Karnataka: వైరల్ వీడియో: వామ్మో ఈమెను కోడలంటారా.. కాసేపు అలా ఉంటే చంపేసేదే..

కర్ణాటక రాష్ట్రం మంగళూరులో ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించిన దృశ్యాలు సిసి కెమెరాలో రికార్డయ్యాయి. మంగళూరు ప్రాంతానికి చెందిన ఉమాశంకరి అనే మహిళ స్థానికంగా ఉన్న ఎలక్ట్రిసిటీ బోర్డులో పని చేస్తోంది.

Written By: Suresh, Updated On : March 12, 2024 3:14 pm

Karnataka

Follow us on

Karnataka: అతడి వయసు 87 సంవత్సరాలు ఉంటుంది. పైగా బీపీ, షుగర్ కూడా. అలాంటి వ్యక్తి తను వేసుకున్న చొక్కాను ఇంట్లో సోఫా మీద వేశాడు. అదే అతడు చేసిన తప్పయింది. అలా చొక్కా వేయడం ఆయన కోడలికి నచ్చలేదు. అంతే అగ్గి మీద గుగ్గిలమైంది. పట్టరాని ఆగ్రహంతో ఊగిపోయింది. చేతితో వాకింగ్ స్టిక్ తీసుకొని మామ పై దాడి
చేసింది. భర్త తండ్రి అనే గౌరవం కూడా లేకుండా బూతులు తిట్టింది. ఆ చేతి కర్రతో ఇష్టానుసారంగా కొట్టింది. ఆ దెబ్బలకు ఆ వృద్ధుడు ఆర్తనాదాలు పెడుతున్నప్పటికీ ఆమె మనసు కరగలేదు. పైగా ఆ కర్రతో గట్టిగా నెట్టింది. దీంతో అతడు ఆ సోఫా మీద పడ్డాడు. తలకు తీవ్రంగా గాయమైంది. రక్తస్రావం జరుగుతున్నప్పటికీ ఆ కోడలి మనసు కరగలేదు.

కర్ణాటక రాష్ట్రం మంగళూరులో ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించిన దృశ్యాలు సిసి కెమెరాలో రికార్డయ్యాయి. మంగళూరు ప్రాంతానికి చెందిన ఉమాశంకరి అనే మహిళ స్థానికంగా ఉన్న ఎలక్ట్రిసిటీ బోర్డులో పని చేస్తోంది. తన భర్త, అత్తా మామలతో కలిసి ఉంటున్నది. ఆమె భర్త విదేశాల్లో ఉంటున్నాడు. మార్చి 9న తన మామ పద్మనాభ సువర్ణ (87) సోఫాపై విడిచిన చొక్కా వేశాడు. అలా చేసినందుకు అతడిని కోప్పడింది. అంతటితో ఆగకుండా అతనిపై వాకింగ్ స్టిక్ తో దారుణంగా కొట్టింది. చెప్పరాని బూతులు తిట్టింది. బలంగా నెట్టివేయడంతో అతడి తల సోఫాకు తగిలింది. తీవ్రంగా గాయం కావడంతో రక్తస్రావం అయింది. అయినప్పటికీ ఉమాశంకరి తిడుతూనే ఉంది.

పద్మనాభ సువర్ణ తర్వాత లేచి ఈ విషయాన్ని చుట్టుపక్కల వారికి చెప్పడంతో.. వారు ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని పోలీసులు విదేశాల్లో ఉన్న ఉమాశంకరి భర్తకు చెప్పారు. సీసీ కెమెరాలు రికార్డ్ అయిన దృశ్యాల ఆధారంగా పోలీసులు ఉమాశంకరిని అదుపులోకి తీసుకున్నారు. కేసుకు సంబంధించి విచారణ కొనసాగిస్తున్నారు. కాగా ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. మానవ సంబంధాలు ఎలా మంట కలిసి పోతున్నాయో నిరూపించాయి.