Homeఅంతర్జాతీయంHuman Rights Violations: ప్రజాస్వామ్య ‘అగ్ర’ అమెరికా.. ఏంటీ మనవత్వం లేని పనులు?

Human Rights Violations: ప్రజాస్వామ్య ‘అగ్ర’ అమెరికా.. ఏంటీ మనవత్వం లేని పనులు?

Human Rights Violations: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ బాధ్యతలు చేపట్టాక.. ఆయన తీసుకున్న మొదటి చర్య అక్రమ వలసదారులను స్వదేశాలకు పంపించడమే. దాదాపు మూడు నెలలపాటు అక్కడి పోలీసులు దేశాన్ని జల్లెడపట్టి అక్రమ వలసదారులను గుర్తించి వారి దేశాలకు ప్రత్యేక విమానాల్లో తరలించారు. భారత్‌కు కూడా సుమారు 800 మంది వచ్చాయి. అయితే విమానాల్లో తరలింపు భారం కావడంతో ట్రంప్‌ సర్కార్‌.. తర్వాత అక్రమ వసలదారులను నిర్బంధ కేంద్రాల్లో ఉంచుతోంది. తాజాగా మయామీలో ఉన్న క్రోమ్‌ నిర్బంధ కేంద్రం ఇటీవల వార్తల్లో నిలిచింది, దాని లోపలి దయనీయ పరిస్థితులను వెల్లడిస్తూ ఒక వీడియో బయటకు రావడంతో. ఈ కేంద్రంలో అక్రమ వలసదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి. ఇరుకైన గదుల్లో, సరైన ఆహారం లేక, పరుపులకు బదులుగా కార్డ్‌బోర్డ్‌ బాక్సులు, నిరంతర ట్యూబ్‌లైట్‌ కాంతి కారణంగా మాస్కులతో ముఖాలను కప్పుకోవడం వంటి దుర్భర పరిస్థితులు ఇక్కడ నెలకొని ఉన్నాయి. ఈ కేంద్రంలో 600 మందికి మించి నిర్బంధితులను ఉంచుతున్నారని, ఇది దాని సామర్థ్యాన్ని మించిన సంఖ్య అని నివేదికలు సూచిస్తున్నాయి.

ఐసీఈ నిబంధనల ఉల్లంఘన..
అమెరికా ఇమ్మిగ్రేషన్‌ అండ్‌ కస్టమ్స్‌ ఎన్‌ఫోర్సమెంట్‌ (ఐసీఈ) నిర్బంధ కేంద్రాలు అక్రమ వలసదారులను తాత్కాలికంగా 12 గంటల కంటే ఎక్కువ ఉంచకూడదనే నిబంధనను నిరంతరంగా ఉల్లంఘిస్తున్నాయి. క్రోమ్‌ కేంద్రంలో అక్రమ వలసదారులను 3 నుంచి 4 రోజుల వరకు ఉంచుతున్నారని, ఈ విషయం ఐసీఈ అంతర్గత ఆడిట్‌లోనూ బయటపడింది. సరైన దుప్పట్లు, దిండ్లు, ఆహారం, మంచినీటి సౌకర్యం లేకపోవడంతోపాటు, గాలి తడమని ఏసీలు కూడా పని చేయడం లేదని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇటీవల ఒక వ్యక్తి 3 రోజులకు పైగా నిర్బంధంలో ఉండి మరణించిన ఘటన ఈ కేంద్రాల్లోని అమానవీయ వాతావరణాన్ని మరింత స్పష్టం చేసింది.

నిర్బంధ కేంద్రాల్లో కేక్కేసి..
ట్రంప్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ఐసీఈ నిర్బంధ కేంద్రాల సామర్థ్యం 81 శాతం నిండిపోయింది, ఇది గతంలో కేవలం 10 మంది లేదా అంతకంటే తక్కువ మంది ఉండేది. దేశవ్యాప్తంగా 267 నిర్బంధ కేంద్రాలలో దాదాపు 56 వేల మంది బంధీగా ఉన్నారు.ఇది 41,500 బెడ్ల సామర్థ్యాన్ని మించిపోయింది. ట్రంప్‌ ఇటీవల సంతకం చేసిన ఒక ఆర్థిక బిల్లు ద్వారా కొత్తగా 80 వేల బెడ్లను జోడించేందుకు నిధులు కేటాయించారు, ఇది మరింత ఎక్కువ మందిని నిర్బంధించేందుకు ఉద్దేశించిన విధానాన్ని సూచిస్తుంది.

Also Read: కల్లోల నేపాల్ లో.. లక్ష మందికి చూపు తెప్పించాడు.. ఇతడు వైద్యుడు కాదు దేవుడు..

మానవ హక్కుల ఉల్లంఘనలు..
ఈ నిర్బంధ కేంద్రాల్లోని పరిస్థితులు అంతర్జాతీయ మానవ హక్కుల నిబంధనలైన ఐక్యరాష్ట్రాల మానవ హక్కుల ఒడంబడిక (ఐసీసీపీఆర్‌), హింసకు వ్యతిరేక ఒడంబడిక (సీఏటీ)లను ఉల్లంఘిస్తున్నాయని మానవ హక్కుల సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. బంధీలకు వైద్య సదుపాయాలు, న్యాయ సహాయం, శుభ్రమైన నీరు, ఆహారం వంటి ప్రాథమిక సౌకర్యాలు అందడం లేదు. కొందరు భరించలేక స్వచ్ఛందంగా స్వదేశాలకు తిరిగి వెళ్లేందుకు అంగీకరిస్తున్నారని న్యాయవాదులు తెలిపారు. ఈ అమానవీయ వాతావరణం ట్రంప్‌ విధానాల యొక్క కఠినతను మరియు వలసదారుల హక్కుల పట్ల నిర్లక్ష్యాన్ని స్పష్టం చేస్తోంది.

ట్రంప్‌ పరిపాలన లక్ష్యంగా పెట్టుకున్న భారీ ఎత్తున స్వదేశ పంపిణీ (మిలియన్‌ల సంఖ్యలో) కోసం నిర్బంధ సామర్థ్యాన్ని రెట్టింపు చేయాలని యోచిస్తోంది. ఈ విస్తరణలో భాగంగా కొత్త టెంట్‌ సౌకర్యాలు, సైనిక స్థావరాలు, గ్వాంటనామో బే వంటి స్థలాలను నిర్బంధ కేంద్రాలుగా మార్చే ప్రణాళికలు ఉన్నాయి. ఈ ప్రణాళికలు అమలైతే, ఇప్పటికే ఉన్న అమానవీయ పరిస్థితులు మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అదనంగా, నిర్బంధ కేంద్రాల్లో పారదర్శకత లేకపోవడం, పర్యవేక్షణ వ్యవస్థలను తొలగించడం వంటివి వలసదారుల హక్కులను మరింత దిగజార్చే అవకాశం ఉంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular