Homeఅంతర్జాతీయంPopulation Crisis In Japan: జపాన్‌లో జనాభా సంక్షోభం.. వలస కార్మికులతో సాంస్కృతిక మార్పులు

Population Crisis In Japan: జపాన్‌లో జనాభా సంక్షోభం.. వలస కార్మికులతో సాంస్కృతిక మార్పులు

Population Crisis In Japan: జపాన్‌ తక్కువ జననాలు, వృద్ధాప్యం వల్ల జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దీనికి వలస కార్మికులపై ఆధారపడుతున్నప్పటికీ, సాంస్కృతికంగా గుర్తించడాన్ని కాపాడుకోవడానికి కఠిన చర్యలు తీసుకుంటోంది. ప్రస్తుతం వలసలు పెరిగాయి. వలస వచ్చినవారు జపాన్‌ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. క్రమ శిక్షణను దెబ్బతీస్తున్నారు.

పెరిగిన వలసలు..
జపాన్‌ ద్వీప దేశంగా బయటి వలసలను పరిమితం చేసుకుని జాతీయ శుద్ధతను కాపాడుకుంది. కానీ దేశంలో జననాల రేటు బాగా తగ్గింది. దీంతో యువకులు తగ్గిపోయి వృద్ధ జనాభా గణనీయంగా పెరిగింది. దీంతో పని చేయడానికి శ్రామికులు తగ్గిపోయారు. ఫలితంగా రోబోలకు పనిచెబుతున్నారు. పని శక్తి కొరత నేపథ్యంలో జపాన్‌కు ఇండోనేషియా, మలేషియా, బంగ్లాదేశ్, పాకిస్తాన్‌ నుంచి వలసలు పెరిగాయి. వీరంతా ముస్లిం కార్మికులు. వీరు కూలీలు, కంపెనీలు, గృహాల్లో పనిచేస్తున్నారు.

పెరిగిన నిరసనలు..
వలస కార్మికులు ఇటీవల ఒసాకాలో ముస్లిం కార్మికులు పాలస్తీనా జెండాలతో ఆ దేశానికి మద్దతుగా పెద్ద ఊరేగింపు నిర్వహించారు. జపాన్‌ నిబంధనలకు విరుద్ధగా జరిగిన ఈ నిరసన ప్రదర్శన చూసి జపాన్‌ ప్రజలు ఆందోళన చెందారు. మరోవైపు ముస్లింలు తరచూ రోడ్లపై నమాజు చేయడం పెరిగింది. ఇది ట్రాఫిక్‌కు, ప్రజలకు ఇబ్బందిగా మారింది. ఇంకోవైపు భూములు ఆక్రమించి మసీదుల నిర్మాణం చేయడం స్థానికుల్లో భయం పెంచింది. దీంతో జపాన్‌ ప్రభుత్వం రోడ్లపై నమాజ్‌ను నిషేధించింది.

చట్టపరమైన చర్యలు…
ఇక నమాజ్‌ సమయంలో మైక్‌లు ఉపయోగించకుండా జపాన్‌ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇక ముస్లింలు కబ్రస్థాన్‌లో చనిపోయినవారిని ఖననం చేస్తారు. కానీ జపాన్‌లో స్థలం కరొత కారణంగా కబ్రస్థాన్‌ విధానాన్ని నిషేధించింది. తమలాగే దహనం చేయాలని సూచించింది. లేదంటే మృతదేహాలను తమ సొంత దేశాలకు తీసుకెళ్లి అక్కడ అంత్యక్రియలు చేసుకోవాలని సూచించింది. ఇందుకు తాము సహకరిసామని తెలిపింది.

జపాన్‌ ప్రధాని ‘మన సంస్కృతికి అనుగుణంగా లేకపోతే మనుగడ కష్టమవుతుంది‘ అని స్పష్టం చేశారు. మత స్వేచ్ఛ ఉన్నా, పబ్లిక్‌ స్పేస్‌ల ఆక్రమణలు అనుమతించబడవు. ఈ చర్యలు జాపనీయ జాతీయతను కాపాడుకునే ప్రయత్నంగా కనిపిస్తున్నాయి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular