Homeఅంతర్జాతీయంIndia Vs America: భారత్‌–అమెరికా ‘పొత్తు’కు సవాళ్లు..!

India Vs America: భారత్‌–అమెరికా ‘పొత్తు’కు సవాళ్లు..!

India Vs America: అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్‌ లుట్నిక్‌ ఇటీవల భారత్‌పై మొక్కజొన్న దిగుమతుల విషయంలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 140 కోట్ల జనాభా ఉన్న భారత్, అమెరికా నుంచి ‘ బుట్టెడు మొక్కజొన్న కూడా కొనడం లేదు‘ అని ఆయన విమర్శించారు. ఈ వ్యాఖ్యలు న్యూదిల్లీలో జరగనున్న భారత్‌–అమెరికా వాణిజ్య చర్చలకు ముందు వ్యూహాత్మకంగా వచ్చినవిగా కనిపిస్తున్నాయి. అమెరికా మొక్కజొన్న ఎగుమతుల్లో ఎదుర్కొంటున్న సవాళ్లు, ముఖ్యంగా ట్రంప్‌ విధానాల వల్ల చైనాతో వాణిజ్య సంబంధాలు దెబ్బతినడం ఈ విమర్శలకు నేపథ్యంగా ఉంది.

ప్రపంచంలో మొక్కజొన్న ఉత్పత్తిలో భారత్‌ ప్రముఖ స్థానంలో ఉంది, సంవత్సరానికి 42 మిలియన్‌ టన్నులతో ప్రపంచ ఉత్పత్తిలో 3% వాటా కలిగి ఉంది. అయినప్పటికీ, 2024–25లో భారత్‌ కేవలం 0.97 మిలియన్‌ టన్నుల మొక్కజొన్నను దిగుమతి చేసింది, ఇందులో మయన్మార్‌ నుంచి 0.53 మిలియన్‌ టన్నులు, ఉక్రెయిన్‌ నుంచి 0.39 మిలియన్‌ టన్నులు ఉన్నాయి. అమెరికా నుంచి దిగుమతులు కేవలం 1100 టన్నులకు పరిమితమయ్యాయి. భారత్‌ 0.5 మిలియన్‌ టన్నుల దిగుమతుల వరకు 15% సుంకం విధిస్తుంది, ఆ తర్వాత 50% టారిఫ్‌ అమలవుతుంది. ఈ అధిక సుంకాలు దిగుమతులను నిరుత్సాహపరుస్తాయి. భారత ప్రభుత్వం జన్యుమార్పిడి మొక్కజొన్న దిగుమతులను నిషేధించింది. ఇది అమెరికా ఎగుమతులకు పెద్ద అడ్డంకిగా నిలిచింది. ఎందుకంటే అమెరికా ఉత్పత్తిలో 94% జన్యుమార్పిడి రకాలే.

అమెరికా ఆందోళన..
అమెరికా ప్రపంచంలో మొక్కజొన్న ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉంది, 2024–25లో 427 మిలియన్‌ టన్నుల ఉత్పత్తితో ప్రపంచ మొత్తం ఉత్పత్తిలో 30%కి పైగా వాటా కలిగి ఉంది. దీనిలో 71.7 మిలియన్‌ టన్నులు ఎగుమతి అవుతాయి, ప్రధానంగా పౌల్ట్రీ, పశుగణం, ఇథనాల్‌ ఉత్పత్తి కోసం. అయోవా, ఇల్లినాయిస్, నెబ్రాస్కా వంటి రాష్ట్రాలు ఈ ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తాయి. అయితే, అమెరికా ఎగుమతులు 2022 తర్వాత తీవ్ర దెబ్బతిన్నాయి. చైనా, గతంలో 4 బిలియన్‌ డాలర్ల విలువైన మొక్కజొన్న దిగుమతి చేస్తూ అతిపెద్ద కొనుగోలుదారుగా ఉండేది, 2024లో కేవలం 331 మిలియన్‌ డాలర్లకు పరిమితమైంది. ట్రంప్‌ పరిపాలనలో చైనాపై విధించిన వాణిజ్య ఆంక్షలు, టారిఫ్‌ యుద్ధం ఈ తగ్గింపుకు కారణం. ఫలితంగా, అమెరికా తన అదనపు ఉత్పత్తిని విక్రయించేందుకు భారత్‌ వంటి కొత్త మార్కెట్లపై ఆధారపడుతోంది. లుట్నిక్‌ వ్యాఖ్యలు ఈ అసంతృప్తిని, వాణిజ్య ఒత్తిడిని ప్రతిబింబిస్తాయి.

