Homeఅంతర్జాతీయంEarthquake in Japan : జపాన్‌లో మరో భూకంపం.. క్యూషులో 6.2 తీవ్రత, మెగా క్వేక్‌...

Earthquake in Japan : జపాన్‌లో మరో భూకంపం.. క్యూషులో 6.2 తీవ్రత, మెగా క్వేక్‌ భయం!

Earthquake in Japan  : జపాన్‌.. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశం. సాంకేతికతను అధిపుచ్చుకోవడంలో జపాన్‌ అగ్రస్థానంలో ఉంది. ప్రకృతి వైపరిత్యాలను ఎదుర్కొంటూనే.. వేగంగా అభివృద్ధి చెందుతోంది. తాజాగా జపాన్‌లోని క్యూషు ప్రాంతంలో బుధవారం(ఏప్రిల్‌ 2, 2025) భారీ భూకంపం(Earth Quake) సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై దీని తీవ్రత 6.2గా నమోదైంది. ఈ భూకంపం వల్ల ప్రాణనష్టం జరగకపోయినప్పటికీ, ఆస్తి నష్టం సంభవించినట్లు సమాచారం. ఈ ఏడాది జనవరిలో కూడా 6.9 తీవ్రతతో జపాన్‌లో భూకంపం వచ్చింది. గత ఏడాది ఆగస్టు(August)లో క్యూషు, షికోకు దీవులను 6.9, 7.1 తీవ్రతలతో రెండు భూకంపాలు కుదిపేశాయి, అలాగే 2024 జనవరి 1న 7.6 తీవ్రతతో సంభవించిన భూకంపంలో 300 మందికి పైగా మరణించారు.

Also Read : జపాన్‌కు భూకంప భయం.. ప్రమాదంలో 3 లక్షల ప్రాణాలు..!

భూకంపాల జోన్‌..
జపాన్‌ భూకంపాలకు అత్యంత ప్రమాదకర జోన్‌లో ఉంది, దీని సముద్ర తీరంలో భూకంపం సంభవించే అవకాశం 80% ఉందని నివేదికలు చెబుతున్నాయి. ఈ తాజా భూకంపం క్యూషు కేంద్రంగా సంభవించినప్పటికీ, దీని ప్రభావం విస్తృతంగా కనిపించలేదు. అయితే, జపాన్‌ ప్రభుత్వ సంస్థలు భవిష్యత్తులో ‘మెగా క్వేక్‌‘ అనే అతి శక్తివంతమైన భూకంపం రావచ్చని హెచ్చరిస్తున్నాయి. ఏఎఫ్‌పీ (Agence France&Presse) ప్రకారం, ఈ మెగా భూకంపం 8 లేదా అంతకంటే ఎక్కువ తీవ్రతతో సంభవించి, 3 లక్షల మంది మరణాలకు కారణమవుతుందని, సునామీతో నగరాలను ముంచెత్తుతుందని అంచనా వేశాయి.

భూకంపాలు సాధారణమే..
జపాన్‌లో భూకంపాలు సర్వసాధారణం, ఎందుకంటే ఇది పసిఫిక్‌ ‘రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌‘లో ఉంది, ఇక్కడ టెక్టానిక్‌ ప్లేట్ల ఘర్షణలు తరచూ జరుగుతాయి. ఈ తాజా భూకంపం సునామీ హెచ్చరికలను రేకెత్తించలేదు, కానీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. గత భూకంపాల అనుభవాలతో జపాన్‌ కఠిన నిర్మాణ నిబంధనలు, ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను అమలు చేస్తోంది, అయినప్పటికీ మెగా క్వేక్‌ భీతి కొనసాగుతోంది. ప్రస్తుత భూకంపం క్యూషులోని భవనాలకు నష్టం కలిగించినప్పటికీ, పెద్ద ఎత్తున విధ్వంసం జరగలేదు. జపాన్‌ వాతావరణ సంస్థ (JMA) ఈ ఘటనను నిశితంగా పరిశీలిస్తోంది. రాబోయే రోజుల్లో మరిన్ని భూకంపాలు రావచ్చని, సునామీ ప్రమాదం ఉండవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. జపాన్‌ ప్రజలు భద్రతా మార్గదర్శకాలు పాటించాలని, అత్యవసర పరిస్థితులకు సిద్ధంగా ఉండాలని అధికారులు కోరారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular