అంతర్జాతీయంCanada : వంటగదిలో గొడవ.. కెనడాలో భారతీయ విద్యార్థి హత‍్య వెనుక దారుణ నిజాలు

Canada : వంటగదిలో గొడవ.. కెనడాలో భారతీయ విద్యార్థి హత‍్య వెనుక దారుణ నిజాలు

Canada :  అగ్రరాజ్యం అమెరికాలో.. ఉన్నత చదువులు, ఉద్యోగాల కోసం వెళ్తున్న భారతీయులు వివిధ కారణాలతో ఇటీవలి కాలంలో మరణిస్తున్నారు. కొందరు ప్రమాదవశాత్తు మరణిస్తుంటే.. కొందరు ఆత్మహత్య చేసుకుంటున్నారు. కొందరు హత్యకు గురవుతున్నారు. ఇటీవలే ఖమ్మం జిల్లాకు చెందిన విద్యార్థి అక్కడి సూపర్‌ మార్కెట్‌లో దుండగులు జరిపిన కాల్పుల్లో మృతిచెందాడు. ఆరు నెలల క్రితమే అమెరికా వెళ్లి హత్యకు గురయ్యాడు. ఇలా అమెరికాలో భారతీయులపై దాడులు పెరుగుతున్నాయి. తాజాగా కెనడాకూ ఆ సంస్కృతి పాకింది. అమెరికా తర్వాత భారతీయులు ఎక్కువగా వెళ్లే దేశాల్లో కెనడా కూడా ఒకటి. ఇటీవలే రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. అయినా విద్యార్థులు సురక్షితంగానే ఉన్నారు. కానీ తాజాగా ఇద్దరు స్నేహితల మధ్య జరిగిన గొడవ హత్యకు దారితీసింది.

వంటగదిలో గొడవ..
భారత్‌లోని పంజాబ్‌ రాష్ట్రం లూథియానాకు చెందిన గురాసిస్‌సింగ్‌(22) ఉన్నత చదువుల కోసం నాలుగు నెలల క్రితం ఉన్నత చదువుల కోసం కెనడాకు వెళ్లాడు. అక్కడి సర్నియా నగరంలో లాంబన్‌ కాలేజీలో చేరాడు. స్థానికంగా ఓ అపార్ట్టెమెంట్‌లో తన 34వ క్రాస్లీ హంటర్‌తో కలసి ఉంటున్నాడు. నవంబర్‌ 30న రాత్రి తన రూమ్‌లో ఓ విషయంలో గురుసిస్‌కు, హంటర్‌కు మధ్య గొడవ జరిగింది. ఆ గొడవ హత్యకు దారితీసింది. కిచెన్‌లో ఉన్న గురుసిస్‌పై హంటర్‌ కత్తితో దాడిచేశాడు. ఈ ఘటనలో గురుసిస్‌ అక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

పోలీసుల అదుపులో నిందితుడు..
ఈ ఘటన అనంతరం గుర్తుతెలియని వ్యక్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు అపార్ట్‌మెంట్‌కు చేరుకున్నారు. నిందితుడ హంటర్‌ను అదుపులోకి తీసుకున్నారు. హత్యపై విచారణ జరుపుతున్నట్లు సర్నియా పోలీస్‌ అధికారి డేవిస్‌ తెలిపారు. ఈమేరు గురుసిస్‌ సింగ్‌ కుటుంబ సభ్యులకు సమాచారం అందించామన్నారు. గురుసిస్‌ హత్యపై లాంబన్‌ కాలేజీ యాజమ్యాం విచారం వ్యక్తం చేసింది.

కెనడా, భారత్‌ మధ్య విభేదాలు..
ఇదిలా ఉంటే.. సిక్కు వేర్పాటు వాది, ఖలిస్తానీ ఉగ్రవారి హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్య విషయమై భారత్‌, కెనడా మధ్య విభేదాలు తలెత్తాయి. నిజ్జర్‌ హత‍్యకు భారత ఏజెంట్లే కారణమని కెనడా ప్రధాని ట్రూడో ఆరోపించారు. ఎలాంటి ఆధారం చూపకుండా ఆరోపించడాన్ని భారత్‌ తప్పు పట్టింది. ఇటీవల భారత రాయబారులను విచారణ చేసేందుకు యత్నించింది. నిందితుల జాబితాలో చేర్చింది. దీంతో భారత్‌ ఆగ్రహం ‍వ్యక్తం చేసింది. భారత రాయబారులను వెనక్కి రప్పించి.. భారత్‌లోని కెనడా రాయబారులను బహిష్కరించింది. దీంతో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు మరింత దెబ్బతిన్నాయి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Indus Water Dispute: సింధూ జలాలు కావలట… పాపం ఇజ్జత్ పోగొట్టుకున్న పాకిస్తాన్

