Mahesh Rajamouli Movie: టాలీవుడ్ సినిమాలను ప్రపంచ స్థాయికి చేర్చిన ఘనత రాజమౌళిదే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. తెలుగు సినిమాలకు దేశవ్యాప్తంగా గుర్తింపు తీసుకురావడంలో ఆయన పడ్డ కష్టం అంతా ఇంతా కాదు. ఆయన ఏ సినిమా చేసినా అంతకుమించి అన్నట్లుగానే ఉంటుంది. స్వతహాగా ఆయన రైటర్ కాకపోయినా.. కథలో ఎలాంటి మార్పులు చేయాలి, పాత్రలు ఎలా ఉండాలి, ఒక కథను ప్రేక్షకులకు కనెక్ట్ చేయడంలో ఎలాంటి ఎమోషన్స్ ఉండాలో రాజమౌళికి బాగా తెలుసు.
Vijayendra Prasad
ఆయన తీసే ప్రతి సినిమాకు తన తండ్రి, స్టార్ రైటర్ అయిన విజయేంద్రప్రసాద్ తో దగ్గరుండి కథలు రాయించుకుంటారు. ఇప్పటివరకు ఆయన తీసిన ప్రతి సినిమాకు విజయేంద్రప్రసాద్ కథలు అందించారు. ఆ కథలు ఎలా ఉంటాయో చెప్పడం కూడా ఎవరి ఊహకు అందదు. ప్రస్తుతం త్రిబుల్ ఆర్ మేనియా ప్రపంచాన్ని కమ్మేస్తోంది. ఈరోజు థియేటర్లలో విడుదలైన ఈ మూవీ పాజిటివ్ టాక్ తో సంచలన విజయం దిశగా దూసుకుపోతోంది.
Also Read: Upasana- RRR Movie: థియేటర్ లో రచ్చ చేసిన ఉపాసన.. ఫ్యాన్స్పై పేపర్లు చల్లుతూ హంగామా..
Mahesh Rajamouli Movie
అయితే ఈ మూవీ తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబు తో రాజమౌళి సినిమా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీ గురించి అనేక రూమర్లు హల్ చల్ చేస్తున్నాయి. కథ ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని వార్తలు వస్తున్నాయి. కాగా త్రిబుల్ ఆర్ ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో విజయేంద్రప్రసాద్ ఈ మూవీ కథ గురించి ఓపెన్ అయ్యారు. ఈ మూవీ కథను ఆఫ్రికా బ్యాక్ డ్రాప్ లో ఉండాలని రాజమౌళి కోరుకుంటున్నట్టు తెలిపారు. ఇప్పటికే ఈ లైన్ ను తాను, రాజమౌళి అనుకున్నట్లు వివరించారు. జంతువుల చుట్టూ సాగే ఒక కథనాన్ని చేయాలని రాజమౌళి భావిస్తున్నారట. అయితే కథను ఇంకా డెవలప్ చేయలేదని, త్రిబుల్ ఆర్ సందడి పూర్తయిన తర్వాత.. కథ గురించి రాజమౌళితో చర్చించి డెవలప్ చేస్తామంటూ తెలిపారు. ఆయన చెప్పినదాన్ని బట్టి చూస్తుంటే ఇదే కథ ఫైనల్ అయ్యేలా ఉంది. మరి ఇందులో మహేష్ బాబు పాత్ర ఎలా ఉంటుందో వేచి చూడాలి.
Also Read:Vijayendra Prasad: ఆ కథను ఇవ్వలేదని రాజమౌళి ఏడ్చాడు.. విజయేంద్రప్రసాద్ సంచలన వ్యాఖ్యలు..