భారత్‌లో డిమాండ్‌.. జన్యుమార్పిడితో సమస్య
అమెరికా వ్యవసాయ శాఖ నివేదిక ప్రకారం, భారత్‌లో మొక్కజొన్న డిమాండ్‌ వేగంగా పెరుగుతోంది. 2022–23లో 34.7 మిలియన్‌ టన్నుల వినియోగం 2040 నాటికి 98 మిలియన్‌ టన్నులు, 2050 నాటికి 200.2 మిలియన్‌ టన్నులకు చేరుకుంటుందని అంచనా. ఈ డిమాండ్‌ను అమెరికా తన ఎగుమతులకు అవకాశంగా చూస్తోంది. అయితే, భారత్‌ అమెరికా నుంచి దిగుమతులను నిరాకరిస్తోంది. అమెరికా మొక్కజొన్నలో 94% జన్యుమార్పిడి రకాలు. ఈ కారణంగా భారత్‌ వ్యతిరేకిస్తోంది. భారత్‌లో మొక్కజొన్న ఉత్పత్తి ఖర్చు కిలోకు రూ.22–23, అమెరికా మొక్కజొన్న కిలో రూ.15కే లభిస్తుంది. అయినప్పటికీ, కర్ణాటక, మధ్యప్రదేశ్, బీహార్‌లోని రైతుల ఆర్థిక భద్రత, రాజకీయ సమీకరణలు (ముఖ్యంగా బీహార్‌లో రాబోయే ఎన్నికలు) దిగుమతులకు అడ్డుగా నిలుస్తున్నాయి. నీతి ఆయోగ్‌ సూచన ప్రకారం, జన్యుమార్పిడి మొక్కజొన్నను ఇథనాల్‌ ఉత్పత్తికి మాత్రమే ఉపయోగించాలని ప్రతిపాదించినప్పటికీ, దీని అమలు అనిశ్చితంగా ఉంది.

అమెరికా మొక్కజొన్న ఎగుమతులకు భారత్‌ ఒక ఆకర్షణీయ మార్కెట్‌గా కనిపిస్తున్నప్పటికీ, జన్యుమార్పిడి నిషేధం, అధిక సుంకాలు, స్థానిక రైతుల ప్రయోజనాలు, రాజకీయ సందర్భాలు దిగుమతులకు అడ్డంకులుగా నిలుస్తున్నాయి. ట్రంప్‌ విధానాలతో చైనా వంటి ప్రధాన మార్కెట్లను కోల్పోయిన అమెరికా, భారత్‌పై ఒత్తిడి పెంచే అవకాశం ఉంది. అయితే, భారత్‌ తన రైతుల ఆర్థిక భద్రత, స్వయం సమృద్ధిని పరిగణనలోకి తీసుకుని వాణిజ్య నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Most Popular

Karakatta Kamal Haasan : ఆ కరకట్ట కమల్ హాసన్ ఏం చేస్తున్నారో తెలుసా..

Karakatta Kamal Haasan : 2014లో ఏపీ రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నాడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజా వేదికను నిర్మించారు. ఆ నిర్మాణం అక్రమం అంటూ...

OG 2 Animation Video: ‘ఓజీ 2’ నుండి యానిమేషన్ వీడియో.. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కి ఊహించని...

OG 2 Animation Video: ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో మంచి హైప్ ని క్రియేట్ చేసుకున్న సీక్వెల్స్ లో ఒకటి 'ఓజీ 2'. పవన్ కళ్యాణ్ , సుజిత్ కాంబినేషన్...

Revanth Reddy And Kcr: వాసాలమర్రి.. కెసిఆర్ వీక్నెస్ తో ఆడుకుంటున్న రేవంత్..

Revanth Reddy And Kcr: భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు.. కెసిఆర్ ఉన్నట్టుండి యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు. ఆ జిల్లా పరిధిలో ఉన్న వాసాల మర్రి గ్రామంలో ఒకరోజు మొత్తం...

Siddharth Emotional: స్టేజి పై వెక్కిళ్లు పెట్టి ఏడ్చేసిన హీరో సిద్దార్థ్..వీడియో వైరల్..అసలు ఏమైందంటే!

Siddharth Emotional: ఒకప్పుడు యూత్ ఆడియన్స్ లో హీరో సిద్దార్థ్ కి ఎలాంటి క్రేజ్ ఉండేదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆరోజుల్లో బాయ్స్, నువ్వొస్తానంటే నేనొద్దంటానా , బొమ్మరిల్లు , కొంచెం ఇష్టం...

Google Employees Protest: ఉద్యోగుల నిరసన.. సుందర్ పిచాయ్ కి వినతి.. ఏఐ వల్ల గూగుల్ లో ఏం...

Google Employees Protest: గూగుల్.. ప్రముఖ సెర్చ్ ఇంజన్ సంస్థ మాత్రమే కాదు.. టెక్నాలజీ.. వినూత్న ఆవిష్కరణలు.. డేటా.. క్లౌడ్ కంప్యూటింగ్.. ఇలా ఎన్నో విభాగాలలో నెంబర్ వన్ సంస్థ. ఈ సంస్థ...
Oktelugu Epaper
Exit mobile version