Indus Water Dispute: ఎన్ని రకాలుగా అంతర్జాతీయ వేదికల మీద పరువు పోగొట్టుకున్నప్పటికీ పాకిస్తాన్ తీరు మారదు. సిగ్గు లేదా జీడి గింజ అంటే.. నల్లగున్న నాకేం సిగ్గు అన్నట్టుగా పాకిస్తాన్ వ్యవహారం...

Hyderabad crime : ప్రియుడి సహకారంతో భర్తను లేపేసింది.. పోలీసులకు దృశ్యం సినిమాను చూపించింది..

Hyderabad crime : ఇది మామూలు మ*ర్డ*ర్ కాదు.. దృశ్యం సినిమాను మించిపోయింది. ప్రతి సీన్ లోనూ ఉత్కంఠ.. ప్రతి కదలికలోనూ సీక్రసీ కొనసాగించింది. కాకపోతే చివరి క్షణంలో దొరికిపోయింది. ఫలితంగా ఆమె.....

Most Popular

Indus Water Dispute: సింధూ జలాలు కావలట… పాపం ఇజ్జత్ పోగొట్టుకున్న పాకిస్తాన్

Indus Water Dispute: ఎన్ని రకాలుగా అంతర్జాతీయ వేదికల మీద పరువు పోగొట్టుకున్నప్పటికీ పాకిస్తాన్ తీరు మారదు. సిగ్గు లేదా జీడి గింజ అంటే.. నల్లగున్న నాకేం సిగ్గు అన్నట్టుగా పాకిస్తాన్ వ్యవహారం...

Nandyal Missing Girl: తుని చిన్నారి తరహాలోనే ఏపీలో మరో బాలిక మిస్సింగ్.. చివరికి ట్విస్ట్

Nandyal Missing Girl: కాకినాడ జిల్లా తునిలో రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసు మిస్టరీ ఇంతవరకు వీడలేదు. చిన్నారి ఆచూకీ ఇంతవరకు దొరకలేదు. ఇలాంటి పరిస్థితుల్లో నంద్యాల జిల్లాలో జరిగిన ఓ...

Maho Beach: విమానం టేకాఫ్.. భయంకరమైన గాలులు.. పర్యాటకులు ఎగిరిపడ్డారు.. వైరల్ వీడియో

Maho Beach: వాతావరణం ఆహ్లాదంగా ఉంది.. మబ్బులు కమ్ముకున్నాయి. సముద్రపు అలలు తీరాన్ని తాకుతున్నాయి. పర్యాటకులు ఆ వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు. సముద్రపు ఒడ్డున సేద తీరుతున్నారు. నచ్చిన ఫుడ్ తింటు ఎంజాయ్ చేస్తున్నారు....

Kotha Jaipal Reddy : దుబాయ్‌లో ‘ఈటీసీఏ’ బోనాల జాతర.. ముఖ్య అతిథిగా మైత్రి గ్రూప్ అధినేత కొత్త...

దుబాయ్: తెలంగాణ సంస్కృతి, ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీకగా నిలిచే శ్రీ మహంకాళి అమ్మవారి బోనాల మహోత్సవాన్ని ఎమిరేట్స్ తెలంగాణ కల్చరల్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ (ETCA) ఆధ్వర్యంలో యూఏఈలో అత్యంత వైభవంగా నిర్వహించారు....

Trump Family : ట్రంప్‌ ఫ్యామిలీపై ట్రెహాన్ వేదికగా సంచలన పరిణామం

Trump Family : రాయలసీమ ఫ్యాక్సనిజంలో రక్తానికి రక్తం అన్నట్లుగా ఒకప్పుడు హత్యలు జరిగేవి. కుటుంబాలనే మట్టుబెట్టేవారు. అయితే క్రమంగా హింస పరిష్కారం కాదని మారుతున్న తరాలకు అర్థమైంది. కఠిన శిక్షలే కూడా...
Exit mobile version