spot_img
Homeఅంతర్జాతీయంMuzaffarabad Helicopter Crash: ఉగ్రవాద పాకిస్తాన్ కు.. మన శంకరుడు తగిన శాస్తి చేశాడు..

Muzaffarabad Helicopter Crash: ఉగ్రవాద పాకిస్తాన్ కు.. మన శంకరుడు తగిన శాస్తి చేశాడు..

Muzaffarabad Helicopter Crash: హిందువులు ఆరాధ్య దైవంగా కొలిచే శివుడు హిమాలయాల మీద కొలువై ఉంటాడు. అక్కడ ధ్యానంలో ఉంటాడు. ఈశ్వరుడిని తలచుకుంటూ సాధువులు తపస్సు చేస్తుంటారు. తనను కొలిచే భక్తులకు.. తన పరిసర ప్రాంతంలో జీవించే ప్రజలకు ఏమైనా కష్టం వస్తే శంకరుడు క్షణంలోనే తన ప్రతాపం చూపిస్తాడు. ఇప్పుడు ఉగ్రవాద పాకిస్తాన్ దేశానికి కూడా శంకరుడు తన ఉగ్రరూపాన్ని చూపించాడు. అందువల్లే పాకిస్తాన్ తోక ముడుచుకుంది. తల వంచుకుంది.

పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో కొంతకాలంగా అక్కడి ప్రజలు ఆందోళన చేస్తున్నారు. పాకిస్తాన్ ప్రభుత్వం తీరు పట్ల తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. అయితే ప్రజల నుంచి వస్తున్న ఆగ్రహాన్ని.. నిరసనను చల్లార్చడానికి పాకిస్థాన్ ప్రభుత్వం ఏకంగా ఆర్మీని రంగంలోకి దింపింది. విచక్షణ రహితంగా కాల్పులు జరిపిస్తోంది. పాకిస్తాన్ ఆర్మీ కాల్పుల్లో గర్భిణులు.. చిన్నపిల్లలు చనిపోతున్నారు. అక్కడి మారణకాండను ప్రపంచ దేశాలు తీవ్రస్థాయిలో ఖండిస్తున్నాయి. అయినప్పటికీ పాకిస్తాన్ తీరు మారడం లేదు.

పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఉగ్రవాద పాకిస్తాన్ దేశం చేస్తున్న దారుణాన్ని శివుడు చూస్తూ ఊరుకోలేకపోయాడు. అందువల్లే పాకిస్తాన్ ఆర్మీకి చెందిన ఎంఐ 17 హెలికాప్టర్ కు ప్రమాదం జరిగేలా చేశాడు. ఆ హెలికాప్టర్ ముజఫరాబాద్ లో కూలిపోయింది. ఈ ప్రమాదంలో దాదాపు 21 మంది చనిపోయారు. టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఎమర్జెన్సీ ల్యాండింగ్ కు ప్రయత్నిస్తుండగా హెలికాప్టర్ క్రాష్ అయ్యింది.. చూస్తుండగానే నేల కూలిపోయింది. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లో చోటుచేసుకుంటున్న ఉద్రిక్తతల వల్ల.. పాకిస్తాన్ ఆర్మీ అదనపు బలగాలను తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అయితే ఇందులో ఎవరు కూడా ప్రాణాలతో మిగలలేదని సమాచారం. మృతులకు పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ మునీర్ నివాళులర్పించారు.

పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ మొత్తం హిమాలయ పర్వతాలకు అత్యంత దగ్గరగా ఉంటుంది. అలాంటప్పుడు తన చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రజలకు అన్యాయం జరుగుతుంటే శివుడు చూస్తూ ఎలా ఉంటాడు.. అందువల్ల తన కోపాన్ని ఇలా చూపిస్తూ ఉంటాడు. ఇప్పటికైనా పాకిస్తాన్ పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ జోలికి వెళ్లకపోవడమే మంచిది. ఎందుకంటే అక్కడ శివుడు ఉన్నాడు. శివుడిని పాకిస్తాన్ నమ్మకపోవచ్చు. కానీ కోట్లాదిమంది హిందువులు నమ్ముతుంటారు. పాకిస్థాన్ ఆక్రమించిన జమ్మూ కాశ్మీర్ లో కూడా హిందువులు శివుడిని పూజిస్తుంటారు. వారి బాధలను మన శివయ్య విన్నట్టున్నాడు. అందుకే ఉగ్రవాద పాకిస్థాన్ ఆర్మీకి చావును పరిచయం చేశాడు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version