేవుల్లో ఒకటైన హైఫా పోర్ట్‌లో ప్రధాన వాటాను అదానీ పోర్ట్స్ కలిగి ఉంది. పెరుగుతున్న వివాదంతో అదానీ పోర్ట్స్ షేర్లు గురువారం 3 శాతం పడిపోయాయి. ఇదే కాకుండా, ఇజ్రాయెలీ టారో ఫార్మాస్యూటికల్స్‌లో పెద్ద వాటాను సన్ ఫార్మాస్యూటికల్స్ కలిగి ఉంది. ఇది కూడా ప్రభావితం కావచ్చు. టెల్ అవీవ్ ఆధారిత ఫార్మా దిగ్గజం టెవా ఫార్మాస్యూటికల్‌తో సంబంధాలు కలిగి ఉన్న డాక్టర్ రెడ్డీస్, లుపిన్‌ కూడా ఫార్మా రంగంలోని ఇతర కంపెనీల్లో ఉన్నాయి.

ఆభరణాల నుంచి ఐటీకి టాటా నాక్
ఇజ్రాయెల్‌లో వ్యాపారం చేస్తున్న భారతీయ కంపెనీల జాబితాలో టాటా గ్రూప్ ది పెద్ద షేరు. ఆభరణాల నుంచి ఐటీ రంగం వరకు వీరి వ్యాపారం విస్తరించింది. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం తీవ్రమైతే, టైటాన్, TCS వ్యాపారం ప్రభావితం కావచ్చు. కళ్యాణ్ జ్యువెలర్స్ ఇజ్రాయెల్‌లో కూడా వ్యాపారం చేస్తుంది. ఇజ్రాయెల్‌లోని బడా కంపెనీలకు ఐటీ సేవలందిస్తున్న విప్రో, టెక్ మహీంద్రా సంస్థలు యుద్ధ పరిస్థితులపై నిఘా ఉంచాయి. ఇవే కాకుండా NMDC పేరు కూడా జాబితాలో ఉంది.

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య పెరుగుతున్న వివాదంతో బ్యాంకింగ్ నుంచి మైనింగ్ వరకు గందరగోళం ఏర్పడుతుంది. దేశంలోని అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కూడా ఇజ్రాయెల్‌లో ఉంది. మైనింగ్ లో పెద్ద కంపెనీ లార్సెన్ & టూబ్రో (L&T), దాని వ్యాపారాన్ని అక్కడ విస్తరించింది. ఏషియన్ పెయింట్స్, బెర్గర్ పెయింట్స్ ఉత్పత్తులకు ఇజ్రాయెల్‌లో కూడా మంచి డిమాండ్ ఉంది. పెరుగుతున్న ఉద్రిక్తతతో ఈ కంపెనీల షేర్లు మునుపటి ట్రేడింగ్ రోజున 3-4% పడిపోయాయి.