spot_img
Homeఅంతర్జాతీయంBangladesh  : బంగ్లాదేశ్‌ రాజకీయ మళ్లీ రాజకీయ సంక్షోభం.. తాత్కాలిక అధ్యక్షుడి రాజీనామా.. !?

Bangladesh  : బంగ్లాదేశ్‌ రాజకీయ మళ్లీ రాజకీయ సంక్షోభం.. తాత్కాలిక అధ్యక్షుడి రాజీనామా.. !?

Bangladesh  : బంగ్లాదేశ్‌ రాజకీయాలు మరోసారి సంక్షోభంలోకి జారుకున్నాయి. తాత్కాలిక ప్రభుత్వాధినేత, నోబెల్‌ గ్రహీత మహమ్మద్‌ యూనస్‌ తన పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. గత ఏడాది ఆగస్టులో షేక్‌ హసీనా ప్రభుత్వం కూలిపోవడంతో ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వం, ఎన్నికల నిర్వహణ, సంస్కరణల హామీలతో యూనస్‌ నేతృత్వంలో పనిచేస్తోంది. అయితే, రాజకీయ పార్టీల మధ్య సమన్వయం కొరవడటం, సైనిక నాయకత్వంతో విభేదాలు, వివాదాస్పద నిర్ణయాలు యూనస్‌ను రాజీనామా వైపు నెట్టివేస్తున్నాయి. ఈ పరిణామాలు బంగ్లాదేశ్‌ రాజకీయ, ఆర్థిక స్థిరత్వంపై దీర్ఘకాలిక ప్రభావం చూపనున్నాయి.

మహమ్మద్‌ యూనస్, గ్రామీణ బ్యాంక్‌ స్థాపకుడు. సామాజిక సంస్కర్తగా ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందిన వ్యక్తి. 2024 ఆగస్టులో షేక్‌ హసీనా ప్రభుత్వం కూలిన తర్వాత తాత్కాలిక ప్రభుత్వాధినేతగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన నాయకత్వంలో ఎన్నికల నిర్వహణ, రాజకీయ సంస్కరణలు చేపట్టాలని హామీ ఇచ్చారు. అయితే, రాజకీయ పార్టీల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడం, సైన్యంతో విభేదాలు, యూనస్‌ తీసుకున్న కొన్ని వివాదాస్పద నిర్ణయాలు ఆయనను ఒత్తిడిలోకి నెట్టాయి. నేషనల్‌ సిటిజన్‌ పార్టీ నాయకుడు నహిద్‌ ఇస్లామ్, యూనస్‌ రాజీనామా గురించి చర్చలు జరుగుతున్నట్లు ధ్రువీకరించారు, అయితే దేశ భద్రత, భవిష్యత్తు కోసం రాజకీయ పార్టీలు ఐక్యతతో యూనస్‌కు సహకరించాలని కోరారు.

Also Read : హార్వర్డ్‌ యూనివర్సిటీని పగబట్టిన ట్రంప్‌.. మరో కఠిన నిర్ణయం.. భారతీయ విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరం!

సైనిక–పౌర ఘర్షణలు
యూనస్‌ ప్రభుత్వం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు సైనిక నాయకత్వంతో ఉన్న విభేదాలు. ఆర్మీ చీఫ్‌ జనరల్‌ వకారుజ్జమాన్‌తో యూనస్‌ సంబంధాలు గత కొన్ని నెలలుగా దిగజారాయి. షేక్‌ హసీనా ప్రభుత్వం కూలిన తర్వాత మొదట్లో యూనస్‌కు మద్దతు పలికిన వకారుజ్జమాన్, ఎన్నికలలో జాప్యం, శిక్షపడిన ఇస్లామిస్ట్‌ నాయకుల విడుదల, బంగ్లాదేశ్‌ రైఫిల్స్‌ (BDR) తిరుగుబాటుదారులకు క్షమాభిక్ష వంటి చర్యలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. యూనస్‌ సైనిక సలహాదారు లెఫ్టినెంట్‌ జనరల్‌ కమ్రుల్‌ హసన్, అమెరికా రాయబారితో సమావేశమై తదుపరి ఆర్మీ చీఫ్‌ పదవికి మద్దతు కోరిన ఆరోపణలు వివాదాన్ని మరింత తీవ్రతరం చేశాయి. వకారుజ్జమాన్‌ హసన్‌ను తొలగించే ప్రయత్నం చేయగా, యూనస్‌ ఈ ఆదేశాలను అడ్డుకోవడం ఘర్షణలకు దారితీసింది.

