spot_img
Homeఎంటర్టైన్మెంట్Producer Naveen Yerneni: మూడు రోజులుగా ఐటీ సోదాలు... ఆసుపత్రి పాలైన పుష్ప 2 నిర్మాత...

Producer Naveen Yerneni: మూడు రోజులుగా ఐటీ సోదాలు… ఆసుపత్రి పాలైన పుష్ప 2 నిర్మాత నవీన్ ఎర్నేని!

Producer Naveen Yerneni
Producer Naveen Yerneni

Producer Naveen Yerneni టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థగా మైత్రీ మూవీ మేకర్స్ పై మూడు రోజులుగా ఐటీ సోదాలు జరుగుతున్నాయి. అధికారుల దాడుల్లో కీలక విషయాలు బహిర్గతం అయినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో నేడు మైత్రీ మూవీ మేకర్స్ అధినేతల్లో ఒకరైన నవీన్ ఎర్నేని అనారోగ్యానికి గురి కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. అనారోగ్య సమస్యలతో నవీన్ ఎర్నేని హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వెల్లడించారు. సడన్ గా నవీన్ ఎర్నేని అనారోగ్యం బారిన పడటం వెనుక కారణాలు ఏంటనే చర్చ మొదలైంది.

గత మూడు రోజులు, ఐటీ, ఈడీ అధికారులు మైత్రీ మూవీ మేకర్స్ కార్యాలయాలు, నివాసాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. భారీ సినిమాలకు సంబంధించిన పెట్టుబడుల విషయంలో అవకతవకలు జరుగుతున్నాయని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అలాగే టాక్స్ లు కూడా సక్రమంగా చెల్లించడం లేదనేది అధికారుల ఆరోపణగా తెలుస్తుంది. విదేశాల నుండి పెద్ద మొత్తంలో మైత్రి మూవీ మేకర్స్ డబ్బులు తీసుకొస్తున్నారని, రాజకీయ వేత్తలు తమ అక్రమ సంపాదన వీరి ద్వారా సినిమాల్లో పెట్టుబడులుగా పెడుతున్నారనే వాదన కూడా ఉంది.

సోదాల్లో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. సినిమాల్లో వచ్చిన లాభాలతో భారీగా ఆస్తులు కొనుగోలు చేసినట్లు గుర్తించారు. హైదరాబాద్ పరిశ్రమ ప్రాంతాల్లో స్థలాలు కొన్నట్లు డాక్యుమెంట్స్ లభించాయి. మైత్రీ మూవీ మేకర్స్ తో వరుసగా సినిమాలు చేస్తున్న సుకుమార్ మీద కూడా ఐటీ అధికారులు దృష్టి పెట్టారు. మూడు రోజులుగా ఆయన ఇల్లు, కార్యాలయాలను సోదా చేస్తున్నారు. సుకుమార్ సైతం స్థలాల మీద కోట్లు పెట్టుబడి పెట్టినట్లు తెలుస్తుంది.

Producer Naveen Yerneni
Producer Naveen Yerneni

సుకుమార్ గత రెండు చిత్రాలు రంగస్థలం, పుష్ప మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో తెరకెక్కాయి. మూడో చిత్రం పుష్ప 2 సైతం వారే నిర్మిస్తున్నారు. 2015లో చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన మైత్రీ మూవీ మేకర్స్ అనతికాలంలో అతిపెద్ద నిర్మాణ సంస్థగా అవతరించింది. పుష్ప 2తో పాటు పవన్ కళ్యాణ్-హరీష్ శంకర్ మూవీ. విజయ్ దేవరకొండతో ఖుషి చిత్రం చేస్తున్నారు. ఎన్టీఆర్ 31, రామ్ చరణ్-బుచ్చిబాబు చిత్రాలను ప్రకటించారు. ఒక్కో ప్రాజెక్ట్ బడ్జెట్ రూ. 200 కోట్లకు పైమాటే. ఈ సంక్రాంతికి మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య విజయాలు సాధించాయి.

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Related News

Most Popular

AP Rain Alert

AP Rain Alert: ఏపీలో మారిన వాతావరణం.. ఆ జిల్లాలకు హెచ్చరిక!

AP Rain Alert: దేశవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఆశించిన స్థాయిలో వర్షాలు పడటం లేదు. వర్షపాతం లోటు కనిపిస్తోంది. ఎల్ నినో ప్రభావం స్పష్టంగా ఉంది. ఇటువంటి తరుణంలో మళ్లీ వాతావరణం...
Polavaram Project

Polavaram Project: ‘పోలవరం’ ముహూర్తం ఫిక్స్.. చంద్రబాబా..మజాకా!

Polavaram Project: ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటుతోంది. ప్రజల్లో కొంత సంతృప్తి కనిపిస్తోంది. ఒకవైపు సంక్షేమ పథకాలు, మరోవైపు భారీగా రాష్ట్రానికి పెట్టుబడులు, ఇంకోవైపు మౌలిక వసతుల కల్పన వంటి...
Sonam Wangchuk

Sonam Wangchuk: సోనమ్ వాంగ్ చుక్ కు సల్మాన్ ఇంటి భోజనం..

Sonam Wangchuk: పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్ చుక్ మొత్తానికి తన దీక్ష విరమించారు.. నీట్ అక్రమాలపై విచారణ జరిపించాలని.. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని.. నీట్...
Allu Arjun

Allu Arjun: అల్లు అర్జున్ తో పోటీ పడాలంటే ఆ హీరో కి ఈ క్వాలిటీ ఉండాలి…

Allu Arjun: 'ఆర్య' సినిమాతో స్టైలిష్ స్టార్ గా పేరు సంపాదించుకున్న అల్లు అర్జున్ 'పుష్ప' సినిమాతో ఐకాన్ స్టార్ గా అవతరించాడు. ఈ సినిమాతో 1850 కోట్లకు పైన కలెక్షన్స్...
Pakistan Economy

Pakistan Economy: బిచ్చం ఎత్తుకుంటున్న పాకిస్థాన్..

Pakistan Economy: దాయాది పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి దారుణంగా మారింది. బిచ్చం ఎత్తుకొనే స్థాయికి పతనమైంది. ఇంకా ఎక్కడిదాకా వెళ్తుందో తెలియదు.. ఇప్పుడైతే ఆ దేశం పరిస్థితి బాగోలేదు. ఇకపై బాగుపడుతుందనే నమ్మకం...
Oktelugu Epaper