Homeట్రెండింగ్ న్యూస్Jagdeep Singh: ప్రపంచంలో అత్యధిక వేతనం తీసుకుంటున్న భారతీయుడు.. అతను ఎవరు.. జీతం ఎంతో తెలుసా?

Jagdeep Singh: ప్రపంచంలో అత్యధిక వేతనం తీసుకుంటున్న భారతీయుడు.. అతను ఎవరు.. జీతం ఎంతో తెలుసా?

Jagdeep Singh: ప్రపంచంలో ఐటీ విప్లవం ఉద్యోగుల జీతాల్లో పెను మార్పులు తెచ్చింది. ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు అధికమన్న భ్రమలు తొలగిపోయాయి. గ్లోబలైజేషన్‌ మార్కెట్‌ వేల జీతాలను లక్షల స్థాయికి తీసుకెళ్లింది. కొన్నిసాంకేతిక సంస్థల సీఈవోలు వేతనాలు కోట్లల్లో కూడా ఉంటున్నాయి. క్వాంటం స్కేప్‌ అనే సంస్థ సీఈవోగా బాధ్యతలు నిర్వర్తించిన ఇండియాకు చెందిన జగదీప్‌ సింగ్‌ మాత్రం ప్రపంచంలోనే అత్యధిక వేతనం తీసుకుంటున్నట్లుగా అన్‌స్టాప్‌ నివేదిక తెలిపింది. దీనిపై సోషల్‌ మీడియా కథనం సంచలనంగా మారింది. జగదీప్‌ సింగ్‌ ఏకంగా ఏడాదికి రూ.17,500 కోట్లు జీతం తీసుకుంటున్నాడట. అంటే రోజుకు అతని వేతనం రూ.48 కోట్లు. గూగుల్, మైక్రోసాఫ్ట్, స్పేస్‌ ఎక్స్‌ సంస్థల సీఈవోలు కూడా పొందలేనంతగా వేతనం పొందుతున్నారు. అంటే ఓ భారతీయుడే ప్రపంచంలో అత్యధిక వేతనం పొందుతుండడం మనకు గర్వకారణం.

ఎవరీ జగదీప్‌ సింగ్‌..
జగదీప్‌సింగ్‌ క్వాంటమ్‌స్కేప్‌ వ్యవస్థాపకుడు, ఇది ఎలక్ట్రిక్‌ వాహనాల కోసం సాలిడ్‌–స్టేట్‌ రీఛార్జబుల్‌ లిథియం మెటల్‌ బ్యాటరీలలో ప్రత్యేకత కలిగి ఉంది. కాలిఫోర్నియాలోని శాన్‌ జోస్‌లో ప్రధాన కార్యాలయం ఉన్న కంపెనీ ఈవీల కోసం బ్యాటరీ సాంకేతికతను విప్లవాత్మకంగా మార్చింది. 2020లో కేవలం ఐదేళ్ల క్రితం స్థాపించబడినప్పటికీ, ఇప్పటికే దాదాపు 50 బిలియన్‌ డాలర్ల విలువను సాధించింది. సింగ్‌ స్టాన్‌ఫోర్డ్‌ విశ్వవిద్యాలయం నుంచి బీటెక్, కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం నుండి ఎంబీఏ పట్టా పొందారు. తదుపరి తరం సాంకేతికతను ఉపయోగించుకుని, క్వాంటమ్‌ స్కేప్‌ వోక్స్‌వ్యాగన్‌ ఏజీ, బిల్‌ గేట్స్‌ వంటి పెద్ద పేర్ల నుంచి∙పెట్టుబడులను ఆకర్షించింది. ఎలక్ట్రిక్‌ వాహనాల స్వీకరణను వేగవంతం చేస్తూ, సాంప్రదాయ లిథియం–అయాన్‌ బ్యాటరీలకు సురక్షితమైన, తక్కువ ఖర్చుతో కూడిన ప్రత్యామ్నాయాన్ని వాహన తయారీదారులకు అందించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.

ఇంత ఎక్కువ జీతం ఎలా పొందాడు?
క్వాంటమ్‌ స్కేప్‌ వార్షిక వాటాదారుల సమావేశంలో, సీఈవో కోసం బహుళ–బిలియన్‌ డాలర్ల పరిహారం ప్యాకేజీ ఆమోదించబడింది. కంపెనీ నిర్దేశించిన నిర్దిష్టమైన, అత్యంత ప్రతిష్టాత్మకమైన మైలురాళ్లను సాధించడానికి జీతం ప్యాకేజీ ముడిపడి ఉంది. గ్లాస్‌ లూయిస్‌ అనే ప్రాక్సీ అడ్వైజరీ సంస్థ ఈ ప్యాకేజీని అసాధారణమైనదిగా అభివర్ణించింది. షేర్‌హోల్డర్‌లు ఈ భారీ జీతానికి అంగీకరించారు, ఎందుకంటే ఇది సాధించడం సవాలుగా భావించే ఫలితాలతో ముడిపడి ఉంది, సింగ్‌ రెమ్యునరేషన్‌ పనితీరు ఆధారితంగా ఉండేలా చూసుకున్నారు.

క్వాంటమ్‌స్కేప్‌ను ఏది ప్రత్యేకంగా చేస్తుంది?
సాలిడ్‌–స్టేట్‌ బ్యాటరీ టెక్నాలజీలో క్వాంటమ్‌స్కేప్‌ యొక్క పురోగతి దానిని ఉV పరిశ్రమలో కీలక ప్లేయర్‌గా నిలిపింది. సాలిడ్‌–స్టేట్‌ బ్యాటరీలు సాంప్రదాయ లిథియం–అయాన్‌ బ్యాటరీల కంటే సురక్షితమైనవి, సమర్థవంతమైనవి మరియు తక్కువ ఖర్చుతో కూడుకున్నవి, ఇవి ఎలక్ట్రిక్‌ వాహనాల భవిష్యత్తుకు కీలకమైనవి. ఆవిష్కరణలు, గ్లోబల్‌ దిగ్గజాలతో భాగస్వామ్యాలపై దృష్టి సారించి, సింగ్‌ క్వాంటమ్‌స్కేప్‌ను ఉV బ్యాటరీ పరిశ్రమలో ముందంజలో ఉంచారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular