Homeఅంతర్జాతీయంPM Modi America Tour : ప్రధాని మోదీ అమెరికా పర్యటన.. ట్రంప్‌ 2.0లో ప్రత్యేక...

PM Modi America Tour : ప్రధాని మోదీ అమెరికా పర్యటన.. ట్రంప్‌ 2.0లో ప్రత్యేక ఆహ్వానం.. అసలు కథ ఏంటంటే?

PM Modi  America Tour :  గతేడాది జూన్‌లో భారత్‌లో మోదీ 3.0 ప్రభుత్వం ఏర్పడింది. మూడోసారి నరేంద్రమోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఇక మోదీతోపాటే అమెరికా అధ్యక్షుడు అయిన డొనాల్డ్‌ ట్రంప్‌ మాత్రం 2019 ఎన్నికల్లో ఓడిపోయారు. తాజాగా 2024లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో మళ్లీ పోటీచేసి విజయం సాధించారు. 47వ అధ్యక్షుడిగా వైట్‌హౌస్‌లో అడుగు పెట్టారు. అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన నాటి నుంచే సంచనల నిర్ణయాలు తీసుకుంటూ జుడీషియల్‌ ఆర్డర్స్‌ జారీ చేస్తున్నారు. దీంతో ప్రపంచ దేశాలన్నీ వణికిపోతున్నాయి. వలస వాదులను యుద్ధ ఖైదీల్లా చేతులకు బేడీలు వేసి వారి స్వదేశాలకు సైనిక విమానాల్లోనే తరలిస్తున్నారు. 20 రోజుల్లోనే అనేక కీలక నిర్ణయాలు తీసుకున్న ట్రంప్‌తో ఇటీవల భారత ప్రధాని మోదీ ఫోన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా ట్రంప్‌ ప్రధాని మోదీని అమెరికాకు ఆహ్వానించారు. దీంతో మోదీ అమెరికా పర్యటనకు సిద్ధమయ్యారు. ఫిబ్రవరి 12, 13 తేదీల్లో అమెరికాలో పర్యటించనున్నట్లు భారత విదేశాంగ శాఖ అధికారికంగా ప్రకటించింది. ఈ పర్యటనలో మోదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో సమావేశం అవుతారని విదేశాంగ శాఖ సెక్రెటరీ విక్రమ్‌ మిస్రీ తెలిపారు.

ట్రంప్‌ 2.0లో తొలి పర్యటన..
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి బాధ్యతలు చేపట్టాక మోదీ అమెరికాలో పర్యటించడం ఇదే తొలిసారి. ట్రంప్‌ పరిపాలన అధికారంలోకి వచ్చిన కొన్ని రవారాల్లోనే ద్వైపాక్షిక పర్యటన కోసం వాషింగ్‌టటన్‌ డీసీని సందర్శించనున్న కొద్ది మంది విదేశీ నేతల్లో మోదీ కూడా ఉన్నారు. ట్రంప్‌ రెండోసారి బాధ్యతలు చేపట్టిన వారం తర్వాత అంటే జనవని 27న మోదీ ట్రంప్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ప్రపంచ శాంతి, రక్షణ, టెక్నాలజీ, భద్రత, వ్యాపార సంబంధాలతోపాటు ఇతర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. పరస్పర సహకారంతో నమ్మకమైన భాగస్వామ్యం, సంక్షేమం, ప్రజలు, ప్రపంచ శాంతి గురించి మాట్లాడుకున్నారు.

భారీ విజయం..
ఇదిలా ఉంటే.. 2024 నవంబర్‌లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన ట్రంప్‌ ఘన విజయం సాధించారు. 300లకుపైగా ఎలక్టోరల్‌ ఓట్లు సాధించారు. 2025, జనవరి 20 బాధ్యతలు స్వీకరించారు. పరిపాలన అధికారంలోకి వచ్చాక కొన్ని వారాలలోపే ద్వైపాక్షిక పర్యటన కోసం పలువురు నేతలు అమెరికాలో పర్యటించనున్నారు. వీరిలో మోదీ కూడా ఉన్నారు.

ఫ్రాన్స్‌లో రెండు రోజులు..
మోదీ అమోరికా పర్యటనకు ముందు ఫ్రాన్స్‌లో పర్యటించనున్నారు. ఈనెల 10 నుంచి 12వ తేదీ వరకు మోదీ ఫ్రాన్స్‌ పర్యటనకు వెళ్తారని విదేశాంగ శాఖ తెలిపింది. యాక్షన్‌ కమిటీ సమావేశానికి మోదీ అధ్యక్షత వహిస్తారని పేర్కొంది. మోదీ థర్మో న్యూక్లియర్‌ రియాక్టర్‌ను సందర్శించనున్నారు. అనంతరం ఫ్రాన్స్‌ పర్యటన ముగించుకుని అమెరికా వెళ్తారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version