US Warning To World Nations: మధ్య ప్రాచ్యంలో, ముఖ్యంగా హార్ముజ్లో భారత్పై వ్యాపార, ఎనర్జీ మార్గాల పరంగా ప్రధాన ఆసక్తి ఉంటుంది. అయితే ఇటీవల మూడు నౌకలపై అమెరికా దాడి చేసింది. ముగ్గురు నావికులు మరణించారు. దీనిపై భారత విదేశాంగ స్పందించింది. విదేశాంగ మంత్రి జైశంకర్ అమెరికాకు నిరసన తెలిపారు. అయితే అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి.
మా ఆదేశాలు పాటించాలి…
ప్రస్తుతం హర్మూజ్ అమెరికా బ్లాకేజీలో ఉంది. ఈ నేపథ్యంలో ఇరాన్ చమురు బయటకు వెళ్లకుండా చర్యలు తీసుకుంటోంది. దీంతో హర్మూజ్లో నౌకల కదలికలను నియంత్రిస్తోంది. అమెరికా ఆదేశాలు లేకుండా కదిలే నౌకలపై చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో భారత నౌకలపై దాడిచేసింది. హర్మూజ్ వంటి కీలక ప్రాంతాల్లో అమెరికా సార్వత్రిక ప్రజాస్వామ్య భద్రతా ఆదేశాలను అనుసరించాలనుకుంటోంది. అందుకే తమ ఆదేశాలు పాటించాలని హుకూం జారీ చేసింది.
భారత ప్రతిస్పందన..
భారతీయులలో విదేశీ సూచనలనన్నా స్వాతంత్య్ర భావనకు బలమైన సున్నితత్వం ఉంటుంది. ఇదే విషయాన్ని విదేశాంగ మంత్రి జైశంకర్ మార్కో రూబియోకు స్పష్టం చేశారు. దాడులపై పశ్చాత్తాపం లేకుండా వ్యవహరించడంపై నిరసన తెలిపారు. కానీ రూబియో మాత్రం అమెరికా ఆదేశాలే కీలకమని, అందరూ కట్టుబడి ఉండాలని స్పష్టం చేశారు.
భారత్–అమెరికా సంబంధాలు వాణిజ్య, రక్షణ, టెక్నాలజీ ఆధారంగా బలంగా ఉన్నాయి. హార్ముజ్ వంటి సున్నిత ప్రాంతాలపై వ్యవహరించే ముందు సంప్రదింపు, సమన్వయం, గడిచిన సందర్భాన్ని పంచుకోవడం అవసరం.

