Mahesh’s Daughter Sitara : అలాంటి ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో పెట్టిన మహేష్ కూతురు సితార… మండిపడుతున్న నెటిజన్లు!

Mahesh’s daughter Sitara : పదేళ్ల ప్రాయానికే సపరేట్ ఫ్యాన్ బేస్ మైంటైన్ చేస్తుంది సితార ఘట్టమనేని. సూపర్ స్టార్ మహేష్ గారాల పట్టికి విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. సోషల్ మీడియాలో సితార చాలా యాక్టీవ్ గా ఉంటారు. ఫోటో షూట్స్, డాన్స్ వీడియోలు షేర్ చేస్తుంటారు. వయసు చిన్నదే అయినా అవగాహన పెద్దది. పలు విషయాల మీద సితార సోషల్ మీడియాలో స్పందిస్తూ ఉంటారు. ఈమెకు యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. అందులో సోషల్ అవేర్నెస్ […]

Written By: Shiva, Updated On : April 9, 2023 6:33 pm
Follow us on

Mahesh’s daughter Sitara : పదేళ్ల ప్రాయానికే సపరేట్ ఫ్యాన్ బేస్ మైంటైన్ చేస్తుంది సితార ఘట్టమనేని. సూపర్ స్టార్ మహేష్ గారాల పట్టికి విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. సోషల్ మీడియాలో సితార చాలా యాక్టీవ్ గా ఉంటారు. ఫోటో షూట్స్, డాన్స్ వీడియోలు షేర్ చేస్తుంటారు. వయసు చిన్నదే అయినా అవగాహన పెద్దది. పలు విషయాల మీద సితార సోషల్ మీడియాలో స్పందిస్తూ ఉంటారు. ఈమెకు యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. అందులో సోషల్ అవేర్నెస్ వీడియోలు పోస్ట్ చేస్తుంటారు.

సితార పనులకు మహేష్ అభిమానులు మురిసిపోతుంటారు. అయితే తాజాగా ఆమె చేసిన పని విమర్శల పాలైంది. సితార ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఫోటోలను కొందరు తప్పుబడుతున్నారు. సితార కారులో ప్రయాణం చేస్తూ డోర్ గ్లాస్ క్రిందకు దించి తల బయటకు పెట్టారు. కారు వెళుతుండగా గాలిని, నేచర్ ని ఆస్వాదిస్తునట్లు ఆ ఫోటోలు ఉన్నాయి. ఈ ఫోటోలపై వ్యతిరేకత వ్యక్తం అవుతుంది.

మూవింగ్ కారులో నుండి తల బయట పెట్టడం ప్రమాదం. నిన్ను చూసి చాలా మంది ఇలాంటి పనులు చేస్తారు. వారికి ఏదైనా జరిగే అవకాశం ఉంటుంది. నువ్వు ఇటువంటి చర్యలు మానుకో అంటూ హెచ్చరించారు. నీకేమైనా కావచ్చు… జాగ్రత్త అంటూ మంచి చెబుతున్నారు. సితార చాలా కాలంగా ఇంస్టాగ్రామ్ అకౌంట్ కలిగి ఉన్నారు. తరచుగా పోస్ట్స్ పెడుతుంటారు. ఏనాడూ ఈ స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం కాలేదు.

ప్రస్తుతం సితార ఫ్రాన్స్ లో ఉన్నారు. కొద్దిరోజుల క్రితం తల్లి నమ్రత, అన్నయ్య గౌతమ్ తో పాటు సితార ఫ్రాన్స్ వెళ్లారు. అక్కడ సమ్మర్ వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ట్రిప్ మహేష్ మిస్ అయ్యాడు. సాధారణంగా ప్రతిసారి నలుగురు కుటుంబ సభ్యులు కలిసి వెళతారు. దర్శకుడు త్రివిక్రమ్ తో చేస్తున్న మూవీ షూటింగ్ నిరవధికంగా జరుగుతుంది. ఈ క్రమంలో మహేష్ వెళ్లలేకపోయారు. అయితే త్వరలో ఆయన ఈ ట్రిప్ జాయిన్ అవుతారనే ప్రచారం జరుగుతుంది.

మహేష్ 28వ చిత్రంగా తెరకెక్కుతుంది. టైటిల్ ప్రకటించాల్సి ఉంది. పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్స్ గా నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ ఈ చిత్ర నిర్మాతగా ఉన్నారు. 2024 సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.