Homeట్రెండింగ్ న్యూస్Chennai Rats: ఎలుకలు చేసిన పనికి.. నిర్దోషులుగా బయటికొచ్చారు.. అసలు ఏం జరిగిందంటే?

Chennai Rats: ఎలుకలు చేసిన పనికి.. నిర్దోషులుగా బయటికొచ్చారు.. అసలు ఏం జరిగిందంటే?

Chennai Rats: గంజాయి కేసులో పట్టుబడిన ఇద్దరు నిందితులు ఎలుకల పుణ్యాన నిర్దోషులుగా విడుదలయ్యారు. కోర్టు కేసు కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది. ఇది వినడానికి విడూరంగా ఉన్నా చెన్నైలో నిజంగానే జరిగింది. దేశాన్ని, యువతను పట్టిపీడిస్తున్న మహమ్మారి డ్రగ్స్‌. మత్తుకు బానిసై యువత వారి భవిష్యత్‌ను అంధకారంలోకి నెట్టేసుకుంటున్నారు. డ్రగ్స్‌ నియంత్రణకు ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకొస్తున్నా పూర్తి స్థాయిలో అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. మాదకద్రవ్యాల మత్తులో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. డ్రగ్స్‌కు బానిసై వారి జీవితాలను చిత్తు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో గంజాయి కేసులో పట్టుబడిన ఇద్దరు నిందితులు ఎలుకల కారణంగా నిర్దోషులుగా బయటికొచ్చారు.

రెండేళ్ల క్రితం స్మగ్లర్ల అరెస్ట్‌..
కఠినమైన రూల్స్‌ ఉన్నా, పోలీసులు నిరంతరం నిఘా పెడుతున్నా డ్రగ్స్‌ సరఫరా మాత్రం ఆగడం లేదు. రెండేళ్ల క్రితం మెరీనా బీచ్‌ లో ఇద్దరు స్మగ్లర్లు గంజాయిని విక్రయిస్తుండగా పోలీసులు వారిని అరెస్టు చేశారు. వారి నుంచి 22 కేజీల గంజాయిని సీజ్‌ చేశారు పోలీసులు. అందులోంచి కొంత భాగాన్ని పరీక్షల కోసం పంపించారు. పోలీసులు చార్జిషీట్‌ ఫైల్‌ చేసి కోర్టుకు సమర్పించారు. అప్పటి నుంచి ఈ కేసు చెన్నై మాదకద్రవ్యాల నియంత్రణ ప్రత్యేక కోర్టులో విచారణ జరుగుతోది. సీజ్‌ చేసిన 22 కేజీల గంజాయిలో టెస్టుల కోసం కొంత పోగా 21 కేజీల 900 గ్రాముల గంజాయిని పోలీసుల భద్రపరిచారు.

గంజాయి మాయం చేసిన ఎలుకలు..
అయితే కేసు విచారణ సమయంలో ఎవిడె¯Œ ్స గా గంజాయిని చూపించాల్సిన సమయంలో పోలీసులు వారి ఆధీనంలో ఉన్న 21 కేజీల 900 గ్రాముల గంజాయికి బదులు 11 కేజీలు మాత్రమే కోర్టుకు సమర్పించారు. మిగిలిన మొత్తం ఏమైందని కోర్టు పోలీసులను ప్రశ్నించగా ఎలుకలు తిన్నట్లుగా చెప్పారు. పోలీసులు చెప్పిన ఈ సమాధానం తీవ్ర చర్చకు దారితీసింది. పోలీసులు చార్జి షీట్లో తెలిపిన విధంగా కోర్టులో సాక్ష్యాధారాలను సమర్పించలేకపోయారని, దీంతో ఈ కేసును కొట్టివేస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. గంజాయి నిందితులను నిర్దోషులుగా విడుదల చేసింది. ఎలుకల పుణ్యమాని నిందితులు జైలు శిక్ష తప్పించుకోవడంతో చర్చకు దారితీసింది.

ఇంటి దొంగల పనేనా?
అయితే గంజాయి మాయంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గంజాయి తినే పదార్థం కాదు. ఎలుకలకు ఇష్టమైన ఆహారం అంతకన్నా ఆకదు. అయినా పోలీసులు కోర్టుకు ఎలుకలు తిన్నాయనడం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఇది ఇంటిదొంగల పనే అయి ఉంటుందని పలువురు పేర్కొంటున్నారు. దానిని కప్పిపుచ్చుకునేందుకు ఎలుకలు తిన్నాయని పేర్కొంటున్నారని అంటున్నారు. ఏది ఏమైనా.. గంజాయి తగ్గడంతో స్మగ్లర్లు నిర్దోషులుగా బయటకు వచ్చారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version