America Abraham Accords Pakistan: అమెరికాను నమ్మి బాగుపడినట్టు ఈ ప్రపంచ చరిత్రలో ఏ దేశానికీ లేదు. అమెరికా అనేది అవసరాల ఆధారంగా నడుచుకునే దేశం. తనకు ప్రయోజనాలు ఉన్నాయనుకుంటే ఎక్కడి దాకైనా వెళ్తుంది. ఏమైనా చేస్తుంది. ఇతర దేశాల పరిపాలనలో కూడా వేలు పెడుతుంది. అవసరమైతే ఆ దేశాల అధ్యక్షులను అపహరిస్తుంది. తన ప్రయోజనాల వరకే ఇతర దేశాలతో అమెరికా ప్రయాణం సాగిస్తుంది. ఆ తర్వాత దూరం పెడుతుంది. అవసరమైతే ఇంకా ఎంతకైనా తెగిస్తుంది.
పాకిస్థాన్ తో కొంతకాలంగా అమెరికా చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతోంది. ఆ మధ్య పాకిస్థాన్ సైనికాధ్యక్షుడు అసిమ్ మునీర్ అమెరికా వెళ్లాడు. ట్రంప్ ను కలిశాడు. కొన్ని రంగుల బాక్సులు ఇచ్చాడు. వాటిని చూసిన ట్రంప్ ఆనందంతో ఎగిరి గంతులు వేశాడు. పాకిస్థాన్ లో వెంటనే మైనింగ్ మొదలు పెడుతున్నానని సంకేతాలు ఇచ్చాడు. ఇంతవరకు అక్కడ మైనింగ్ మొదలు కాలేదు. అమెరికా అక్కడ అడుగు పెట్టింది కాబట్టి.. ఇతర దేశాలు అటువైపు చూడలేవు. పైగా అమెరికా తనకు అవసరం వచ్చినప్పుడు మాత్రమే అక్కడ మైనింగ్ షురూ చేస్తుంది.
తమతో బాగానే ఉంటోందని పాకిస్థాన్ జబ్బలు చరుచుకుంటున్నది. కానీ అసలు విషయం పాకిస్థాన్ కు ఇప్పుడు అర్థమైంది. అదును చూసి పాకిస్థాన్ ను అమెరికా గట్టి దెబ్బకొట్టింది. అబ్రహం అకార్డ్స్ ను తెరపైకి తీసుకొచ్చి పాకిస్థాన్ కు షాక్ ఇచ్చింది. అబ్రహం అకార్డ్స్ అంటే.. పచ్చిమాసియా దేశాలతో కలిసి పని చేయడం.. ఇందులో ఇజ్రాయిల్ కూడా ఉంటుంది.. ఇజ్రాయిల్ ఉండడం ముస్లిం దేశాలకు ఏమాత్రం నచ్చదు. కానీ ఇప్పుడు అమెరికా ఒత్తిడి తీసుకొస్తుంది కాబట్టి తప్పదు. అబ్రహం అకార్డ్స్ ను 2020లో తెరపైకి తీసుకొచ్చారు. పశ్చిమాసియా ప్రాంతంలో పరిస్థితులను మెరుగు పరిచేందుకు.. రాజకీయంగా, దౌత్యపరంగా పరిస్థితులను చక్క దిద్దడానికి అబ్రహం అకార్డ్స్ ను రూపొందించారు. అమెరికా ఇందులో మధ్యవర్తిత్వపాత్ర పోషించింది. ఇజ్రాయిల్ తో సంబంధాలు పెంపొందించుకోవాలని అమెరికా పదేపదే ప్రస్తావించింది. ఇది ముస్లిం దేశాలకు ఏమాత్రం నచ్చడం లేదు.
నాడు అమెరికా మధ్యవర్తిత్వంలో రూపొందించిన ఒప్పందాలపై మొరాకో, సుడాన్, బహ్రేయిన్, యూఏఈ వంటి దేశాలుసంతకాలు చేశాయి. అబ్రహం అకార్డ్స్ ను ఏకంగా అరబ్ దేశాలకు విస్తరించాలని ట్రంప్ భావిస్తున్నారు. ఇజ్రాయిల్ పాలస్తీనా పై విపరీతంగా దాడులు చేయడం.. గాజా నగరాన్ని నరకంగా మార్చడంతో అబ్రహం అకార్డ్స్ ను మిగతా ముస్లిం దేశాలు ఎలా స్వీకరిస్తాయో తెలియడం లేదు. ఇజ్రాయిల్ వ్యవహార శైలి నేపథ్యంలో తాము దౌత్య పరమైన సంబంధాలు కొనసాగించలేమని సౌదీ అరేబియా అనేక సార్లు వివరించింది.
అబ్రహం అకార్డ్స్ ను 2020లో నాటి పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఒప్పుకోలేదు. ఆ తర్వాత షహబాజ్ షరీఫ్ కూడా అబ్రహం అకార్డ్స్ కు సమ్మతి వ్యక్తం చేయలేదు. ఇజ్రాయిల్ ను తాము గుర్తించబోమని ఆయన పదే పదే స్పష్టం చేశారు. ఇటీవల ఇరాన్ , అమెరికా మధ్య శాంతి ఒప్పందం కుదర్చడానికి పాకిస్థాన్ ప్రయత్నాలు చేసింది. సరిగ్గా ఇప్పుడు దీనిని ట్రంప్ పాకిస్థాన్ ముందు పెడుతున్నారు.ఒకవేళ పాకిస్థాన్ కనుక సంతకాలు పెడితే అంతే సంగతులు. ఇది ఆర్థికంగా.. భద్రతపరంగా.. రాజకీయపరంగా పాకిస్తాన్ దేశానికి అనేక రకాల చిక్కులు తెచ్చిపెడుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. అమెరికా ఒత్తిడి నేపథ్యంలో పాకిస్తాన్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది.
