Mahesh Babu: 20 ఏళ్లుగా మహేష్ తో సినిమా కోసం స్టార్ డైరెక్టర్ వెయిటింగ్?

Mahesh Babu: టాలీవుడ్ లోనే అగ్రహీరో మహేష్ బాబు. ఆయనతో సినిమా కోసం ఎంతో మంది దర్శకులు కథలో క్యూలో ఉంటారు. ఆయన అంగీకరించడం కోసం సంవత్సరాల తరబడి ఎదురుచూస్తుంటారు. మంచి కథా కథనాలను ఎంచుకొని మహేష్ బాబు హిట్స్ కొడుతుంటాడు. తాజాగా ‘సర్కారువారి పాట’ చిత్రంతో మహేష్ బాబు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా పాజిటివ్ టాక్ తో అలరిస్తోంది. ఈ చిత్రం తర్వాత మహేష్ బాబు చేతిలో చాలా పెద్ద ప్రాజెక్టులు లైన్లో ఉన్నాయి. […]

Written By: NARESH, Updated On : May 13, 2022 12:05 pm
Follow us on

Mahesh Babu: టాలీవుడ్ లోనే అగ్రహీరో మహేష్ బాబు. ఆయనతో సినిమా కోసం ఎంతో మంది దర్శకులు కథలో క్యూలో ఉంటారు. ఆయన అంగీకరించడం కోసం సంవత్సరాల తరబడి ఎదురుచూస్తుంటారు. మంచి కథా కథనాలను ఎంచుకొని మహేష్ బాబు హిట్స్ కొడుతుంటాడు.

తాజాగా ‘సర్కారువారి పాట’ చిత్రంతో మహేష్ బాబు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా పాజిటివ్ టాక్ తో అలరిస్తోంది. ఈ చిత్రం తర్వాత మహేష్ బాబు చేతిలో చాలా పెద్ద ప్రాజెక్టులు లైన్లో ఉన్నాయి. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా త్వరలో చేయబోతున్నాడు. ఆ తర్వాత దర్శక దిగ్గజం రాజమౌళి దర్శకత్వంలో ప్యాన్ ఇండియా మూవీని చేయబోతున్నాడు. మరో ఐదేళ్ల పాటు మహేష్ బాబు డైరీలో ఖాళీ లేదు.ఒక సంవత్సరం త్రివిక్రమ్ మూవీకి కేటాయిస్తే రాజమౌళి సినిమాకు ఎంత లేదన్నా ఓ రెండేళ్లు పడుతుంది. సో మరో ఐదేళ్ల పాటు మహేష్ బాబు మరో సినిమా చేయడం కష్టమే.

అయితే టాలీవుడ్ లో ఒక దర్శకుడు మాత్రం మహేష్ బాబు కోసం ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 20 ఏళ్లుగా ఎదురుచూస్తేనే ఉన్నాడు. ఈ ఆశ్చర్యకర విషయాన్ని తాజాగా ఆ దర్శకుడే బయటపెట్టాడు.కమర్షియల్ చిత్రాలను తెరకెక్కించడంలో అందెవేసిన చేయిగా ఉన్న దర్శకుడు సముద్ర తాజాగా ఈ విషయాన్ని బయటపెట్టాడు.

సింహరాశి, శివరామరాజు, మహానంది, ఎవడైతే నాకేంటి వంటి సూపర్ హిట్ సినిమాలు దర్శకుడు సముద్ర ఖాతాలో ఉన్నాయి. మహేష్ బాబు వరుస ఫ్లాప్ ల తర్వాత ‘ఒక్కడు’ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. ఆ సమయంలో మహేష్ తో సినిమా చేయడానికి చాలా మంది ఎగబడ్డారు.ఈ క్రమంలోనే దర్శకుడు సముద్ర కూడా తనకు బాగా తెలిసిన ప్రకాష్ రాజ్ ద్వారా మహేష్ బాబును కలిశాడు. మహేష్ కు సముద్ర తన కథను వినిపించాడు. సింగిల్ సిట్టింగ్ లోనే ఈ కథ మహేష్ బాబుకు బాగా నచ్చేసింది. కథ పూర్తిగా మాస్, యాక్షన్ తో నిండి ఉండడమే.

కానీ అప్పుడు నిర్మాణ సంస్థ సూపర్ గుడ్ ఫిలింస్ సంస్థ వారు బడ్జెట్ ఎక్కువైందని వెనక్కి తగ్గడంతో అలా మహేష్-సముద్ర సినిమా పట్టాలెక్కలేదు. అయితే మహేష్ బాబుతో టచ్ లోనే సముద్ర ఉన్నాడట.. వరుసగా నిజం నుంచి ఖలేజీ వరకూ మహేష్ బాబును కలుస్తూ సినిమా కోసం ప్రయత్నించాడు.

అయితే మహేష్ బాబు తర్వాత బ్లాక్ బస్టర్స్ కొట్టి స్టార్ హీరోగా ఎదిగాడు. అలాంటి కథలకు మంగళం పాడారు. ఇప్పుడు స్టార్ దర్శకులతోనే సినిమాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే మహేష్ బాబు ఎప్పుడు కలిసినా ‘కథ ఇంకా ఏదైనా ఉందా? అని అడుగుతున్నాడని’ సముద్ర తెలిపారు. అయితే వరుస ఫ్లాప్ లతో సముద్రకు ఇప్పుడు బ్యాడ్ టైం రావడంతో మహేష్ చాన్స్ ఇచ్చే అవకాశమే లేదు. ఒక్క హిట్ ఇచ్చి ఇంకోసారి మహేష్ ను కలుస్తానని అంటున్నారు. మరి ఈయన కల నిజం అవుతుందా? లేదా ? అన్నది చూడాలి.
Recommended Videos