
Manchu Lakshmi Helth: మంచు లక్ష్మి తాను ప్రయాణించిన విమానయాన సంస్థ మీద అసహనం వ్యక్తం చేశారు. తీవ్ర జ్వరంతో బాధపడుతున్నప్పటికీ ఎలాంటి సహాయం చేయలేదని సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. మంచు లక్ష్మి తిరుపతి నుండి హైదరాబాద్ ఫ్లైట్ లో వచ్చారట. ఈ ప్రయాణంలో ఆమె అనారోగ్యానికి గురయ్యారట. 103 డిగ్రీల జ్వరం వచ్చిందట. హైదరాబాద్ ఎయిర్ పోర్టులో సహాయం కోసం తాను ప్రయాణించిన విమాన సంస్థ సిబ్బంది అడిగారట. 40 నిమిషాలు వేచి చూసినా ఆమెకు వైద్యం అందలేదట. నేను తిరుపతి నుండి హైదరాబాద్ కి వచ్చిన సమయం కంటే అధిక సమయం వైద్య సహాయం కోసం వేచి చూశానని మంచు లక్ష్మి అన్నారు.
ప్యాసింజర్స్ పట్ల సదరు సంస్థకు బాధ్యత లేదని ఆమె చెప్పకనే చెప్పారు. ఈ మధ్య విమానయాన సంస్థలపై ఫిర్యాదులు ఎక్కువయ్యాయి. ఆ మధ్య అనసూయ కూడా సరైన సౌకర్యాలు లేవని అసహనం వ్యక్తం చేశారు. మంచు మనోజ్-మౌనిక తిరుమల తిరుపతి దేవస్థానం సందర్శించారు. వీరితో పాటు మంచు లక్ష్మి కూడా తిరుమల వెళ్లడం జరిగింది. అక్కడ నుండి హైదరాబాద్ కి వచ్చే క్రమంలో ఆమె అనారోగ్యానికి గురయ్యారట. గత వారం రోజులుగా మంచు లక్ష్మి విశ్రాంతి లేకుండా పని చేస్తున్నారు. అందుకే ఆమెకు జ్వరం వచ్చినట్లు తెలుస్తుంది.
మార్చి 3న మనోజ్-మౌనికల వివాహం జరిగింది. ఈ పెళ్ళికి మంచు లక్ష్మి అన్నీ తానై వ్యవహరించారు. కారణం తెలియదు కానీ మంచు లక్ష్మి నివాసంలో పెళ్లి జరిగింది. మోహన్ బాబుకు ఈ పెళ్లి ఇష్టం లేకపోవడంతో అక్క ముందుకొచ్చి తంతు పూర్తి చేశారని టాక్. అయితే మోహన్ బాబు పెళ్ళికి హాజరయ్యారు. వధూవరులను ఆశీర్వదించారు. మౌనిక మామయ్య మోహన్ బాబును చూసి ఎమోషనల్ అయ్యారు.

అన్నయ్య మంచు విష్ణు మాత్రం ఆంటీ ముట్టనట్లు వ్యవహరించారు. ఆయన చుట్టపు చూపుగా వచ్చి వెళ్లిపోయాడని సమాచారం. ఆయన మంచు మనోజ్ పెళ్లి ఫొటోల్లో కనిపించకపోవడం కొసమెరుపు. మౌనిక కారణంగా మనోజ్ ఫ్యామిలీకి దూరమయ్యాడనే వాదన ఉంది. మౌనిక విషయంలో కుటుంబ సభ్యులు అసంతృప్తిగా ఉన్నారన్నది మాత్రం నిజం.
I got to hyd from tpt quicker than @IndiGo6E staff helping me at the airport. They’ve just disappeared. Having 103 fever doesn’t help either. @IndiGo6E isn’t there a process???? pic.twitter.com/qJbsg2pbCQ
— Manchu Lakshmi Prasanna (@LakshmiManchu) March 6, 2023