Donald Trump: అమెరికా అగ్రరాజ్యంగా ఎదగడంలో అనేక మంది నేతల కృషి ఉంది. ఒక్కో ఇటుక పేరుస్తూ ఇంటిని నిర్మించినట్లుగా దేశ ఆర్థిక రంగాన్ని ఒక్కో మెట్లు ఎక్కిస్తూ ప్రపంచంలో నంబర్ వన్గా నిలిపారు. అయితే ఇందుకోసం ఏ నేత కూడా ఇతర దేశాలను ఆక్రమించుకోవాలనుకోలోదే. మిత్ర దేశాలతో సంఖ్యతగా ఉండాలని భావించారు. ఫలితంగా దేశం వేగంగా అభివృద్ధి చెందింది. 1787లో ఫిలడెల్ఫియాలో అమెరికా రాజ్యాంగ సంతకం సమయంలో ఎలిజబెత్ పావెల్, బెంజమిన్ ఫ్రాంక్లిన్కు అడిగిన ప్రశ్న ప్రసిద్ధి చెందింది. ‘రాజ్యాంగం లేక గణతంత్రం?’ అని అడిగిన ఆమెకు, ’గణతంత్రం, మీరు దాన్ని కాపాడుకుంటే’ అని ఫ్రాంక్లిన్ స్పందించారు. జార్జ్ వాషింగ్టన్, థామస్ జెఫర్సన్ వంటి నాయకులు విదేశీ సంబంధాల్లో నిజాయితీ, శాంతి, వాణిజ్యాన్ని ప్రోత్సహించారు.
ఆధిపత్య మార్పు, చీకటి అధ్యాయాలు
అయితే నేతల ఆదర్శాలు క్రమంగా కనుమరుగవుతున్నాయి. తాజాగా గడిచిన దశాబ్ద కాలంలో పరిస్థితి మరింత దిగజారింది. సామ్రాజ్యవాద కాంక్ష పెరిగింది. దీంతో అమెరికా సిద్ధాంతం గణతంత్రం పోయి సామ్రాజ్యవాద రూపం స్వీకరించింది. గత శతాబ్దంలో అనేక దేశాల్లో రాజకీయ, సైనిక ఆపరేషన్లు జరిగాయి. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ కాలంలో ఈ పాట్రన్ తీవ్రతరమవుతోంది. అసత్యాలు, విస్తరణలు, యుద్ధాలు, ప్రత్యర్థి అణచివేతలు ఆయన లక్షణాలు. అంతర్జాతీయ చట్టాలు, ప్రజాస్వామ్య సూత్రాలను ఉల్లంఘిస్తూ, సార్వభౌమత్వాన్ని అవహేళించడం గమనార్హం.
ప్రపంచ యుద్ధాల ముందస్తు సంకేతాలు
ప్రపంచయుద్ధాలు అహంకారం, అతిజాతీయత, కట్టుబాట్ల ఉల్లంఘనలతో మొదలయ్యాయి. రెండు ప్రపంచ యుద్ధాల్లో 10 కోట్ల మంది ప్రాణాలు కోల్పోయారు. ట్రంప్ దురాగ్రహాలు ఇలాంటి ప్రమాదాలకు దారితీస్తాయని ఆందోళన. గ్రీన్లాండ్లోని 4.4 లక్షల కోట్ల డాలర్ల ఖనిజాల కోసం ఆక్రమణాస్త్రత్వం యూరప్ను కలవరపరుస్తోంది. సుంకాలు, బెదిరింపులతో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి.
ట్రంప్ పాలనలో 30,573 అబద్ధాలు నమోదయ్యాయి. డ్రోన్, వైమానిక దాడులు 622కి చేరాయి. మాంద్యాలు, వలసల ఏర్పాట్లు మానవహక్కులను హరిస్తున్నాయి. అమెరికన్ సమాజం దీన్ని తిప్పికొట్టాలి. అంతర్జాతీయంగా ఐక్యంగా నిలబడి, ఆయన పొరుగుదలకు బ్రేక్లు వేయాలి. ప్రపంచ శాంతి కాపాడాలి.