spot_img
Homeట్రెండింగ్ న్యూస్Earth: ఇంకా 17 ఏళ్లే.. మానవ జాతి పతనం అప్పుడే?

Earth: ఇంకా 17 ఏళ్లే.. మానవ జాతి పతనం అప్పుడే?

Earth: భూమి ఎప్పుడు పుట్టిందో తెలుసా.. ఇప్పుడు భూమి వయసు ఎంతో తెలుసా. ఎవరికీ స్పష్టంగా తెలియదు. ఈ రహస్యం ఛేదించేందుకు శాస్త్రవేత్తలు ఏళ్లుగా పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. విశ్వంలో దాగిఉన్న రహస్యాలను ఛేదిస్తున్నారు. ఈ క్రమంలో భూమి గురించి కూడా కొన్ని ప్రయోగాలు చేసి భూమి వయసు కనుగొన్నారు. ప్రస్తుతం భూమి వయసు 4.5 బిలియన్‌ ఏళ్లకంటే ఎక్కువే అని తేల్చారు. ఇక​భూమి ఉద్భవించినప్పుడు ఎలాంటి జీవరాశి లేదని పేర్కొన్నారు.

మానవ పుట్టుకకు ముందే..
ఇక భూమిపై మానవుడి పుట్టుకకు ముందే చెట్లు, నదులు, పర‍్వతాలు, వివిధ రకాల జంతువులు ఉన్నాయని పరిశోధనలో గుర్తించారు. ఈ క్రమంలోనే మానవుడు ఉనికిలోకి వచ్చారని తెలిపారు. క్రమంగా మానవ జనాభా పెరిగి ప్రపంచంలో ప్రతీ మూలను పాలించే స్థాయికి చేరుకున్నట్లు వెల్లడించారు. కోతి నుంచి పుట్టిన మనిషి ఎంతో అభివృద్ధి చెంది ఇప్పడు మర మనుషులనే తయారు చేస్తున్నాడు. భూమి వెలుపల ఉండే అంతరిక్షంలోకి ప్రయాణించడం ప్రారంభించాడు. నేడు విశ్వవ్యాప్తంగా కంప్యూటర్లు ఉపయోగిస్తున్నారు. వీటిసహాయంతో ఎన్నో అంచనాలు వేయవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

టెక్నాలజీలో ముందంజ..
భూమి పుట్టుకను ఛేదించే పరిశోధనలతోపాటు అనేక అంశాల్లో మానవుడు సాంకేతికతను వినియోగిస్తున్నారు. టెక్నాలజీలో ముందు వరుసలో ఉన్నాడు. ఇంటి పనులు మొదలుకుని, కృత్రిమ మేధస్సును ఉపయోగించడం వరకు ప్రతీ పనికి యంత్రాలపై ఆధారపడుతున్నారు. ఈ క్రమంలోనే కొంతమంది శాస్త్రవేత్తలు మానవులు ఎప్పుడు ఉనికిలో లేకుండా పోతారు అన్న అంచనాలను వేయడానికి కూడా సాంకేతికతను ఉపయోగిస్తున్నారు.

కంప్యూటర్ మోడలింగ్ సాయంతో..
మసాచుసెట్స్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలోని శాస్త్రవేత్తల బృందం జనాభా, సహజ వనరులు, శక్తి వినియోగం వంటి అంశాలపై బహుళ డేటా నమూనాలు పరిగణనలోకి తీసుకుంటున్నారు. దీనిద్వారా మానవ మనుగడను అంచనా వేస్తున్నారు. ఇందుకు కంప్యూటర్‌ మోడలింగ్‌ను ఉపయోగించి వెబ్‌సైట్‌ లాడ్‌ బైబిల్‌ నివేదిస్తుంది. క్లబ్‌ ఆఫ్‌ రోమ్‌ ప్రచురించిన అధ్యయనం, రాబోయే ‘పరిణామానికి పరిమితుల’ ను తెలుపుతుంది.

పతనం అప్పుడే..
ఈ పరిశోధనల ద్వారా 21వ శతాబ్దం మధ్యలో సమాజం పతనం అవుతుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. కొన్ని నివేదికల ప్రకారం మానవజాతి అంతరించడానికి ఇంకా రెండు దశాబ్దాల కన్నా తక్కువ సమయమే ఉందని చెబుతున్నారు. కచ్చితమైన లెక్కలు వేస్తే 2040లో పతనం జరుగుతుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అంటే ఇంకా 17 ఏళ్లలో మానవ జాతి పతనం అవుతుంది అని చెబుతున్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Jana Nayagan Advance Bookings

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఓపెనింగ్ రికార్డు ని బ్రేక్ చేయకుండానే రిటైర్ అయిపోయిన సీఎం విజయ్..

Pawan Kalyan : ఈమధ్య కాలం లో సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ , విజయ్ ల మధ్య పోలికలు పెడుతూ , అభిమానుల మధ్య జరుగుతున్న ఫ్యాన్ వార్స్ ని మన...
Venkatesh Kalyan Ram Movie

Anil Ravipudi Movie : వెంకటేష్ , అనిల్ రావిపూడి కొత్త సినిమా మేకింగ్ వీడియో వచ్చేసింది.. ఈ...

Anil Ravipudi Movie : వెంకటేష్, కళ్యాణ్ రామ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వం లో రీసెంట్ గానే ఒక సినిమా మొదలైన సంగతి తెలిసిందే. కీర్తి సురేష్ , కృతి శెట్టి...
CBI Probe into Kaleshwaram Project

Revanth Reddy : మేడిగడ్డలో కాలేసిన రేవంత్‌రెడ్డి.. మొన్న లిఫ్టింగ్‌ కుదరదని.. నేడు కేంద్రానికి లేఖ!

Revanth Reddy : తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి.. ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌పై ఎప్పుడు తనదే పైచేయి అని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ప్రతిపక్షం రేవంత్‌ ఏ మిషయంలోనూ తమకు పోటీ కాదని విమర్శలు...
R Madhavan

R Madhavan: హీరో మాధవన్ అదృశ్యం.. విద్యార్థుల గాలింపు.. అసలు ఏమి జరిగిందంటే..

R Madhavan: ఢిల్లీ లోని పార్లమెంట్ ఆవరణలో గత కొద్దీ రోజుల నుండి కాక్రోచ్ పార్టీ ఆద్వర్యం లో జరుగుతున్న విద్యార్థుల నిరసన కార్యక్రమాలు ఏ రేంజ్ లో జరుగుతున్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం...
Jaya Krishna Ghattamaneni

Jaya Krishna Ghattamaneni: బయట హీరోల్లో ఆ స్టార్ హీరో కి వీరాభిమాని అంటూ ఘట్టమనేని జయకృష్ణ హాట్...

Jaya Krishna Ghattamaneni: సూపర్ స్టార్ కృష్ణ రెండవ తనయుడు , మహేష్ బాబు సోదరుడు , రమేష్ బాబు కుమారుడిగా జయ కృష్ణ ఘట్టమనేని ఇండస్ట్రీ లోకి హీరో గా...
Oktelugu Epaper