‘బ్లడీ కారిడార్‌’ వివాదం
మయన్మార్‌ సరిహద్దుల్లో ‘మానవతా కారిడార్‌’ ఏర్పాటు ప్రతిపాదన బంగ్లాదేశ్‌లో తీవ్ర వివాదాన్ని రేకెత్తించింది. ఈ ప్రతిపాదనను ఆర్మీ చీఫ్‌ వకారుజ్జమాన్‌ ‘బ్లడీ కారిడార్‌’గా వ్యవహరించి, దీనిని దేశ సార్వభౌమత్వానికి భంగకరంగా, అమెరికా భౌగోళిక రాజకీయ ఆసక్తులకు అనుగుణంగా ఉందని విమర్శించారు. ఈ విషయంలో యూనస్‌ ప్రభుత్వం వెనక్కి తగ్గినప్పటికీ, సైన్యంతో సంబంధాలు మరింత దెబ్బతిన్నాయి. ఈ కారిడార్‌ రోహింగ్యా శరణార్థుల సమస్యను పరిష్కరించేందుకు ఉద్దేశించినప్పటికీ, దేశంలో అమెరికా ప్రభావం పెరగడంపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి. వకారుజ్జమాన్‌ ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తూ, దేశ ప్రయోజనాలకు ప్రాధాన్యమివ్వాలని, రాజకీయ ఏకాభిప్రాయం లేకుండా ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం సమంజసం కాదని స్పష్టం చేశారు.

ఎన్నికల జాప్యం, రాజకీయ అస్థిరత
యూనస్‌ ప్రభుత్వం ఎన్నికల నిర్వహణలో జాప్యం చేయడం రాజకీయ అస్థిరతకు ఒక ప్రధాన కారణంగా చెప్పవచ్చు. షేక్‌ హసీనా ప్రభుత్వం కూలిన తర్వాత, దేశంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం త్వరితగతిన ఎన్నికలు నిర్వహిస్తానని యూనస్‌ హామీ ఇచ్చారు. అయితే, రాజకీయ సంస్కరణలు, ఎన్నికల సంఘంలో మార్పులు చేయడంలో ఆలస్యం, ఇస్లామిస్ట్‌ నాయకుల విడుదల వంటి చర్యలు రాజకీయ పార్టీలలో అసంతృప్తిని పెంచాయి. బంగ్లాదేశ్‌ నేషనలిస్ట్‌ పార్టీ (BNP), జమాత్‌–ఎ–ఇస్లామీ వంటి ప్రతిపక్ష పార్టీలు యూనస్‌ నిర్ణయాలను తప్పుబడుతున్నాయి. ఈ అసమ్మతి యూనస్‌పై ఒత్తిడిని పెంచి, రాజీనామా ఆలోచనకు దారితీసింది.

అమెరికా ప్రభావం ఆరోపణలు..
యూనస్‌ ప్రభుత్వంపై అమెరికా భౌగోళిక రాజకీయ ప్రభావం ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. రఖైన్‌ కారిడార్‌ ప్రతిపాదన, అమెరికా రాయబారితో యూనస్‌ సలహాదారు సమావేశాలు ఈ ఆరోపణలకు బలం చేకూర్చాయి. బంగ్లాదేశ్‌ సైన్యం, ఈ చర్యలను అమెరికా ఆసక్తులకు అనుగుణంగా ఉన్నాయని, దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగిస్తాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో, యూనస్‌ ప్రభుత్వం అధికారంలో కొనసాగడానికి అమెరికా మద్దతు కోరుతోందన్న విమర్శలు బలపడ్డాయి. ఇది దేశంలో రాజకీయ ఐక్యతను మరింత దెబ్బతీసే ప్రమాదం ఉంది.

