Monalisa
Monalisa : ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రం ప్రయాగ్రాజ్లో అట్టహాసంగా మహా కుంభమేళా జరుగుతోంది. ఈ సమయంలోనే తేనెకళ్లు, డస్కీ స్కిన్తో అందరి దృష్టిని ఆకర్షించింది మోనాలిసా. ప్రస్తుతం తానో ఫేమస్ సెలబ్రిటీ అయిపోయింది. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన మోనాలిసా.. కుంభమేళాలో రుద్రాక్షలు, పూసల దండలు అమ్ముకునేందుకు వెళ్లగా.. అక్కడ సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు.. ఆమె ఫోటోలు, వీడియోలు తీసి అప్ లోడ్ చేయడంతో వైరల్ అయ్యాయి. ఆమె ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది. కుంభమేళాలో ఓవర్నైట్ స్టార్గా మారడంతో ఆమెను చూసేందుకు జనం ఎగబడ్డారు. దీంతో కుటుంబ భద్రత దృష్ట్యా మోనాలిసా తండ్రి ఆమెను తమ స్వగ్రామానికి పంపేశాడు.
ఆ తర్వాత కూడా ఆమె వైరల్ కావడంతో.. బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా ఆమెకు సినిమా ఆఫర్ ఇచ్చారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. మోనాలిసా ముంబైలో యాక్టింగ్ ట్రైనింగ్ తీసుకుంటోంది. అయితే తాజాగా డైరెక్టర్ సనోజ్ మిశ్రాతో కలిసి మోనాలిసా కేరళకు వెళ్లింది. మొట్టమొదటిసారి విమానం ఎక్కిన మోనాలిసా.. ఎయిర్పోర్టులో ఎస్కలేటర్ ఎక్కేందుకు చాలా ఇబ్బంది పడింది. డైరెక్టర్ సనోజ్ మిశ్రా.. మోనాలిసాను ఎస్కలేటర్ ఎక్కించి అక్కడి నుంచి తీసుకెళ్లారు.
ఈ క్రమంలోనే కేరళ కోజికోడ్లోని చెమ్మనూర్ జ్యువెలర్స్ షోరూమ్ ప్రారంభోత్సవానికి మోనాలిసా స్పెషల్ గెస్ట్ గా హాజరైంది. దీంతో మోనాలిసాను చూసేందుకు స్థానికులు భారీగా అక్కడికి చేరుకున్నారు. ఆమె రాక గురించి తెలియడంతో యువకులు ఆ జ్యువెలరీ షాప్ వద్దకు భారీగా చేరుకున్నారు. యూత్ మోనాలిసాతో ఫోటోలు, సెల్ఫీలు తీసుకునేందుకు ఎగబడ్డారు. ఈ క్రమంలోనే ఆమె వారికి చేతులు ఊపుతూ హాయ్ చెప్పింది. వీటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
తాజాగా మోనాలిసా మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ఆమె విమానంలో కూర్చుని కనిపిస్తుంది. మోనాలిసా తన జీవితంలో మొదటిసారి విమానంలో కూర్చుంది. ఆ తర్వాత ఆమె రెస్పాన్స్ వైరల్ అయింది. ఈ సమయంలో మోనాలిసా చాలా భయపడినట్ల కనిపించింది. వారు ఇండోర్ నుండి కేరళకు ప్రయాణించాడు. మోనాలిసా మణిపూర్ డైరీస్ అనే చిత్రంలో నటిస్తోంది. మహా కుంభమేళాలో కొన్ని రోజులు గడిపిన తర్వాత, మోనాలిసాకు సినిమా ఆఫర్ వచ్చినప్పుడు, ఆమె ఆనందానికి అవధులు లేవు. మొదటిసారి విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత మోనాలిసా ముఖంలో చిరునవ్వు అందరి దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు మోనాలిసా ఒక కార్యక్రమానికి హాజరు కావడానికి కేరళకు వెళ్లింది. దీని కోసం, ఆమె ఇండోర్లోని దేవి అహిల్య బాయి హోల్కర్ స్టేడియం నుండి బయలుదేరింది.మోనాలిసాతో పాటు చిత్ర దర్శకుడు సనోజ్ మిశ్రా కూడా ఉన్నారు. విమానం ఎక్కిన తర్వాత, మోనాలిసాను ఎలా ఉందని అడిగినప్పుడు భయంగా ఉందని చెప్పింది. ఈ వీడియోను మోనాలిసా భోంస్లే తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. దీనిని ఇప్పటివరకు వేలాది మంది వీక్షించారు. చాలా మంది ఈ వీడియోను లైక్ చేశారు. సోషల్ మీడియా వినియోగదారులు వీడియోకు అనేక కామెంట్స్ ఇస్తున్నారు.
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Kumbh mela viral girl travels by plane for the first time today
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com