US Reaction To India Attack: అమెరికాది ముమ్మాటికి మూర్ఖత్వం. దుర్మార్గం. అగ్రరాజ్యమననే పేరుతో ప్రపంచం మీద పెత్తనం సాగిస్తోంది. తమకు నచ్చని దేశాల మీద దాడులు చేస్తోంది. యుద్దాలకు కూడా దిగుతోంది. చివరికి దేశ అధ్యక్షులను అపహరించి.. రాక్షసానందం పొందుతోంది. చివరికి మన దేశంపై కూడా దారుణంగా ప్రవర్తిస్తోంది.
ట్రంప్ ప్రెసిడెంట్ అయిన తర్వాత భారత దేశం మీద అమెరికా వైఖరి పూర్తిగా మారిపోయింది. పాకిస్తాన్ దేశానికి సహకారం అందిస్తోంది. పాకిస్తాన్ సైనిక అధ్యక్షుడిని ట్రంప్ తన వద్దకు పిలిపించుకొని.. విందు కూడా ఇచ్చారు. ఉగ్రవాద దేశం అని తెలిసినప్పటికీ కూడా పాకిస్తాన్ దేశంతో అమెరికా అంటకాగడం ఆందోళన కలిగిస్తోంది. స్వీయ సమృద్ధి.. ఇతర అంశాలలో స్వయం ప్రతిపత్తిని సాధిస్తున్న భారత్ మీద అమెరికా కక్ష సాధింపులకు దిగుతోంది. రష్యా నుంచి.. గల్ఫ్ దేశాల నుంచి భారత్ ఆయిల్ కొనుగోలు చేస్తుంటే.. అమెరికా కడుపు మంటతో రగిలిపోతుంది. ఇటీవల కాలంలో అమెరికా విదేశాంగ శాఖ మంత్రి రూబియో భారత్ వచ్చారు. ఇక్కడ కూడా అదే కడుపు మంటను ప్రదర్శించారు.
ఇటీవల కాలంలో మన దేశ విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ ముందు కూడా యూరప్ దేశాలు క్రూడ్ ఆయిల్ ప్రస్తావన తీసుకొచ్చారు. దానిని జై శంకర్ మొహమాటం లేకుండా తిప్పి కొట్టారు. భారత్ తన అవసరాలకు తగ్గట్టుగా ఎక్కడైనా ఆయిల్ కొనుగోలు చేస్తుందని.. యూరప్ ఆయుధాలు మా మీద దాడి చేస్తున్నాయని.. భారత్ ఆయుధాలు యూరప్ మీద దాడి చేయడం లేదు కదా అంటూ కౌంటర్ ఇచ్చారు.. ఇలా చెప్పుకుంటూ పోతే అమెరికా నుంచి పాశ్చాత్య దేశాల వరకు భారత్ మీద సాగిస్తున్న దాడి మామూలుది కాదు.. పైగా ఒకప్పటి మాదిరిగా భారత్ సైలెంట్ గా ఉండడం లేదు. గట్టిగానే కౌంటర్ ఇస్తోంది.
ఇటీవల అమెరికా విదేశాంగ శాఖ మంత్రి రూబియో ఇండియా వచ్చారు. ఈ సమయంలో మన ప్రభుత్వం పరోక్షంగా నిరసన వ్యక్తం చేసింది. దీనిని దృష్టిలో పెట్టుకొని అమెరికా మన నౌక మీద దాడి చేసింది. మన దేశానికి చెందిన మెరైన్ ఇంజనీర్లు చనిపోయారు. వాస్తవానికి కమర్షియల్ నౌకల మీద దాడులు చేయకూడదు. పైగా యుద్ధంలో భారత్ ప్రత్యక్షంగా గాని.. పరోక్షంగా గాని పాల్గొనడం లేదు. అలాంటప్పుడు అమెరికా దాడి చేయడమే అతిపెద్ద దారుణం. పైగా ఈ దాడిని అమెరికా సమర్ధించుకుంటున్నది. మొదట్లో ఆ దాడి ఇరాన్ చేసిందని అమెరికా అధ్యక్షుడు చెప్పాడు. ఇప్పుడేమో రూబియో మాట మార్చి.. మా దాడులు అలాగే ఉంటాయని అంటున్నాడు. పైగా దాడి చేసిన విషయంలో ఏ మాత్రం పశ్చాత్తాపం వ్యక్తం చేయడం లేదు. అమెరికా తీరు పట్ల నిరసనలు వ్యక్తమవుతున్నాయి. కండ ఖావరంతో అమెరికా ప్రవర్తిస్తోందని భారతీయులు మండిపడుతున్నారు. మరోవైపు అమెరికా ముందు నరేంద్ర మోడీ సరెండర్ అయిపోయారని.. భారతీయులను చంపినప్పటికీ స్పందించడం లేదని కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

