spot_img
Homeఅంతర్జాతీయంAbdul Basit Controversial Comments: బాసిత్‌ కారుకూతలు.. భారత్‌ జోలికొస్తే పాకిస్తాన్ ప్రపంచపఠంలో ఉండదు

Abdul Basit Controversial Comments: బాసిత్‌ కారుకూతలు.. భారత్‌ జోలికొస్తే పాకిస్తాన్ ప్రపంచపఠంలో ఉండదు

Abdul Basit Controversial Comments: ఇరాన్, అమెరికా యుద్ధాన్ని గమనిస్తే.. 24 రోజులుగా ఇరాన్‌ అగ్రరాజ్యంతో పోరాడుతోంది. వారం పది రోజుల్లో ముగుస్తుందనుకున్న వార్‌ ఇప్పటికీ కొనసాగుతోంది. అయితే ఇందులో ఇరాన్‌ నేరుగా అమెరికాపై దాడి చేయడం లేదు. అమెరికాకు మద్దతుగా ఉన్న గల్ఫ్‌ దేశాలపై ప్రతీకార దాడులు చేస్తోంది. అక్కడి అమెరికా బేస్‌లపై దాడులు చేస్తోంది. దీంతో గల్ఫ్‌ దేశాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. అమెరికా భయంతో పాకిస్తాన్‌ కూడా ఇప్పుడు భారత్‌పై బెదిరింపులకు దిగుతోంది. అమెరికాకు పాకిస్తాన్‌తో ప్రమాదం ఉందని ఇంటలిజెన్స్‌ చీఫ్‌ నివేదిక ఇచ్చారు. దీంతో పాకిస్తాన్‌ తమ ప్రతిదాడులు భారత్‌పై ఉంటాయని బెదిరింపులకు దిగుతోంది.

Also Read: తల తెగినా తలొగ్గలేదు.. ఇరాన్‌ యుద్ధ వ్యూహం ప్రపంచానికే ఆదర్శం!

ఇంటర్వ్యూలో బాసిత్‌ కీలక వ్యాఖ్యలు..
పాకిస్తాన్‌ మాజీ భారత రాయబారి అబ్దుల్‌ బాసిత్, 2015 వరకు భారత్‌లో పనిచేసిన డిప్లమాట్, తులసీ గబ్బార్డ్‌ అమెరికా ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా పాక్‌ అణు ముప్పును హెచ్చరించిన నేపథ్యంలో సంచలన వ్యాఖ్య చేశాడు. అమెరికా పాక్‌పై దాడి చేస్తే భారత్‌పై ప్రతీకార దాడి చేస్తామని ప్రకటించారు. తద్వారా తమవద్ద దీర్ఘ రెంజ్‌ క్షిపణులు లేవని పరోక్షంగా ఒప్పుకున్నాడు. పాక్‌ సైనికాధికారి ఆమోదం లేకుండా అధికారులు ఇటువంటి మాటలు రావు, బాసిత్‌ వ్యాఖ్యలు కూడా ఆసిమ్‌ మద్దతుతో చేసినవే అని తెలుస్తోంది.

క్రికెట్‌ మ్యాచ్‌ల్లో ద్వంద్వ ధోరణి
భారత్‌లో పాక్‌ క్రికెట్‌ జట్టు గెలిచినప్పుడు కొందరు ముస్లింలు పాక్‌ జెండాలు ఊపి సంబరాలు చేస్తున్నారు, అదే సమయంలో హిందూ ధార్మిక ఊరేగింపులకు పాక్‌ అనుకూల నినాదాలు చేస్తున్నారు, వందేమాతరం పాటకు వ్యతిరేకిస్తున్నారు. టీ20 వరల్డ్‌ కప్‌లో పాక్‌ విజయం తర్వాత ముస్లింలపై దాడులు జరగడం, మాజీ పాక్‌ క్రికెటర్‌లు భారత ముస్లింలు పాక్‌కు మద్దతు ఇస్తారని చెప్పడం ద్వంద్వ వైఖరిని తెలియజేస్తాయి. ఇలాంటి చర్యలు దేశీయ సామరస్యాన్ని దెబ్బతీసి, పాక్‌ ఉగ్రవాదానికి ఆధారం అవుతాయి.

కార్గిల్‌ యుద్ధ సమయంలో..
1999 కార్గిల్‌ యుద్ధంలో పాక్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ హడావుడిగా అమెరికా వెళ్లి బిల్‌ క్లింటన్‌ను కలిసి సహాయం కోరాడు. క్లింటన్‌ వాజ్‌పేయిని ఫోన్‌ చేసి యుద్ధం ఆపమని అడిగినప్పుడు, వాజ్‌పేయి తిరస్కరించారు. పాక్‌ అణుబాంబు వేస్తే భారత్‌ ప్రతీకారంతో పాక్‌ను ప్రపంచ పటంలోంచి తుడిచివేస్తామని హెచ్చరించారు. ఈ సంఘటన పాక్‌ బలహీనత, భారత్‌ ధైర్యానికి చిహ్నం.

ఉగ్రవాద వ్యూహ మార్పు
పాక్‌ భారత్‌పై నేరుగా దాడులు ఆపి, బంగ్లాదేశ్‌ను ముసుగు యుద్ధ క్షేత్రంగా మార్చుకుంటోంది. యూనిస్‌ పాలనలో ఉగ్ర గ్రూపులు పెరిగి, కశ్మీరు తప్ప ఇతర ప్రాంతాలను లక్ష్యం చేస్తున్నాయి. ముంబై, పుల్వామా, పఠాన్‌కోట్‌ దాడులు పాక్‌ సపోర్ట్‌తో జరిగాయి. ఈమేరకు యూఎన్‌ భారత్‌కు ఆధారాలు సమర్పించింది.

అణుబాంబుకు మతం తెలియదు. పాక్‌ దాడి చేస్తే భారత్‌లోని పాక్‌ అనుకూల ముస్లింలు, వారి కుటుంబాలు కూడా మరణిస్తారు. లాహోర్, ఇస్లామాబాద్‌లపై భారత కౌంటర్‌ దాడులు పాక్‌ను విధ్వంసం చేస్తాయి. భారత వ్యతిరేక కార్యకలాపాలు దేశ భద్రతకు, అనుకూలుల ప్రాణాలకు ముప్పు, జాతీయ సమైక్యత అవసరం.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version