భవిష్యత్తు, సవాళ్లు
యూనస్‌ రాజీనామా చేస్తే, బంగ్లాదేశ్‌ రాజకీయాలు మరింత సంక్షోభంలోకి జారే అవకాశం ఉంది. సైన్యం, ప్రజాస్వామ్య శక్తుల మధ్య సమతుల్యత కీలకం. ఎన్నికల నిర్వహణలో జాప్యం, సైనిక జోక్యం, విదేశీ ఒత్తిళ్లు దేశ ఆర్థిక, సామాజిక స్థిరత్వాన్ని దెబ్బతీస్తాయని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. బంగ్లాదేశ్‌ సైన్యం దేశంలో ఏకైక విశ్వసనీయ సంస్థగా ఉన్నప్పటికీ, రాజకీయ జోక్యం లేకుండా ప్రజాస్వామ్య పునరుద్ధరణకు కషి చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. యూనస్‌ రాజీనామా తర్వాత కొత్త తాత్కాలిక నాయకత్వం ఎన్నికలను వేగవంతం చేయడం, రాజకీయ ఐక్యతను పెంపొందించడం కీలక సవాళ్లుగా మారనున్నాయి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Most Popular

Japan And US: జర్మనీ అణు రహస్యం జపాన్‌కు చేరకుండా అడ్డుకున్న అమెరికా.. లేదంటే ప్రపంచ పటమే మారిపోయేది!

Japan And US: ప్రపంచంలో ప్రస్తుతం అణ్వస్త్రాలు కలిగిన దేశాల్లో అమెరికా అగ్రస్థానంలో ఉంది. తర్వాత రష్యా, చైనా, భారత్‌ కూడా ఉన్నాయి. ఇక ఏ దేశం కూడా అణ్వాయుధాలు కలిగి ఉండకుండా...

Jana Nayagan Collection: ‘జన నాయగన్ ‘ 2 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ఇంత తక్కువ గ్రాస్...

Jana Nayagan Collection: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్ ' ఎన్నో అడ్డంకులను ఎదురుకొని రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలై ,...

Kajal Aggarwal: అతను ఎవ్వరూ లేని సమయం చూసి నా రూమ్ లోకి ప్రవేశించాడు అంటూ కాజల్ అగర్వాల్...

Kajal Aggarwal: సినీ ఇండస్ట్రీ లోకి రావాలని, సక్సెస్ అవ్వాలని ఎంతో మందికి ఉంటుంది. ముఖ్యంగా అమ్మాయిలు ఇండస్ట్రీ లోకి రావడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే అమ్మాయిల తల్లిదండ్రులు...

Nara Rohith: ‘ఆదర్శ కుటుంబం’ నుండి నారా రోహిత్ లుక్ విడుదల.. ఈ రేంజ్ లో ఉన్నాడేంటి..

Nara Rohith: 'సంక్రాంతికి వస్తున్నాం' వంటి భారీ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత , విక్టరీ వెంకటేష్ చేస్తున్న చిత్రం 'ఆదర్శ కుటుంబం'. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ సినిమా...

Dhruv Vikram: కోటి రూపాయిలు తీసుకొని మోసం చేసిన ధృవ్ విక్రమ్.. ఫిర్యాదు నమోదు.. పూర్తి వివరాలు మీకోసం..

Dhruv Vikram: గత కొద్దిరోజుల నుండి తమిళ స్టార్ హీరో విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ పేరు సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో మారుమోగిపోతుంది. గత కొంతకాలం నుండి...
Oktelugu Epaper
Exit mobile version