Homeట్రెండింగ్ న్యూస్MP Dhiraj Sahu:176 డబ్బుల సంచులు.. రూ.351 కోట్లు.. 50 మంది బ్యాంకు అధికారులు.. నోట్ల...

MP Dhiraj Sahu:176 డబ్బుల సంచులు.. రూ.351 కోట్లు.. 50 మంది బ్యాంకు అధికారులు.. నోట్ల కట్టలు ఇంకా అయిపోలే!!

MP Dhiraj Sahu: కాంగ్రెస్‌ రాజ్యసభ సభ్యుడు ధీరజ్‌ సాహు అక్రమ సంపాదనపై ఇంకా లెక్కింపు కొనసాగుతోంది. దోచేందుకు కాదేదీ అనర్హం అన్నట్టు మంది సొమ్ము అప్పనంగా దోచేశాడు. దాచేందుకు కాదేదీ అనర్హం అంటూ ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ డబ్బు దాచాడు. ఆ డబ్బును లెక్కించడానికి మెషీన్లు కూడా మొరాయిస్తున్నాయట. ఇంట్లో ఏ మూలన వెతికినా డబ్బుల సంచులు బయటపడుతూనే ఉన్నాయి.

176 సంచులు..
‘అతడు’ సినిమాలో కోట శ్రీనివాస్‌రావు డైలాగ్‌ ‘లెక్కెట్టేందుకే వారం పట్టుద్ది’ అన్నట్లు ఎంపీ ధీరజ్‌ సాహు ఇంట్లో దొరికిన డబ్బులు లెక్కెట్టడానికి నెల రోజులు పట్టేలా ఉంది. దాదాపు 176 సంచుల్లో దాచి ఉంచిన సొమ్ములో అధికారులు ఇప్పటివరకు 140 సంచులు లెక్కించారు. దాదాపు 40 మెషీన్లతో డబ్బును లెక్కిస్తున్నారు. మూడు రోజురలుగా లెక్కించిన మొత్తం రూ.351 కోట్లని తేల్చారు. పలు బ్యాంకులకు చెందిన 50 మంది అధికారులు ఈ లెక్కింపులో పాల్గొంటున్నారు. మిగిలిన సంచులు లెక్కిస్తే కానీ పూర్తి సంపాదన రాదని అధికారులు చెప్తున్నారు.

సిబ్బంది చాలడం లేదని..
డబ్బు లెక్కించడానికి సిబ్బంది సరిపోవడంలేదని మరికొంత మంది సిబ్బంది కావాలని ఐటీ అధికారులను కోరుతున్నారు. మెషీన్లు కూడా మొరాయిస్తుండడంతో వాటి స్థానంలో కొత్తవి తెప్పిస్తున్నారు. కాగా, ఈ ఉదంతంపై శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది సెటైర్లు విసిరారు. ధీరజ్‌ సాహు బీజేపీలో చేరితే క్లీన్‌చిట్‌ దొరుకుతుందని చెప్పారు. అజిత్‌పవార్‌ ఎన్సీపీని చిల్చిన తర్వాత ఆయన ఇంట్లో ఈడీ, ఐటీ చర్యలు ఆగిపోయాయని.. ఎంతో మంది అవినీతి పరులు బీజేపీలో చేరి పాప పునీతులయ్యారని.. ధీరజ్‌ సాహు కూడా ఆ దిశగా ప్రయత్నాలు చెయాలని ఆమె వ్యంగ్య వ్యాఖ్యలు చేసింది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular